TTD Budget 2026: రూ.5,456 కోట్లతో టీటీడీ బడ్జెట్.. శ్రీవారి ఆదాయం ఎన్ని కోట్లు అంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Budget 2026: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తసీఉకుంది.. ఇక, రూ. 5,456 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్లో శ్రీవారి ఆదాయం, వ్యయ కేటాయింపులు మరియు పాలకమండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రత్యేకంగా నిలిచాయి.
* శ్రీవారి ఆదాయం కోట్లలో..
– హుండీ ద్వారా – 1,880 కోట్లు
– వడ్డీ ద్వారా – 1,205 కోట్లు
– ప్రసాదాల విక్రయం ద్వారా – 650 కోట్లు
– దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా – 310 కోట్లు
– ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయం ద్వారా – 135 కోట్లు
– తలనీలాల విక్రయం ద్వారా – 175 కోట్లు
Also Read
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
- TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
- TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ఈ విధంగా మొత్తం ఆదాయం సుమారు రూ. 5,456 కోట్లుగా అంచనా వేసింది టీటీడీ..
* టీటీడీ వ్యయ కేటాయింపులు (రూ. కోట్లు)
– ఉద్యోగుల జీతభత్యాలకు – 1,859 కోట్లు
– ముడి సరుకుల కొనుగోలుకు – 974 కోట్లు
– ఫిక్స్డ్ డిపాజిట్లకు – 700 కోట్లు
– ఇంజనీరింగ్ పనులకు – 475 కోట్లు
* టీటీడీ పాలకమండలి ముఖ్య నిర్ణయాలు
– విద్యాసంస్థల అభివృద్ధి పనులకు రూ. 118.8 కోట్లు కేటాయింపు.
– భక్తుల కోరిక మేరకు “శ్రీవారి ముడుపు” పథకం ప్రారంభం.
– రూ. 120 కోట్ల వ్యయంతో అత్యాధునిక అన్నప్రసాద సముదాయం నిర్మాణం.
– ఆలయాల నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవాణి ట్రస్ట్ నిబంధనలకు సడలింపు.
– ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహ నిర్మాణానికి రూ. 20.8 కోట్లు కేటాయింపు.
– కోయంబత్తూర్, గౌహతి, బెలగావి, పాట్నా నగరాల్లో ఆలయాల నిర్మాణం చేపట్టడం.
– వకులామాత ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభం.
– ఒంటిమిట్టలో శ్రీరాములవారి కల్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం పంపిణీ.
– అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ. 8 కోట్ల వ్యయంతో బ్యాగేజ్ స్కానర్లు ఏర్పాటు.
* టీటీడీ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న 51 మంది పరిచారకులకు అర్చకులుగా పదోన్నతి.
– పార్వతీపురంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ. 14 కోట్లు కేటాయింపు.
– దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆస్తుల భద్రతా పర్యవేక్షణ కోసం తిరుపిలో రూ. 10 కోట్ల వ్యయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు.
– తిరుమలలో అనుచితంగా రీల్స్ చిత్రీకరణ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
అయితే, రూ. 5,456 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్ ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు, భద్రతా చర్యలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ ముందుకు సాగుతోంది.
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?