మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి కోట్లాది మంది పేదోళ్ల కడుపు కొట్టిందని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ఇందిరా భవన్లో మలికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై ప్రధానంగా చర్చించారు.
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మహిళల బలహీనతను అడ్డంపెట్టుకుని కామాంధులు దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో దారుణం జరిగింది. ఉద్యోగం పేరుతో ఓ యువతిని నమ్మించి అగ్రి యూనివర్సిటీ సిబ్బంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా సంచలనంగా మారింది
ఈ ఏడాది ఆయా దేశాల నుంచి భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. చాలా మంది అమెరికా నుంచి ఎక్కువ మంది బహిష్కరణకు గురైనట్లు వార్తలు వచ్చాయి. తాజా లెక్కలను బట్టి చూస్తే అదంతా ఒట్టిదని తేలిపోయింది.
బీహార్లో గతేడాది వర్షాకాలంలో అనేక బ్రిడ్జ్లు కూలిపోయాయి. దీంతో నితీష్ కుమార్ సర్కార్పై అనేక విమర్శలు వచ్చాయి. ఇక గత నెలలో మరోసారి నితీష్ కుమార్ ప్రభుత్వం గద్దెనెక్కింది. కొత్త సర్కార్ ఏర్పడిన నెలరోజులకే ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రోప్ వే కూలిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీలోని ఇందిరా భవన్లో సీడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు పాటు ఇతర సీనియర్ నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హాజరయ్యారు.
థాయ్లాండ్-కంబోడియా మధ్య మరోసారి శాంతి ఒప్పందం జరిగింది. గత 20 రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్ పడింది. కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి.
వామ్మో.. సిల్వర్కు ఏమైంది? మునుపెన్నడూ లేని విధంగా వెండి ధర సునామీ సృష్టిస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు లక్ష రూపాయులు ఉండేది. ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ రెండు లక్షలకు దూసుకొచ్చింది. ఇక్కడితో ఆగిపోతుందేమోనని భావించారు. కానీ మరోసారి రికార్డ్ సృష్టించేందుకు పరుగులు పెడుతోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం ఫ్లోరిడాలో సమావేశం కాబోతున్నారు. రష్యాతో శాంతి ఒప్పందంపై ఇరువురి చర్చించనున్నారు. ఇలాంటి సమయంలో శనివారం తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్లో శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. దీంతో ఉక్రెయిన్ వైమానిక దళం దేశవ్యాప్తంగా వైమానిక హెచ్చరికను ప్రకటించింది.
న్యూఇయర్కు ముందు దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద 285 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయా నేరాల్లో నిందితులుగా పోలీసులు అనుమానించి అరెస్ట్ చేశారు.
అగ్ర రాజ్యం అమెరికాలో క్రిస్మస్ పండగ సమయంలో ఎయిర్లైన్స్ సంక్షోభం తలెత్తింది. ఓ వైపు క్రిస్మస్ ప్రయాణాలు.. ఇంకోవైపు శీతాకాల తుఫాను ప్రభావం విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. అమెరికా అంతటా తీవ్ర మంచు కురవడంతో ఇబ్బందులు తలెత్తాయి.