అనంత్ అంబానీ-రాధిక పెళ్లి పుణ్యమా అంటూ ముంబైలో స్టార్ హోటళ్లకు కాసుల పంట పండబోతుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్లు జూలై 12న మూడు ముళ్లతో ఈ జంట ఒక్కటి కాబోతుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్)కి కేంద్ర ఎన్నికల సంఘం ఊరటనిచ్చే కబురు చెప్పింది. ప్రజల నుంచి విరాళాలను స్వీకరించడానికి శరద పవార్ పార్టీకి అనుమతించింది.
ఇజ్రాయెల్ మరోసారి విజృంభించింది. గాజాపై బాంబులతో విరుచుకుపడింది. గాజా నగరంపై టెల్ అవీవ్ దళాలు ముప్పేట దాడి చేశాయి. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి.
ప్రధాని మోడీ రష్యా చేరుకున్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం తర్వాత తొలిసారి రష్యా గడ్డపై మోడీ అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ప్రధాని రష్యాకు బయల్దేరి వెళ్లారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి రోస్ అవెన్యూ కోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోసం ఆమె అభ్యర్థించారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్, అస్సాం, మహారాష్ట్రల్లో వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
జార్ఖండ్లో మంత్రివర్గ విస్తరణ జరిగింది. సోమవారం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణ చేశారు. దీంతో మిత్ర పక్షాలతో సహా పలువురు జేఎంఎం నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్కు కూడా మంత్రివర్గంలో చోటు లభించింది. రాంచీలోని
మధ్యప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. సోమవారం మినీ కేబినెట్ విస్తరణ జరిగింది. అయితే ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే రాంనివాస్ రావత్కు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రివర్గంలో చోటు కల్పించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ముగిశాయి. సోమవారం ఉదయం ఆరంభంలోనే సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముగింపు వరకు అలానే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 36 పాయింట్లు నష్టపోయి 79, 960 దగ్గర ముగియగా.. నిఫ్టీ 3 పాయింట్లు నష్టపోయి 24, 320 దగ్గర ముగిసింది.
తమిళనాడులో మరో రాజకీయ నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు, దళిత నాయకుడు ఆర్మ్స్ట్రాంగ్ హత్యను ఇంకా మరువక ముందే మరో నాయకుడిపై హత్యాయత్నం జరగడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.