Bihar: బీహార్ సీఎం రేసులో కేంద్రమంత్రి! అభిమానులు సంబరాలు
- పెద్దల సభకు సీఎం నితీష్ కుమార్
- తదుపరి బీహార్ సీఎం రేసులో కేంద్రమంత్రి!
- మెండుగా హైకమాండ్ పెద్దల ఆశీస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఊహించని షాకిచ్చారు. రాజ్యసభకు వెళ్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా బాంబ్ పేల్చారు. దీంతో బీహార్తో పాటు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాలా వేగంగా రాజకీయాలు మారిపోయాయి. ఇక గురువారం రాజ్యసభకు నితీష్ కుమార్ నామినేషన్ దాఖలు చేసేశారు.
నితీష్ కుమార్ అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లిపోవడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి ముఖ్యమంత్రి పీఠం బీజేపీకే దక్కుతుందని జేడీయూ వర్గాలు తెలిపాయి. రెండు ఉపముఖ్యమంత్రి పదవులు మాత్రం జేడీయూకు దక్కుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
అయితే ముఖ్యమంత్రి రేసులోకి కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ ముందు వరుసలోకి వచ్చారు. బీహార్ తదుపరి ముఖ్యమంత్రి నిత్యానంద్ రాయ్ కావడం ఖాయంగా బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. బీజేపీలో నిత్యానంద్ రాయ్ చాలా సీనియర్ నేతగా ఉన్నారు. అమిత్ షాతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయన ఆశీస్సులు చాలా మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిత్యానంద్ రాయ్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నిత్యానంద్ రాయ్.. కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఉజియార్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అంతకముందు 2000 సంవత్సరం నుంచి హాజీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ సీటు. గతంలో బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం నిత్యానంద్ రాయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వైశాలి జిల్లాలోని కర్ణపుర గ్రామంలోని నిత్యానంద రాయ్ పూర్వీకుల ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు. హోలీ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా సంబరాలు చేసుకుంటుండంతో చర్చల్లోకి వచ్చింది
మరోవైపు సామ్రాట్ చౌదరి కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీహార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే తొలిసారి బీహార్లో బీజేపీ సీఎం పీఠాన్ని అధిరోహిస్తున్న నేపథ్యంలో అణగారిన వర్గాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిత్యానంద్ రాయ్ వైపు హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. నితీష్ వారసుడు ఎవరో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!