London: విమానంలో ప్రయాణికులు కొట్లాట.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- విమానంలో ప్రయాణికులు కొట్లాట
- లండన్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- ర్యాన్ఎయిర్ విమానంలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య విమానాల్లో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. కొందరు ప్రయాణికులు జుగుప్సకరంగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు దాడులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనలతో నిత్యం ఎయిర్లైన్స్కు సంబంధించి వార్తల్లో నిలుస్తున్నాయి. విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ నెలకొనడంతో టేకాఫ్ అయిన అరగంటకే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ర్యాన్ఎయిర్ విమానం బుధవారం మొరాకోలోని అగాదిర్ నుంచి లండన్కు బయల్దేరింది. ఇంతలో ఓ వ్యక్తి.. మహిళా ప్రయాణికురాలి దగ్గరకు వచ్చి తన భార్య, పిల్లలతో కూర్చోవడానికి సీటును ఇవ్వాల్సిందిగా అడిగాడు. దానికి ఆమె నిరాకరించడంతో బెదిరింపులకు దిగాడు. మహిళ భర్త అతడిని వారించడంతో వాగ్వాదం నెలకొంది. మహిళ బంధువులు సైతం అదే విమానంలో ఉండడంతో వారు సదరు వ్యక్తితో గొడవకు దిగారు.
ఇది కూడా చదవండి: SLBC Meeting: రేపు బ్యాంకర్ల కమిటీ సమావేశం.. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలుపై సీఎం ఫోకస్..
Also Read
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
ఒకరినొకరు దూషించుకుంటూ దాడికి దిగడంతో ఇతర ప్రయాణికులు, పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది విమానాన్ని మరకేష్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలోని ఓ ప్రయాణికురాలు మాట్లాడుతూ విమానంలో ఉన్న 36 నిమిషాలు ఒక నరకంలాగా అనిపిందని, పిల్లలు భయంతో ఏడుస్తూనే ఉన్నారని వాపోయింది.
ఇది కూడా చదవండి: Mercedesbenz EV: ఇండియాలో మెర్సిడెస్ ఎలక్ట్రిక్ కారు విడుదల.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 560 కి.మీ
ఇదిలా ఉండగా మరో ప్రయాణికుడు అస్వస్థతకు గురవ్వడంతో మరకేష్లో విమానం ల్యాండ్ అయిన వెంటనే వైద్యులు అతడికి ఆక్సిజన్ పెట్టారు. ఆరోగ్యం సరిగ్గా లేనందున విమానం దిగాల్సిందిగా కోరగా అందుకు నిరాకరించాడు. అయితే ఎట్టకేలకు అధికారులు అతడిని విమానం నుంచి దించారు. ఈ ఘటనలతో విమానం లండన్ చేరుకోవడానికి ఆలస్యమైంది. దీనిపై ర్యాన్ఎయిర్ అధికారులు స్పందిస్తూ .. అనారోగ్యానికి గురైన వ్యక్తికి వైద్యం చేయడానికి, విమానాన్ని తిరిగి టేకాఫ్ చేయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టిందన్నారు. కొందరి వల్ల ఇతర ప్రయాణికులకు జరిగిన ఆలస్యానికి, అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: దశాబ్ధం ముగిసినా ప్రజల గుండెల్లో ఉన్న సీఎం వైఎస్సార్..
తాజావార్తలు
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!