TTD Budget 2026: రూ.5,456 కోట్లతో టీటీడీ బడ్జెట్.. శ్రీవారి ఆదాయం ఎన్ని కోట్లు అంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Budget 2026: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తసీఉకుంది.. ఇక, రూ. 5,456 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్లో శ్రీవారి ఆదాయం, వ్యయ కేటాయింపులు మరియు పాలకమండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రత్యేకంగా నిలిచాయి.
* శ్రీవారి ఆదాయం కోట్లలో..
– హుండీ ద్వారా – 1,880 కోట్లు
– వడ్డీ ద్వారా – 1,205 కోట్లు
– ప్రసాదాల విక్రయం ద్వారా – 650 కోట్లు
– దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా – 310 కోట్లు
– ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయం ద్వారా – 135 కోట్లు
– తలనీలాల విక్రయం ద్వారా – 175 కోట్లు
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
- Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
- Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
ఈ విధంగా మొత్తం ఆదాయం సుమారు రూ. 5,456 కోట్లుగా అంచనా వేసింది టీటీడీ..
* టీటీడీ వ్యయ కేటాయింపులు (రూ. కోట్లు)
– ఉద్యోగుల జీతభత్యాలకు – 1,859 కోట్లు
– ముడి సరుకుల కొనుగోలుకు – 974 కోట్లు
– ఫిక్స్డ్ డిపాజిట్లకు – 700 కోట్లు
– ఇంజనీరింగ్ పనులకు – 475 కోట్లు
* టీటీడీ పాలకమండలి ముఖ్య నిర్ణయాలు
– విద్యాసంస్థల అభివృద్ధి పనులకు రూ. 118.8 కోట్లు కేటాయింపు.
– భక్తుల కోరిక మేరకు “శ్రీవారి ముడుపు” పథకం ప్రారంభం.
– రూ. 120 కోట్ల వ్యయంతో అత్యాధునిక అన్నప్రసాద సముదాయం నిర్మాణం.
– ఆలయాల నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవాణి ట్రస్ట్ నిబంధనలకు సడలింపు.
– ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహ నిర్మాణానికి రూ. 20.8 కోట్లు కేటాయింపు.
– కోయంబత్తూర్, గౌహతి, బెలగావి, పాట్నా నగరాల్లో ఆలయాల నిర్మాణం చేపట్టడం.
– వకులామాత ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభం.
– ఒంటిమిట్టలో శ్రీరాములవారి కల్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం పంపిణీ.
– అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ. 8 కోట్ల వ్యయంతో బ్యాగేజ్ స్కానర్లు ఏర్పాటు.
* టీటీడీ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న 51 మంది పరిచారకులకు అర్చకులుగా పదోన్నతి.
– పార్వతీపురంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ. 14 కోట్లు కేటాయింపు.
– దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆస్తుల భద్రతా పర్యవేక్షణ కోసం తిరుపిలో రూ. 10 కోట్ల వ్యయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు.
– తిరుమలలో అనుచితంగా రీల్స్ చిత్రీకరణ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
అయితే, రూ. 5,456 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్ ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు, భద్రతా చర్యలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ ముందుకు సాగుతోంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!