iPhone 17e: యాపిల్ సంస్థ తయరు చేసే ఐఫోన్ కోసం ఎదురుచూసేవాళ్లు ఎంతో మంది ఉంటారు.. ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిందంటే చాలు.. రోజులు, గంటల తరబడి.. క్యూలైన్లో నిలబడి ఫోన్ అందుకున్న తర్వాత ఆనందంతో ఉప్పొంగి పోతారు.. అయితే, ఐఫోన్ అంటేనే.. ఖరీదైనది.. మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ కొనలేదని వెనక్కి తగ్గేవారు కొందరైతే.. ఏదేమైనా ఐఫోన్ కొనాల్సిందే అని పట్టుబట్టి కొనుగోలు చేసేవారే చాలా మంది అని చెప్పాలి.. ఇప్పుడు యాపిల్ కూడా తన పంతా […]
Unseasonal Rains Damage: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో వ్యవసాయ పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు గాలివానలు, వర్షాలు, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి 16 మండలాల్లోని 89 గ్రామాల్లో పంటలు వర్షాలతో దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనాలను […]
Best Credit Cards for Movie Offers: సినిమాలు చూడటం చాలా మందికి ఇష్టమైన వినోదం.. అయితే, ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్లలో టిక్కెట్ ధరలు పెరుగుతుండటంతో సినిమా చూడటం ఖరీదైన వ్యవహారంగా మారుతోంది.. ఓ కుటుంబం వెళ్లి సినిమా చూడాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.. ఈ పరిస్థితిలో, సినిమా టిక్కెట్లపై తగ్గింపులు, ఉచిత టిక్కెట్లు అందించే క్రెడిట్ కార్డులు ప్రేక్షకులకు మంచి ఉపశమనం ఇస్తున్నాయి. BookMyShow, Paytm Movies మరియు PVR Cinemas వంటి […]
Gautam Gambhir: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్.. తన వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏఐ డీప్ఫేక్లు, నకిలీ వీడియోలు మరియు అనధికారిక వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.. గంభీర్ తన పిటిషన్లో, తన పేరు, ముఖం, గొంతును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ విస్తృతంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి వేదికలపై ఏఐ […]
Chiranjeevi: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు. శతాబ్ద కాలంగా క్రియాయోగానికి సంబంధించి వైఎస్ఎస్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. వైఎస్ఎస్ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానందకు చిరంజీవి హైదరాబాద్లో ఓ సంస్థ తరఫున ఉగాది పురస్కారాన్ని అందజేశారు. స్వామీజీకి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా స్వామి స్మరణానంద మాట్లాడుతూ మనసుకు, శ్వాసకు సంబంధం ఉందన్నారు. శ్వాసను నియంత్రించడం ద్వారా ఆలోచనలను ప్రభావితం చేయవచ్చని, మనసును అదుపులో పెట్టుకోవచ్చన్నారు. క్రియాయోగం […]
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం తాజాగా టిడ్కో ఇళ్లకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. 83,865 మందికి గృహాల అలాట్మెంట్ కావని తేలిపోవడంతో.. వారికి రూపాయలు 174 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ చర్య, టిడ్కో ఇళ్ల కొరకు ముందుగా దరఖాస్తు చేసిన వారు ఈ సొమ్ము తిరిగి పొందే అవకాశం రావడంతో.. వారికి అన్యాయం కాకుండా ఉందనే చెప్పాలి.. ఇక, 1,00,875 టిడ్కో ఇళ్లకు గృహప్రవేశం చేసే ప్లాన్ కూడా […]
Off The Record: తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజార్టీ ఉండడంతో ఆ రెండూ కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. అదే సమయంలో…బీఆర్ఎస్ కూడా కాస్త గట్టిగా ప్రయత్నిస్తే… కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం గెలిచే అవకాశం ఉండేదన్న చర్చ కూడా జరిగింది. కానీ… తమకు పూర్తి స్థాయి బలం లేదని, అనవసరంగా పోటీ చేసి ఓడిపోయామని అనిపించుకోవడం ఎందుకంటూ బీఆర్ఎస్ అధిష్టానం ఆ ప్రతిపాదనల్ని అంత సీరియస్గా తీసుకోలేదు. […]
Off The Record: తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఎవర్ని కదిలించినా ఒకటే టాపిక్. అదే…. కేబినెట్ విస్తరణ గురించి. సీఎం రేవంత్ రెడ్డి, PCC చీఫ్ మహేష్ గౌడ్ ఒకేసారి ఢిల్లీ వెళ్ళడం, అంతకు ముందు రోజే కో ఆర్డినేషన్ కమిటీ ప్రకటన రావడం, అటు పీసీసీ చీఫ్ గా జగ్గారెడ్డి ఉంటే 100 సీట్లు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కామెంట్ చేయడం… ఇలా ఒకదాని వెంట ఒకటిగా వరుస పరిణామాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని కలిపి […]
FASTag E-notice: హైవే ప్రయాణికులపై నిబంధనలు మరింత కఠినతరం చేసింది ప్రభుత్వం.. ఇప్పుడు, హైవేలో ఫాస్టాగ్ ఉపయోగించకపోతే రెట్టింపు జరిమానాలు విధించబడతాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి రుసుము నిబంధనలను సవరించి, 2026 మార్చి 17 నుండి కొత్త మార్పులను అమలు చేయనుంది. ఈ మార్పులతో, ఇకపై టోల్ చెల్లించకుండా హైవే నుంచి వెళ్లిపోయిన వాహన యజమానులకు ఇ-నోటీసులు పంపబడతాయి. ఈ కొత్త విధానం టోల్ వసూలు వ్యవస్థలో పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం ఉద్దేశిస్తోంది. కొత్త విధానం […]
Pawan Kalyan – Balineni Meet: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో సమావేశమయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్తో భేటీ అవ్వడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ గంటన్నర చర్చల వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. Read Also: Story Board: డబ్బిస్తే.. […]