West Bengal Bypolls: బుధవారం అసెంబ్లీ బైపోల్స్.. టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్రపోటీ
- బుధవారం పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ బైపోల్స్
- టీఎంసీ.. బీజేపీ మధ్య తీవ్రపోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో మరోసారి బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య మినీ సంగ్రామం జరగబోతుంది. బుధవారం నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరగనుంది. దీంతో రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. విజయంపై రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇంకోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి.
ఇది కూడా చదవండి: Etela Rajender: కేసీఆర్ ఓడిపోతే ఉద్యోగాలు వస్తాయనే కాంగ్రెస్కు ఓటేశారు..
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ ఎక్కువ సీట్లు సాధించడంతో మంచి జోష్లో ఉంది. ఇక లోక్సభ సీట్లు తగ్గినా తమ సత్తా చాటుకోవాలని కమలనాథులు ప్రయత్నాలు చేస్తున్నారు. మానిక్తలా, రాయ్గంజ్, రానాఘాట్ దక్షిణ్, బగ్దాహ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ జరుగనుంది.ఉప ఎన్నికలు జరుగుతున్న 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీఎంసీతో బీజేపీ తలపడుతోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నాలుగు సీట్లలో మూడు సీట్లను బీజేపీ గెలుచుకుంది. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు అధికార టీఎంసీలోకి ఫిరాయించారు. మానిక్తాలా ఎమ్మెల్యే, టీఎంసీ నేత సాధన్ పాండే కన్నుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న నాలుగు నియోజకవర్గాల్లో మానిక్తాలా, రానాఘాట్ దక్షిణ్, బగ్దాహ్లు సౌత్ బెంగాల్లో ఉన్నాయి. పార్టీ దివంగత నేత సాధన్ పాండే భార్య సుప్తి పాండేను మానిక్తాలా నుంచి టీఎంసీ ఎన్నికల బరిలోకి దింపింది.
ఇది కూడా చదవండి: Xiaomi SU7: Xiaomi SU7 ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. ఒక్క ఛార్జ్తో 800 కి.మీ రేంజ్..
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో 42 స్థానాలకు టీఎంసీ 29 సీట్లు గెలుచుకుంది. ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉంది. 2019లో 19 లోక్సభ సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో 12 స్థానాలకు పడిపోయినప్పటికీ బగ్దాహ్, రానాఘాట్ దక్షిణ్, రాయ్గంజ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో గెలుపుపై ధీమాగా ఉంది.
#WATCH | West Bengal: Preparation and ballot box distribution underway for Maniktala Assembly by-elections, at Rabindra Bharati University, Kolkata. pic.twitter.com/VHxrVq8dNj
— ANI (@ANI) July 9, 2024
#WATCH | EVMs are being dispatched from Uttar Dinajpur, West Bengal for Raiganj assembly by-polls.
Four assembly seats of West Bengal – Ranaghat Dakshin, Bagdah, Maniktala, and Raiganj are going for by-polls tomorrow, July 10. pic.twitter.com/96TDreS5IQ
— ANI (@ANI) July 9, 2024
#WATCH | West Bengal | EVM distribution to polling officials underway in Kolkata, ahead of Maniktala Assembly bypoll on July 10 pic.twitter.com/OxLt5J87tY
— ANI (@ANI) July 9, 2024
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!