RBI New UPI Rule: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాంది పలికిన UPI వ్యవస్థలో కీలక మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సైబర్ మోసాలను అరికట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది. పెద్ద మొత్తంలో జరిగే UPI లావాదేవీలకు ఒక గంట ఆలస్యాన్ని అమలు చేయాలని ఆలోచిస్తోంది. UPI ద్వారా తక్షణ చెల్లింపులు చేసే సౌకర్యం వల్ల దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగం పెరిగింది. అయితే, ఇదే వేగాన్ని సైబర్ […]
Lavash Bread: మన ఇళ్లలో తయారుచేసే రొట్టెలు సాధారణంగా ఒకటి లేదా రెండు రోజులకే గట్టిపడి తినడానికి కూడా పనికిరాకుండా పోతాయి. కానీ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన రొట్టె ఉంది. దాన్ని ఒకసారి తయారు చేస్తే ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంచుకుని తినవచ్చు. అదే అర్మేనియాకు చెందిన ప్రసిద్ధ ‘లవాష్’ రొట్టె. కాగితంలా పలుచగా ఉండే ఈ రొట్టె కేవలం ఆహారం మాత్రమే కాదు.. అర్మేనియా దేశ సంస్కృతి, సంప్రదాయాలకు కూడా ప్రతీకగా నిలిచింది. […]
Charlapalli Su*ici*de case: హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మూడు నెలల క్రితం తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కిందపడి మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కొత్త మలుపు చోటుచేసుకుంది. మృతురాలు విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందంటూ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తన భార్య విజయశాంతి రెడ్డి, కుమార్తె చైతన్య రెడ్డి, కుమారుడు […]
AI Technology in Tamil Nadu Election Campaign: టెక్నాలజీలో ఎప్పటికప్పుడూ కొత్త మార్పులు వస్తూనే ఉన్నాయి.. ఎన్నికల ప్రచారానికి కాదేది అనర్హం అనే రీతిలో నేతలు టెక్నాలజీని వాడేస్తూ ఔరా..! అనిపిస్తున్నారు.. తమిళనాడు ఎన్నికల రాజకీయం ఇప్పుడు టెక్నాలజీ వైపు మళ్లింది. ప్రచారంలో ఏఐ సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ కోసం అభ్యర్థులు వాడుతున్న సాంకేతికత చర్చనీయాంశంగా మారింది. విజయ్ తన సినిమాలతో ఎంత పాపులరో, రాజకీయాల్లోనూ […]
Gold and Silver Prices Fall: బంగారం, వెండి ధరలు మరోసారి గణనీయంగా తగ్గాయి. వారం మొదటి రోజు సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఈ రెండు విలువైన లోహాల ధరలు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా వెండి ధర ఒక్కసారిగా కిలోకు రూ.6,000కుపైగా తగ్గడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. గత శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి వెండి ధర కిలోకు రూ.2,43,274 వద్ద ముగిసింది. అయితే, సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే వెండి […]
Onion Pickle Recipe: వేసవి కాలంలో వంటగదిలో ఎక్కువసేపు గడపడం చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తుంది. వేడి కారణంగా ఆకలి తగ్గిపోవడంతో తేలికగా, త్వరగా తయారయ్యే రుచికరమైన వంటకాలకే ప్రాధాన్యం పెరుగుతుంది. అలాంటి సమయంలో కేవలం కొన్ని నిమిషాల్లో సిద్ధమయ్యే ఉల్లిపాయ పచ్చడి మంచి ఎంపికగా నిలుస్తుంది. ఇది ఎంత రుచిగా ఉంటుందంటే.. పాత రొట్టె, పరాటా కూడా రాజభోజనంలా అనిపిస్తుంది. మామిడి, నిమ్మకాయ, ఇంగువ వంటి పచ్చళ్లు చాలా మందికి తెలిసినవే. కానీ ఉల్లిపాయతో కూడా […]
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలనను బలోపేతం చేయడం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పరిపాలనలో ఆధునిక విధానాలు, ఆర్థిక వృద్ధి వ్యూహాలు, ప్రజా సేవల మెరుగుదల వంటి అంశాలపై మంత్రులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది మంత్రుల బృందం ఈ నెల 21 నుంచి 27 వరకు సింగపూర్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో పాలన, ఆర్థికాభివృద్ధి, నగరాభివృద్ధి, […]
Palnadu Police Crime: పల్నాడు జిల్లాలో వరుస ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు స్వయంగా నేర కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా చిలకలూరిపేట సమీపంలో రెండు రోజుల క్రితం జరిగిన న్యాయవాది హత్య కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ వెంకట కోటయ్యకు హత్యకు గురైన లాయర్ భార్యతో అక్రమ […]
Amaravati Quantum Valley: ప్రపంచ క్వాంటం డే పురస్కరించుకుని ఓ కీలక ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా ఏప్రిల్ 14వ తేదీన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మేధా టవర్స్ లో రెండు వేర్వేరు క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అమరావతి కేంద్రంగా ఆవిష్కృతం అవుతున్న క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీతో టెక్ శకంలో నూతన అధ్యాయానికి నాంది పడనుంది. గన్నవరంలోని మేధా టవర్స్ తో పాటు రాజధానిలోని […]
Ramateertham incident: విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించిన రామతీర్థం ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరేళ్ల క్రితం ధ్వంసమైన శ్రీ కోదండ రామస్వామి విగ్రహాలను నేడు ఆగమశాస్త్ర ప్రకారం నిమజ్జనం చేయనున్నారు. రామ తీర్థం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో విగ్రహాలను ఊరేగింపుగా తరలిస్తారు. నెల్లిమర్ల మండలం రామ తీర్థంలోని నీలాచల పర్వతంపై వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో 2020 డిసెంబర్ 28న అర్ధరాత్రి దుండగుల దాడిలో పురాతన రాముడి విగ్రహం ధ్వంసం కావడం […]