-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL)లో జరిగినట్లు ఆరోపణలు ఉన్న ట్రాన్స్పోర్ట్ స్కామ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి 2026 మే 22న ECIR/HYZO/17/2026 నంబరుతో మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తు సంస్థ ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ కేసులో నిందితులు ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195.33 కోట్ల మేర నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే […] -
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
EPFO New Rules: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సభ్యులకు మరింత సౌకర్యాన్ని కల్పించే దిశగా కీలక మార్పులను ప్రకటించింది. ముఖ్యంగా PF క్లెయిమ్లు, విత్డ్రాయల్స్కు సంబంధించిన నిబంధనలను సరళీకృతం చేస్తూ కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మార్పుల ప్రకారం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సభ్యులు తమ PF ఖాతాలోని 100 శాతం మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం పొందనున్నారు. గతంలో పూర్తి PF మొత్తాన్ని విత్డ్రా చేసుకోవాలంటే సభ్యులు కారణాన్ని స్పష్టంగా పేర్కొనడంతో […] -
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
Indian Crew Tanker Incident: పశ్చిమ ఆసియాలోని హార్మూజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు భారతీయ నావికుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. గత మూడు రోజుల వ్యవధిలో భారతీయ సిబ్బంది ఉన్న మూడు నౌకలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకోవడంతో పరిస్థితి మరింత చర్చనీయాంశంగా మారింది. కొన్ని నివేదికల ప్రకారం, ఈ ఘటనల్లో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు భారతీయుల్లో విశాఖపట్నం వాసి కూడా ఉన్నట్లు ఢిల్లీలోని […] -
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
AP DSC Recruitment: డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలు, సందేహాలపై విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మరోసారి వివరణ ఇచ్చారు. డీఎస్సీ ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి తప్పిదాలు జరగలేదని స్పష్టం చేసిన ఆయన, అభ్యర్థుల్లో నెలకొన్న కొన్ని అపోహలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబర్లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాదిలోనే మరో డీఎస్సీ నిర్వహించనున్నట్లు కోన శశిధర్ వెల్లడించారు. ప్రస్తుత నియామకాల్లో అవకాశం దక్కని అభ్యర్థులకు మరో అవకాశం లభిస్తుందని తెలిపారు. […] -
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
Health Benefits of Eggs: ఆరోగ్యకరమైన జీవనశైలికి పండ్లు, కూరగాయలు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయితే సమతుల ఆహారంలో గుడ్ల పాత్ర కూడా అంతే కీలకం. ప్రోటీన్కు అద్భుతమైన మూలంగా పేరుగాంచిన గుడ్లు, ప్రతిరోజూ తీసుకుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుడ్డును ప్రకృతి ప్రసాదించిన మల్టీవిటమిన్గా అభివర్ణిస్తారు. ఇందులో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కేవలం ఒక నెల పాటు ప్రతిరోజూ […] -
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
MLA Chirri Balaraju: ఏలూరు జిల్లాలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మరోసారి వివాదంలో నిలిచారు. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేపై పూనెం వంశీ అనే వ్యక్తి దాడికి యత్నించాడని కార్యాలయ సిబ్బంది ఆరోపిస్తుండగా, మరోవైపు తనపై ఎమ్మెల్యే అనుచరులే దాడి చేశారని వంశీ వాదిస్తున్నారు. సమాచారం ప్రకారం, పూనెం వంశీ గతంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వద్ద పనిచేసిన వ్యక్తి. ఇటీవల ఎమ్మెల్యేకు సంబంధించిన […] -
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
Rajya Sabha Elections: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల సంఘం (ఈసీ) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రాజ్యసభ సభ్యులుగా భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్, లింగమనేని రమేష్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నామినేషన్ల పరిశీలన అనంతరం ఇతర అభ్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడంతో ఎన్నిక అవసరం లేకుండానే వీరి ఎన్నిక ఖరారైంది. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో […] -
Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం వరకు రుతుపవనాలు విస్తరించినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నేడు అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ […] -
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
RBI: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కౌంటర్పార్టీ క్రెడిట్ రిస్క్ (CCR)కు సంబంధించిన ప్రమాణీకృత విధానం (SA-CCR) నిబంధనల్లో కీలక మార్పులను ప్రతిపాదించింది. ఈ మేరకు ముసాయిదా సవరణలపై ప్రజలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు ఇతర భాగస్వాముల నుంచి అభిప్రాయాలు, సూచనలు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కౌంటర్పార్టీ క్రెడిట్ రిస్క్ అనేది డెరివేటివ్ లావాదేవీలు లేదా ఇతర ఆర్థిక ఒప్పందాల్లో ఒక పక్షం తన బాధ్యతలను నిర్వర్తించలేకపోతే ఎదురయ్యే నష్టాన్ని సూచిస్తుంది. ఈ ప్రమాదాన్ని […] -
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
APL 2026: ఏపీఎల్ 2026 సీజన్-5లో అమరావతి రాయల్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో రోజు తొలి మ్యాచ్లో తుంగభద్ర వారియర్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమష్టి ప్రదర్శన కనబర్చిన అమరావతి జట్టు 9 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సునాయాస విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు […]
తాజావార్తలు
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
-
Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
-
IND vs ENG 2026: ఇంగ్లండ్, భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఇవే!
-
Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..