Iran-Israel War: మోడీ ఇజ్రాయెల్ పర్యటనపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran-Israel War: భారత ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడంపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యటన దేశ ప్రయోజనాలను పణంగా పెట్టడమేనని, దశాబ్దాలుగా భారత్ అనుసరిస్తున్న తటస్థ విదేశీ విధానానికి ఇది విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
ఒవైసీ తీవ్ర విమర్శలు..
1. పశ్చిమాసియా విధానంలో మార్పు: భారత్ గత ఎనిమిది దశాబ్దాలుగా పశ్చిమాసియా వ్యవహారాల్లో సమతుల్యమైన మరియు తటస్థ వైఖరిని అవలంబిస్తోందని ఒవైసీ గుర్తు చేశారు. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రధాని ఇజ్రాయెల్ను సందర్శించడం ద్వారా ఆ సమతుల్యతను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
2. 10 మిలియన్ల భారతీయుల భద్రత: గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తున్నారని, ఈ పర్యటన వల్ల ఆ ప్రాంతంలో భారత్ పట్ల తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అక్కడ ఉన్న భారతీయుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందని ఆయన అన్నారు.
3. దౌత్యపరమైన వైఫల్యం: ప్రధాని మోదీ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్పై దాడులు జరగడంపై ఒవైసీ స్పందిస్తూ.. “ప్రధాని విమానం గాల్లో ఉన్నప్పుడే ఈ దాడులు జరిగి ఉంటే బాధ్యత ఎవరు వహించేవారు?” అని ప్రశ్నించారు. ఈ పర్యటనను ఇజ్రాయెల్ తన రాజకీయ మరియు వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వాడుకుందని ఆయన విమర్శించారు.
4. ముందస్తు సమాచారంపై ప్రశ్న: ఇరాన్పై దాడుల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు భారత్కు ముందస్తు సమాచారం ఇచ్చారా? లేదా అన్నది స్పష్టం చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఒకవేళ తెలిసినా పర్యటనకు వెళ్లడం అనాలోచితమని, తెలియకుండా వెళ్లి ఉంటే ఇజ్రాయెల్ భారత్ను మోసం చేసినట్లేనని వ్యాఖ్యానించారు.
కాగా, ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన కొద్దిసేపటికే అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడులు ప్రారంభించాయి. ప్రధాని మోడీ పర్యటన కవరేజ్ కోసం వెళ్లిన భారత మీడియా ప్రతినిధులు ఇజ్రాయెల్లోనే చిక్కుకున్నట్లు ఒవైసీ విమర్శించారు.. కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు అంచనా లోపించిందని ఆరోపించారు.. ఈ పరిణామాల నేపథ్యంలో ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. ఒవైసీ కేవలం వార్తల్లో నిలవడానికే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!