Fuel Price Hike: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం పొరుగు దేశమైన నేపాల్పై తీవ్రంగా పడుతోంది. ఈ ప్రభావంతో నేపాల్లో ఇంధన ధరలు వరుసగా నాలుగోసారి పెరగడం గమనార్హం. కేవలం రెండు నెలల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. తాజా పెంపుతో నేపాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.216.50కు చేరగా, డీజిల్ ధర రూ.204.50గా నమోదైంది. ఈసారి పెట్రోల్పై రూ.17, డీజిల్పై రూ.25 పెంపు అమల్లోకి […]
Case Filed Against Janasena ZPTC: ఈ మధ్య జనసేన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు వివిధ ఘటనల్లో చిక్కుకోవడం రాజకీయంగా ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది.. అయితే, తాజాగా, పశ్చిమగోదావరి జిల్లాలో జనసేనకు చెందిన జడ్పీటీసీపై మహిళ చేసిన ఫిర్యాదు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వీరవాసరం మండలానికి చెందిన జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాశ్ నాయుడుపై భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు, […]
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ నేరగాళ్లు విసిరే వలలో చిక్కుకోవద్దు.. వారి మాయలో పడొద్దు అంటూ పోలీసులు ఎంత అప్రమత్తం చేసినా.. ఇంకా.. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకుని.. డబ్బులు పోగొట్టుకుంటున్నవారు లేకపోలేదు.. అయితే, ఓ స్కూల్ విద్యార్థి టైమింగ్ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేసింది.. తాజాగా, ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సైబర్ మోసం ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “డిజిటల్ అరెస్ట్” పేరుతో ఒక జంటను సుమారు 10 గంటల […]
Gudivada Software Engineer Murder: కృష్ణా జిల్లాలోని గుడివాడ ప్రాంతానికి చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గుడివాడ బేతవోలు గ్రామానికి చెందిన బండ్ల ఋషికేష్ (27) హర్యానాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందినట్లు సమాచారం. ఋషికేష్ ఇటీవలే హర్యానాలోని పంచకులలో ఉన్న అమరావతి ఎన్క్లేవ్లోని ఒక ప్రైవేట్ ఐటీ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం వచ్చిన పది రోజులు కూడా పూర్తికాకముందే ఈ దారుణం చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను, […]
FIFA World Cup 2026: ఫుట్బాల్ అభిమానులకు షాక్ ఇస్తూ ఈ ఏడాది ప్రపంచ కప్ టికెట్ల ధరలను FIFA భారీగా పెంచింది.. ఇప్పటికే ఉన్న కేటగిరీలకు తోడు కొత్తగా “ఫ్రంట్ కేటగిరీ” పేరుతో మరింత ఖరీదైన టిక్కెట్లను ప్రవేశపెట్టింది. దీంతో మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించడం సాధారణ అభిమానులకు మరింత ఖరీదైన వ్యవహారంగా మారింది. జూన్ 12న అమెరికాలోని ఇంగిల్వుడ్లో జరిగే యూఎస్ ఆరంభ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ముందువరుసలోని ఫ్రంట్ కేటగిరీ 1 […]
Kerala Elections 2026: దక్షిణ భారత రాష్ట్రం కేరళలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసారి భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొత్తం 140 స్థానాలకు గాను సుమారు 78.27 శాతం ఓటింగ్ నమోదవ్వడం విశేషం. గత 2021 ఎన్నికలతో పోలిస్తే ఇది 2.27 శాతం పెరుగుదలగా భావిస్తున్నారు. అదే సమయంలో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాలకు గాను 89.87 శాతం ఓటింగ్ నమోదై రికార్డు సృష్టించింది. అయితే, కేరళ రాజకీయాల్లో ఓటింగ్ శాతం పెరగడం సాధారణంగా […]
Gold Price Trends: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలపై ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా సహా పలు దేశాలు నిశ్శబ్దంగా తమ బంగారు నిల్వలను పెంచుకుంటుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బంగారం మార్కెట్లో ఏం జరుగుతోంది అనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవలి కాలంలో యుద్ధ పరిస్థితులు, ఆర్థిక అస్థిరత ఉన్నప్పటికీ బంగారం ధరలు గణనీయంగా పడిపోలేదు. వెండి ధరలు భారీగా క్షీణించినప్పటికీ, బంగారం మాత్రం తక్కువగా మాత్రమే తగ్గింది. ఇది బంగారం స్థిరత్వాన్ని […]
Jasmine Perfume at Home: వేసవికాలంలో చెమట వాసన చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను తగ్గించేందుకు చాలామంది ఖరీదైన పెర్ఫ్యూమ్లు, డియోడరెంట్లు ఉపయోగిస్తుంటారు. దాని కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంటారు.. అయితే, వాటిలో ఉండే రసాయనాలు చర్మానికి హానికరంగా ఉండటమే కాకుండా, సువాసన కూడా ఎక్కువసేపు నిలవదు. అది వాడి కాసేపటికే సువాసన మాయమైపోయే ఖరీదైన పెర్ఫ్యూమ్లు ఎన్నో ఉన్నాయి.. అయితే, అలాంటి పరిస్థితిలో, ఇంట్లోనే సహజమైన మల్లె పువ్వులతో పెర్ఫ్యూమ్ […]
Governor Abdul Nazeer: తూర్పు గోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నేడు స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వేడుకలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వీసీ ప్రసన్నశ్రీ తెలిపారు. 2022-23, 2023-24 విద్యా సంవత్సరానికి చెందిన పీహెచ్డీ, పీజీ, పీజీ డిప్లొమా, యూజీ అండ్ పీజీ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి పట్టాలు అందించనున్నారు.. గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్డీలు, […]
AP Cabinet Meeting: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని అమరావతి నిర్మాణం వంటి ముఖ్య అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్లో అమరావతి రాజధాని చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో, ప్రధాన మంత్రి మరియు కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. ఇది రాష్ట్రానికి […]