Raisins vs Dried Grapes: అసలు ఫ్రూట్స్ కంటే.. డ్రై ఫ్రూట్స్కు విలువ ఎక్కువ.. అంతే కాదు.. వాటిలో మంచి ప్రొటీన్ కూడా లభిస్తుందని చెబుతున్నారు.. వైద్యులు సైతం రిఫర్ చేయడం.. చాలా మంది వాటిని వాడడం చేస్తుంటారు.. అంతేకాదు.. ఆయుర్వేదంలోనూ వీటికి ప్రత్యేక స్థానం ఉంది.. అయితే.. ద్రాక్ష తీపి, రసభరితమైన పండు. అదే ద్రాక్షను ఎండబెడితే ఎండుద్రాక్ష లేదా ఎండు ద్రాక్షగా మారుతుంది. అయితే చాలామంది ఈ రెండింటినీ ఒకటే అని భావిస్తారు. నిజానికి […]
US–Bangladesh Trade Deal: అమెరికా–బంగ్లాదేశ్ మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీర్ఘకాల చర్చల అనంతరం అమెరికా బంగ్లాదేశ్పై విధిస్తున్న సుంకాలను కేవలం 1 శాతం మాత్రమే తగ్గిస్తూ 19 శాతానికి పరిమితం చేసింది. తొమ్మిది నెలల పాటు సాగిన చర్చల తర్వాత ఈ ఒప్పందం ఖరారైంది. మొదటగా బంగ్లాదేశ్ ఎగుమతులపై 37 శాతం వరకు సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించడంతో ఢాకా తీవ్ర ఆందోళనకు గురైంది. ఆ తర్వాత సుదీర్ఘ చర్చల నేపథ్యంలో గత ఆగస్టులో […]
కూటమి ప్రభుత్వానికి హైప్ ఎక్కువ.. పనితీరు తక్కువ.. గణాంకాలు బయటపెట్టిన జగన్.. “హైప్ ఎక్కువ.. పనితీరు తక్కువ” అంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి హైప్ తప్ప పనితీరు లేదని ఆరోపిస్తూ, ఆర్థిక గణాంకాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని ఎక్స్ (X) వేదికగా గణాంకాలు బయటపెట్టారు.. […]
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరో ఇద్దరు అనాథ చిన్నారులకు ఆసరగా నిలిచారు.. పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న పవన్ కల్యాణ్.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా.. అది చిన్నదయినా.. పెద్దదయినా.. తక్షణం స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా 42 మంది అనాథ చిన్నారులకు తన జీతం మొత్తాన్ని ఆర్ధిక సాయం రూపంలో అందిస్తున్న ఆయన.. తాజాగా […]
AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది.. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10: 30కి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. సుమారు గంటసేపు స్పీచ్ ఉండే అవకాశం ఉంది. ఇక, రేపు మార్నింగ్ 11: 30 గంటలకి బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. […]
YS Jagan: “హైప్ ఎక్కువ.. పనితీరు తక్కువ” అంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి హైప్ తప్ప పనితీరు లేదని ఆరోపిస్తూ, ఆర్థిక గణాంకాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని ఎక్స్ (X) వేదికగా గణాంకాలు బయటపెట్టారు.. చంద్రబాబు విజన్ గురించి పెద్దగా ప్రచారం చేస్తున్నప్పటికీ, వాస్తవ […]
Off The Record: ఏదన్నా ఒక రాజకీయ పార్టీకి ఓ నియోజకవర్గంలో గట్టి పట్టుంటే… ఫలానా పార్టీకి అది కంచుకోట అనడం కామన్. ఆ కోణంలో… ఇచ్చాపురం అసెంబ్లీ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోటే కాదు, అంతకు మించి. ఇక్కడ ఎన్నిక ఏదైనా గెలుపు తెలుగుదేశం పార్టీదే. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒక్క 2004లో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. మిగతా అన్ని ఎన్నికల్లో సైకిల్దే హవా. ఇచ్చాపురంలో ఖాతా తెరిచేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా వర్కౌట్ అవలేదు. […]
Off The Record: ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సంబంధించి పెద్దగా వివాదాలేం లేవు. మూడు దశాబ్దాల పొలిటికల్ లైఫ్లో ఆయన ఎవర్నీ గట్టిగా అన్నది లేదు, అనిపించుకున్నదీ లేదు. కానీ…. ఈ మధ్య కాలంలో మాత్రం చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే… తాజాగా చెన్నై లో ఓ వివాహ వేడుకలో మాజీ సీఎం జగన్తో కలివిడిగా మాట్లాడ్డం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్తో ఏర్పడిన గ్యాప్ కారణంగా వైసీపీ […]
Chairmans Desk: ఏపీలో రాజకీయం సరికొత్త లోతులకు దిగజారుతోంది. అధికారం మారితే.. ఇన్నాళ్లూ కొన్ని ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయిపోవడం.. మరికొన్ని ప్రాంతాల్లో ఓ వర్గం మరో వర్గం కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లడం రాష్ట్రానికి ఎప్పట్నుంచో అనుభవమే. కానీ ఇప్పుడు కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షంలో ఉన్నవారెవరికీ రక్షణ ఉండదని తేలిపోయింది. వైసీపీ హయాంలో ఓ నేత ఏకంగా మాజీ సీఎం నివాసంపైకి దూసుకెళ్లడం కలకలం రేపింది. జడ్ ప్లస్ క్యాటగిరీలో ఉన్న వ్యక్తి మీదకు అలా […]
Social Media Ban for Children Below 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది.. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ విషయంలో సమగ్రంగా అధ్యయనం చేయాలని పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు, యువతపై ప్రతికూల ప్రభావాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా విచ్చలవిడితనానికి బ్రేకులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం […]