T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 దశలో ఉన్న టీమ్ ఇండియాకు భారీ ఊరట లభించింది. వ్యక్తిగత కారణాలతో స్వల్ప విరామం తీసుకున్న స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ (Rinku Singh) తిరిగి జట్టుతో చేరనున్నారు. గురువారం (ఫిబ్రవరి 26) జింబాబ్వేతో జరగనున్న కీలక పోరుకు ముందు అతను జట్టులోకి రావడం భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది. అయితే, రింకూ సింగ్ తండ్రి ఖంచంద్ సింగ్ తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో, కుటుంబ అత్యవసర […]
AP Crime: పేరుకు అతనో ప్రభుత్వ ఉద్యోగి.. కానీ, డ్యూటీ దిగిన తర్వాత దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిక్కుళ్లగూడెంలో జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు.. ఈ చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడైన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అని తెలిసి అంతా షాక్ తిన్నారు.. వృద్ధురాలైన ఉప్పు అనసూయ మెడలో 40 గ్రాముల బంగారు చైన్ ఎత్తుకెళ్లాడు నంద సుభాష్ అనే వ్యక్తి.. ఈ కేసులో […]
Rat Poison on Fruits: ఆరోగ్యం కోసం వివిధ రకాల పండ్లు తీసుకుంటారు.. ఒకవేళ అనారోగ్యంపాలైనా.. కోలుకోవడానికి కూడా ఫ్రూట్స్ తీసుకుంటారు.. అయితే, ఆరోగ్యం, అనారోగ్యం నుంచి కోలుకోవడం సంగతి అటు ఉంచితి.. ఇంకా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి తప్పదని కొన్ని ఘటనలు హెచ్చరిస్తున్నాయి.. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని ఉత్తర శివారు ప్రాంతం మలాద్లో పండ్ల విక్రయానికి సంబంధించిన ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పండ్లపై ఎలుకల మందు పూసి విక్రయిస్తున్నారనే […]
Off The Record: నష్టం కలిగించే నాయకులను ఏ రాజకీయ పార్టీ ఉపేక్షించదు. కాస్త ముందో, వెనకో… తప్పకుండా యాక్షన్ ఉంటుంది. ఒకవేళ వెన్నుపోట్లు ఉన్నట్టు తెలిసినా… ఆ సంగతి బయటపడక ముందే జాగ్రత్తలు ఉంటాయి. కానీ…. పార్టీలందు కాంగ్రెస్ పార్టీ వేరయా అన్నట్టుగా ఉంటింది వ్యవహారం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆ సంగతి మరోసారి బయటపడింది. ఇక్కడ ఫుల్ రివర్స్లో ఉందట. మున్సిపల్ ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ చెప్పిన వారికి కాకుండా తమకు నచ్చిన […]
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా జరిగిన 45వ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను అందించింది. మంగళవారం పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రస్తుత ప్రపంచ కప్లో సెమీఫైనల్కు చేరిన మొట్టమొదటి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. మరోవైపు, ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ రేసు నుండి దాదాపు నిష్క్రమించింది. బ్రూక్ వీరోచిత […]
Off The Record: ఓపెన్ విత్ స్పాట్ చంద్రబాబు జీవీకి క్లాస్ పీకుతున్నది వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, సీఎం చంద్రబాబు మధ్య జరిగిన ఈ సంభాషణే ఇప్పుడు పల్నాడు పాలిటిక్స్లోహాట్ టాపిక్ అయింది. ముఖ్యమంత్రి ముందు బీభత్సమైన బిల్డప్ ఇవ్వబోయిన జీవీ…బూమరాంగ్ అయి బొక్కబోర్లా పడ్డట్టు మాట్లాడుకుంటున్నారు. నియోజకవర్గంలో ఉద్యాన పంటల విషయమై గొప్పలు చెప్పబోయిన ప్రభుత్వ చీఫ్విప్కు బ్రేకులేసిన సీఎం… ముందు పనిచేసి చూపించమని అన్నారు. వినుకొండ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా […]
CM Meeting with Ministers After Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు. అజెండా అంశాలు ముగిసిన తర్వాత రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలను ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంటోందని సీఎం స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకూడదని పేర్కొంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇక, అసెంబ్లీ సమావేశాలు […]
Off The Record: మేకా శేషుబాబు….. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తూ వైసీపీ ఆవిర్భావ సమయంలో జగన్ దరి చేరారు. పార్టీ కూడా ఆయన సీనియారిటీని గౌరవించి ఎమ్మెల్సీని చేసింది. అయితే… ఆయన మాత్రం గ్రూపు తగాదాలు, సొంత పెత్తనాలకు ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో…. పాలకొల్లు ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి పక్కన పెట్టేశారని జిల్లా వైసీపీ నాయకులు చెప్పుకుంటారు. 2014 […]
Cricket Match Dispute: ఢిల్లీలో ఆటస్థలం రణరంగంగా మారింది. క్రికెట్ ఆడుతున్న సమయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తిలక్ నగర్ జిల్లాలోని వుడ్ల్యాండ్ పార్క్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అసలేం జరిగిందంటే.. ఫిబ్రవరి 23, రాత్రి 7:22 గంటల సమయంలో తిలక్ నగర్లోని వుడ్ల్యాండ్ పార్క్లో కొందరు బాలురు క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో 12 ఏళ్ల బాలుడికి, 15 ఏళ్ల మరో బాలుడికి మధ్య […]
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త శాఖ ఏర్పాటు అయ్యింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇన్నోవేషన్ను జోడిస్తూ కొత్త శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో మొత్తం 55 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. అలాగే సీఆర్డీఏ మరియు ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెట్టుబడులను […]