Iran-Israel War: మోడీ ఇజ్రాయెల్ పర్యటనపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran-Israel War: భారత ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడంపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యటన దేశ ప్రయోజనాలను పణంగా పెట్టడమేనని, దశాబ్దాలుగా భారత్ అనుసరిస్తున్న తటస్థ విదేశీ విధానానికి ఇది విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
ఒవైసీ తీవ్ర విమర్శలు..
1. పశ్చిమాసియా విధానంలో మార్పు: భారత్ గత ఎనిమిది దశాబ్దాలుగా పశ్చిమాసియా వ్యవహారాల్లో సమతుల్యమైన మరియు తటస్థ వైఖరిని అవలంబిస్తోందని ఒవైసీ గుర్తు చేశారు. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రధాని ఇజ్రాయెల్ను సందర్శించడం ద్వారా ఆ సమతుల్యతను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
2. 10 మిలియన్ల భారతీయుల భద్రత: గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తున్నారని, ఈ పర్యటన వల్ల ఆ ప్రాంతంలో భారత్ పట్ల తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అక్కడ ఉన్న భారతీయుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందని ఆయన అన్నారు.
3. దౌత్యపరమైన వైఫల్యం: ప్రధాని మోదీ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్పై దాడులు జరగడంపై ఒవైసీ స్పందిస్తూ.. “ప్రధాని విమానం గాల్లో ఉన్నప్పుడే ఈ దాడులు జరిగి ఉంటే బాధ్యత ఎవరు వహించేవారు?” అని ప్రశ్నించారు. ఈ పర్యటనను ఇజ్రాయెల్ తన రాజకీయ మరియు వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వాడుకుందని ఆయన విమర్శించారు.
4. ముందస్తు సమాచారంపై ప్రశ్న: ఇరాన్పై దాడుల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు భారత్కు ముందస్తు సమాచారం ఇచ్చారా? లేదా అన్నది స్పష్టం చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఒకవేళ తెలిసినా పర్యటనకు వెళ్లడం అనాలోచితమని, తెలియకుండా వెళ్లి ఉంటే ఇజ్రాయెల్ భారత్ను మోసం చేసినట్లేనని వ్యాఖ్యానించారు.
కాగా, ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన కొద్దిసేపటికే అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడులు ప్రారంభించాయి. ప్రధాని మోడీ పర్యటన కవరేజ్ కోసం వెళ్లిన భారత మీడియా ప్రతినిధులు ఇజ్రాయెల్లోనే చిక్కుకున్నట్లు ఒవైసీ విమర్శించారు.. కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు అంచనా లోపించిందని ఆరోపించారు.. ఈ పరిణామాల నేపథ్యంలో ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. ఒవైసీ కేవలం వార్తల్లో నిలవడానికే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!