Deputy CM Pawan Kalyan: వైసీపీపై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్.. అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు పంపారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఏపీ పాలిటిక్స్లో తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం కాకరేపుతోంది.. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు పంపిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని ఆరోపించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన తప్పు కాదని, కావాలనే, తెలిసే చేసిన చర్యలేనని అన్నారు.
2019–2024 మధ్య వైసీపీ పాలనలో రాష్ట్రం నలుమూలల 200కుపైగా మత సంబంధిత ఘటనలు చోటుచేసుకున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. తిరుమల లడ్డూలో ఫిష్ ఆయిల్ ఉన్నట్టు నివేదికలు రావడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. రాజకీయ లాభనష్టాలు ఆలోచించకుండా, తెలిసిన నిజాన్ని చెప్పకపోతే అది తప్పవుతుందని స్పష్టం చేశారు. గత పాలకులు భగవంతుడిపై పగ పట్టినట్లుగా వ్యవహరించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలు తయారు చేసిన ఘటనలు ఉన్నాయి.. దుర్గమ్మ ఆలయంలో వెండి విగ్రహాల చోరీ జరిగితే ‘ఇంకోటి కొనుక్కోవచ్చు’ అన్న ధోరణి.. అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతి కావడం.. ఇలాంటి అనేక సంఘటనలు వైసీపీ పాలనలో జరిగాయని గుర్తు చేశారు.
Also Read
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
NDDB నివేదికే ఆధారం
తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో స్వచ్ఛమైన నెయ్యి లేదని NDDB నివేదిక స్పష్టంగా తేల్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆ నివేదిక ఆధారంగానే సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు నిజాలు వెల్లడించారని చెప్పారు. 319 రూపాయలకు నెయ్యి సరఫరా జరిగిందంటే ఎంత స్థాయిలో కల్తీ జరిగిందో అందరికీ అర్థమవుతుందన్నారు. ఇక, ఈ వ్యవహారంపై వచ్చిన సీబీఐ నివేదిక ఎక్కడా క్లీన్ చీట్ ఇవ్వలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. NDDB నివేదికలో ఫిష్ ఆయిల్, పంది కొవ్వు, రసాయనాలు ఉండే అవకాశాలున్నాయని పేర్కొనడం మరింత తీవ్ర విషయమని అన్నారు. అయితే, తప్పు జరిగిందని ఒప్పుకోకుండా, పశ్చాత్తాపం చూపకుండా, తిరిగి ‘ఎలాంటి తప్పులు జరగలేద’ని ప్రచారం చేయడం దుర్మార్గమని విమర్శించారు. వైసీపీ ఈ వ్యవహారంపై తప్పకుండా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హిందూ మత గౌరవం కాపాడుతున్నాం
తాము హిందూ మత గౌరవాన్ని కాపాడుతున్నామని, కానీ ఇతర మతాలను ఎక్కడా అగౌరవపరచడం లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇది ఒక మతానికి సంబంధించిన విషయం కాదని, భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగదని, మళ్లీ నివేదికలు వచ్చేందుకు సమయం పడుతుందని, అప్పటివరకు నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ‘ఏడు కొండల వారితో పెట్టుకుంటే మట్టి కొట్టుకుపోతుంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
తాజావార్తలు
-
LIC: ఎల్ఐసీ నుంచి జీవన్ సాథి పేరుతో రెండు కొత్త ప్లాన్లు.. మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ బెనిఫిట్స్
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్వర్క్.. కేన్స్లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!