AP High Court: గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారిని అధిపతిగా నియమించి సిట్ను ఏర్పాటు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు నిష్పాక్షికంగా సాగేందుకు రాష్ట్రం వెలుపల ఉన్న ఫోరెన్సిక్ […]
Speaker Ayyannapatrudu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే, అసెంబ్లీలో రేపటి నుంచి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత హాజరు నమోదు విధానం అమల్లోకి రానుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సభ్యులు తమ కేటాయించిన స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదయ్యే విధంగా ఈ వ్యవస్థను రూపొందించామని తెలిపారు. పార్లమెంటులోనూ ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన […]
Ambati Rambabu bail: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులోనూ కోర్టు నుంచి ఊరట లభించింది. గుంటూరు స్పెషల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. ర్యాలీగా వస్తున్న సమయంలో పట్టాభిపురం పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో అంబటిపై కేసు నమోదు చేశారు. Read Also: Deepali Ghosh: […]
Monalisa: ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళాలో దండలు అమ్ముతూ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయిన అమ్మాయి మోనాలిసా.. ఇప్పుడు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. సాధారణ జీవితంతో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు వెండితెర వరకు చేరుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహాకుంభ్లో వైరల్ అయిన తర్వాత వచ్చిన అవకాశాలతో మోనాలిసా ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల తన మొదటి హిందీ సినిమా “ది డైరీ ఆఫ్ మణిపూర్” ప్రారంభోత్సవానికి హాజరైన మోనాలిసా భావోద్వేగానికి గురైంది. సినీ ప్రపంచం, […]
Story Board: ప్రస్తుత ప్రపంచంలో వాణిజ్య ఒప్పందాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పైగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఒడుదుడుకుల్ని ఎదుర్కుంటున్న తరుణంలో.. ట్రేడ్ డీల్స్ ప్రపంచ వృద్ధి గమనాన్ని ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. కరోనాతో యూఎస్, ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాల ఆర్థికవ్యవస్థలు కుదేలైన తరుణంలో.. భారత్ ఆర్థికవ్యవస్థ ప్రపంచానికి ఆశారేఖగా నిలుస్తోంది. దీంతో కొంతకాలంగా ప్రపంచ పెట్టుబడిదారుల చూపు భారత్పైనే ఉంది. ఇలాంటి సమయంలో వరుస డీల్స్తో భారత్ దుమ్ము రేపుతోంది. న్యూజిలాండ్, […]
Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన అజిత్ పవార్ విమాన ప్రమాదంపై తాజాగా ఆయన మేనల్లుడు, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత రోహిత్ పవార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటన కేవలం ప్రమాదం కాదని, ఇందులో కుట్ర కోణం కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ ప్రశ్నలు లేవనెత్తారు. అజిత్ పవార్ను విమాన ప్రయాణానికి బలవంతం చేశారని ఆయన ఆరోపించారు. మీడియా సమావేశంలో భావోద్వేగంగా మాట్లాడిన రోహిత్ పవార్.. ఈ […]
Ambati Rambabu Cases: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నతే, మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జైలుపాలయ్యారు. తర్వాత వరుసగా రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై 33 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో తనపై నమోదైన కేసుల వ్యవహారంలో అంబటి న్యాయపోరాటం మొదలుపెట్టారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలపై నమోదైన కేసులను కొట్టెయ్యాలంటూ అంబటి హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు ఈ కేసుల్లో ప్రొసీజర్ ఫాలో అవ్వాలని, తొందరపాటు చర్యలు వద్దని […]
Marriage at 97 Age: 97 ఏళ్ల వృద్ధుడు తన భార్య మరణించిన తర్వాత రెండో వివాహం చేసుకోవాలనుకున్నాడు.. అయితే, అతని కొడుకులు తండ్రి ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.. దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు.. ఆ వృద్ధుడి మానసిక సామర్థ్యంపై ప్రశ్నలు వేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వృద్ధుడి కుమారులు, తండ్రి 97 ఏళ్ల వయసులో వివాహం చేసుకోవడం చట్టపరంగా సరికాదని వాదించారు. అదేవిధంగా, వృద్ధుడి భాగస్వామి అతన్ని మోసం చేయాలని లేదా ఆస్తిని సంపాదించడానికి […]
Digital Attendance in AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి అసెంబ్లీలో హాజరు పుస్తకం ఉండదని.. డిజిటల్ అటెండెన్స్ ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు స్పీకర్ అయ్యన్న… ఇకపై అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యేలు హాజరు డిజిటల్ పద్ధతిలో నమోదు చేయాలని అసెంబ్లీ అధికారులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాలు ఇచ్చారు.. దీంతో, ఇకపై రిజిస్టర్ లో […]
AP Assembly Budget Sessions 2026: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈసారి అయినా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? అనే చర్చ సాగుతోంది.. ఈ తరుణంలో.. శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకారం, మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ సమావేశాలకు హాజరుకావడం ఖాయమని తెలిపారు. అయితే, రాష్ట్రంలో శాంతి, భద్రత పరిస్థితులు బాగాలేవని బొత్స తెలిపారు. సీఎం చంద్రబాబు ఫ్రస్టేషన్ కారణంగా అనేక […]