Lionel Messi: భారత్కు మళ్లీ రావడం పక్కా.. మెస్సీ భావోద్వేగం!
- భారత పర్యటనలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి
- మెస్సికి టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ టికెట్
- భారత్కు మళ్లీ రావడం పక్కా అంటున్న మెస్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ పర్యటనలో (గోట్ ఇండియా టూర్) భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ మెస్సీకి భారత్, యూఎస్ఏ టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ టికెట్లను ఐసీసీ చైర్మన్ జై షా అందజేశారు. అంతేకాదు భారత క్రికెట్ జట్టు జెర్సీ, బ్యాట్ను కూడా బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ కూడా పాల్గొన్నారు.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ 2026 జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్లో యూఎస్ఏను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ను వీక్షించేందుకు రావాలని లియోనెల్ మెస్సిని జై షా కోరారు. ఈ మేరకు మ్యాచ్కు సంబంధించిన టికెట్ను అందించారు. మెస్సీకి ప్రత్యేక గౌరవంగా ఫ్రేమ్ చేసిన క్రికెట్ బ్యాట్, టీమిండియా జెర్సీని అందించారు. మెస్సీతో పాటు వచ్చిన అతని సహచరులు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్కు కూడా జ్ఞాపికలు అందజేశారు.
Also Read
- IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్గా వైభవ్..
- Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
Also Read: IPL 2026 Auction: పవర్ హిట్టర్పై కన్నేసిన ఆర్సీబీ.. 8 మందిలో ఇద్దరు విదేశీలకు ఛాన్స్!
స్టేడియంలో లియోనెల్ మెస్సీ పేరు మార్మోగిపోయింది. అభిమానుల కేకలకు మెస్సీ భావోద్వేగం చెందారు. అభిమానుల ప్రేమపై స్పందిస్తూ.. ‘భారత్లో మాపై మీరు చూపిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం. ఈ పర్యటన చాలా తక్కువ కాలం అయినప్పటికీ ఎంతో మధురానుభూతిని ఇచ్చింది. భారత్లో ప్రేమ ఉంటుందని నాకు తెలుసు కానీ.. ప్రత్యక్షంగా అనుభవించడం అద్భుతంగా ఉంది. మీ ప్రేమకు మరోసారి ధన్యవాదాలు. మేము తప్పకుండా మళ్లీ వస్తాం. మ్యాచ్ ఆడేందుకు కావొచ్చు లేదా ఇంకే సందర్భంలో అయినా సరే కానీ భారత్కు మళ్లీ రావడం మాత్రం ఖాయం’ అని మెస్సీ అన్నారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..