Iran-Israel War: మోడీ ఇజ్రాయెల్ పర్యటనపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran-Israel War: భారత ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడంపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యటన దేశ ప్రయోజనాలను పణంగా పెట్టడమేనని, దశాబ్దాలుగా భారత్ అనుసరిస్తున్న తటస్థ విదేశీ విధానానికి ఇది విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
ఒవైసీ తీవ్ర విమర్శలు..
1. పశ్చిమాసియా విధానంలో మార్పు: భారత్ గత ఎనిమిది దశాబ్దాలుగా పశ్చిమాసియా వ్యవహారాల్లో సమతుల్యమైన మరియు తటస్థ వైఖరిని అవలంబిస్తోందని ఒవైసీ గుర్తు చేశారు. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రధాని ఇజ్రాయెల్ను సందర్శించడం ద్వారా ఆ సమతుల్యతను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.
Also Read
- Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి 'చేప ప్రసాదం' పంపిణీ..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
2. 10 మిలియన్ల భారతీయుల భద్రత: గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తున్నారని, ఈ పర్యటన వల్ల ఆ ప్రాంతంలో భారత్ పట్ల తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అక్కడ ఉన్న భారతీయుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందని ఆయన అన్నారు.
3. దౌత్యపరమైన వైఫల్యం: ప్రధాని మోదీ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్పై దాడులు జరగడంపై ఒవైసీ స్పందిస్తూ.. “ప్రధాని విమానం గాల్లో ఉన్నప్పుడే ఈ దాడులు జరిగి ఉంటే బాధ్యత ఎవరు వహించేవారు?” అని ప్రశ్నించారు. ఈ పర్యటనను ఇజ్రాయెల్ తన రాజకీయ మరియు వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వాడుకుందని ఆయన విమర్శించారు.
4. ముందస్తు సమాచారంపై ప్రశ్న: ఇరాన్పై దాడుల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు భారత్కు ముందస్తు సమాచారం ఇచ్చారా? లేదా అన్నది స్పష్టం చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఒకవేళ తెలిసినా పర్యటనకు వెళ్లడం అనాలోచితమని, తెలియకుండా వెళ్లి ఉంటే ఇజ్రాయెల్ భారత్ను మోసం చేసినట్లేనని వ్యాఖ్యానించారు.
కాగా, ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన కొద్దిసేపటికే అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడులు ప్రారంభించాయి. ప్రధాని మోడీ పర్యటన కవరేజ్ కోసం వెళ్లిన భారత మీడియా ప్రతినిధులు ఇజ్రాయెల్లోనే చిక్కుకున్నట్లు ఒవైసీ విమర్శించారు.. కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు అంచనా లోపించిందని ఆరోపించారు.. ఈ పరిణామాల నేపథ్యంలో ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. ఒవైసీ కేవలం వార్తల్లో నిలవడానికే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!