కోవిడ్ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్ లిస్ట్ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. అయితే, ఆ జాబితాలో భారత్ తో పాటు యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సొమాలియా, కాంగో, […]
తెలంగాణలో వాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. జూన్లో పెద్దెత్తున వాక్సినేషన్ జరిగినా, ఒక్కసారిగా ఢీలా పడింది. మొదటి డోస్ వేసుకున్నోళ్లకు రెండో డోస్ ఇప్పుడు దొరకడం లేదు. ఇక ఫస్ట్ డోస్ వేసుకుందామనుకున్నవారికి అదికూడా దక్కడం లేదు. ఏ సెంటర్లో ఏ వ్యాక్సిన్ వేస్తున్నారో జనం వెతుక్కోవాల్సి వస్తోంది. తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వారందికీ వాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు హైరిస్క్లో ఉన్న వాళ్ళకు మాత్రమే వాక్సిన్ వేయగా అర్హులందరికీ టీకా ఇస్తున్నారు.. ప్రభుత్వ సెంటర్లతో పాటు […]
భారత్లో కరోనా కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి.. రెండురోజుల నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 43,509 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రికవరీ కేసుల సంఖ్య మాత్రం తగ్గిపోయింది… తాజా బులెటిన్ ప్రకారం 38,465 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి… ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,03,840గా ఉన్నాయి.. రికవరీ రేటు 97.38 శాతంగా ఉందని బులెటిన్ లో పేర్కొంది సర్కార్… ఒకేరోజు […]
టీమిండియాతో జరిగిన రెండో టీట్వంటీ మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంక జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెల్చి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంకజట్టుకు.. బౌలర్లు చక్కని ఆరంభాన్నిచ్చారు. ఆది నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన లంకేయులు.. భారత్ను స్వల్పస్కోరుకు కట్టడి చేశారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్… నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కెప్టెన్ ధావన్ 42 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్గా […]
ఐదురోజుల ఢిల్లీటూర్లో బెంగాల్ సీఎం మమత బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్పై పోరాటంలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ గాంధీలతో సమావేశమైన మమత… తమ మధ్య సమావేశం పూర్తి సానుకూలదోరణిలో జరిగిందన్నారు. దీని ఫలితాలు భవిష్యత్తులో కనిపిస్తాయన్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బంపర్ విక్టరీ తర్వాత తొలిసారిగా మమత.. సోనియాతో సమావేశమయ్యారు. ఢిల్లీలో వరుసగా విపక్షనేతలతో మమత సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న […]
శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతూనే ఉంది.. ఇన్ఫ్లో రూపంలో 4,60,154 క్యూసెక్కుల నీరు వచ్చి జలాశయంలో చేరుతుండగా… 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. మొత్తంగా 3.40 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్ నుంచి దిగువకు వెళ్తోంది… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం డ్యామ్లో 212.4385 […]
పసిడి ధర మళ్లీ పైకి ఎగిసింది… నిన్న కిందకు దిగిన బంగారం ధర.. ఇవాళ పైకి కదులుతూ పిసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.. ఇదే సమయంలో వెండి ధర కాస్త కిందకు దిగింది.. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పైకి కదలడంతో.. రూ.48,880కి చేరింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.44,800కు చేరింది. ఇక, వెండి రేటు రూ.500 తగ్గడంతో కేజీ […]
టోక్యో ఒలింపిక్స్లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది తెలుగుతేజం, భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు… మహిళ సింగిల్స్ గ్రూప్-జేలో వరుసగా మూడు విజయాన్ని సాధించిన ఆమె.. క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది… ఇవాళ జరిగిన ప్రీక్వార్టర్స్లో డెన్మార్క్ షెట్లర్ మియా బ్లిక్ఫెల్ట్ పై వరుస సెట్లలో విజయం సాధించారు సింధూ.. 21-15, 21-13తో ప్రత్యర్థిని చిత్తు చేసిన ఆమె.. వరుస విజయాలతో గ్రూప్-జేలో అగ్రస్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది… మరో విజయం సాధిస్తే కాంస్యం పతకం సాధించడం […]
కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలను క్రమంగా అమలు చేస్తూనే ఉంది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్… జగనన్న విద్యా దీవెన పేరుతో.. విద్యార్థులకు అండగా నిలిచిన ప్రభుత్వం.. ఈ ఏడాది రెండో విడత జగనన్న విద్యా దీవెన నిధులు జమ చేసేందుకు సిద్ధమైంది… రాష్ట్రంలోని దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తో… రూ. 693.81 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంప్ […]
కరోనా మమహమ్మారి నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాల అమలును మరోసారి పొడిగించింది… వచ్చే నెల 31 (ఆగస్టు)వ తేదీ వరకు పొడిగించింది కేంద్రం.. మరోవైపు ఇప్పటికీ కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఇక, కరోనా కేసులు తగ్గినప్పటికీ నిబంధనలు పాటించాలని పేర్కొంది.. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల, ఆర్ ఫ్యాక్టర్ ఒకటి కన్నా ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం […]