ఆఫ్ఘనిస్థాన్లో పాగా వేశారు తాలిబన్లు.. ఒక్కొనగరం.. ఒక్కొ రాష్ట్రం.. దేశ సరిహద్దులు ఇలా ఏవీ వదలకుండా అంతా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.. ఆఫ్ఘన్ పరిస్థితుల ప్రభావం భారత్పై ఎంత మేరకు ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోడీ.. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, […]
ఏ మాత్రం బెరుకు లేకుండా క్రమంగా ముందుకు కదులుతూ.. తమ ఆకృత్యాలను కొనసాగిస్తూ మొత్తంగా ఆఫ్ఘనిస్థాన్ను స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు.. దేశ రాజధాని కాబూల్లోని ప్రధాన కార్యాలయాల్లోనూ పాగా వేశారు.. ఇక, ఆఫ్ఘన్ తమ వశం అయిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చి కీలక ప్రకటనలు చేశారు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్.. గతంలో తమ వైఖరికి, విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేశారు.. 20 ఏళ్ల తర్వాత విదేశీ సైన్యాన్ని […]
అన్నదాతలకు గుడ్న్యూస్ చెబుతూ.. రుణమాఫీ నిధుల విడుదల చేసిన ప్రభుత్వం… దశలవారీగా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో ఆ సొమ్మును జమ చేస్తూ వస్తుంది.. రూ.25 వేల నుంచి రూ.50 వేల లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ నిధుల విడుదల కొనసాగుతుండగా.. ఇక, రెండో రోజులో భాగంగా 38,050 మంది రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులను బదలాయించింది ప్రభుత్వం.. ఇవాళ ఒకేరోజు రుణమాఫీ కింద రూ.100.70 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. కరోనా పరిస్థితులతో ఆర్థిక కష్టాలున్నా.. […]
ఆఫ్ఘనిస్థాన్ను తమ ఆధీనంలోకి తీసుకుని తమకు ఎదురే లేదంటున్న తాలిబన్లకు షాక్లు కూడా తగులుతున్నాయి.. తాజాగా, జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆఫ్ఘన్కు డెవలప్మెంట్ సాయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.. ఈ విషయాన్ని జర్మన్ డెవలప్మెంట్ మంత్రి గెర్డ్ ముల్లర్ రినిష్ వెల్లడించారు.. డెవలప్మెంట్ ఫండ్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్న ఆయన.. ఇదే సమయంలో.. అక్కడినుంచి వచ్చేయాలని భావిస్తున్న స్థానిక అభివృద్ధి అధికారులు, ఎన్జీవోలకు చెందిన సభ్యులను దేశానికి రప్పించే చర్యలు మాత్రం కొనసాగిస్తామని తెలిపారు. అయితే, ఏడాదికి 430 […]
వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ పై మరో రూ. 25 పెంచినట్టు ప్రకటించాయి.. దీంతో.. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు సిలెండర్ పై ఏకంగా రూ. 80.50 మేర పెరిగిపోయింది.. సబ్సిడీయేతర సిలిండర్ పై ఈ భారం పడనుంది.. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ రూ. 859.5కు చేరుకుంది.. ఇక, ముంబైలో కూడా 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర రూ.859.5కు పెరిగింది.. కోల్కతాలో […]
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.. ఎప్పుడు నుంచి ఎలా కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి ఉంది.. తాజాగా నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కరోనా కలకలం సృష్టించింది.. ఒకే పోలీస్ స్టేషన్లో ఏకంగా 9 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.. కొందరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. అనుమానంతో అందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.. అయితే, సీఐ, ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ సహా మొత్తం 9 మంది పోలీసు సిబ్బంది […]
ఆఫ్ఘనిస్థాన్ను మళ్లీ తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో.. చాలా హృదయవిదారకమైన పరిస్థితులు కనిపిస్థున్నాయి.. ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని.. దేశాన్ని విడిచి వెళ్లేందుకు చేయని ప్రయత్నాలు లేవు.. దీంతో.. ఎయిర్పోర్ట్లో భయంకరమైన రద్దీ కనబడుతోంది.. విమానం టేకాన్ను వెళ్లే సమయంలోనూ వెంటపడి మరి.. చక్రాల దగ్గరైనా చోటు దొరకకపోతుందా? అంటూ వేలాడి వేళ్లేవాళ్లు కొందరైతే.. మరికొందరు జారిపడి ప్రాణాలు కూడా వదిలారు.. అయితే, ఏదేమైనా.. తాలిబన్లు నా ప్రాణం తీసినా సరే.. తాను మాత్రం కాబూల్ను వదిలేది లేదంటున్నారు […]
కరోనా కల్లోలం సమయంలో.. ఒక్కో దేశానిది ఒక్కో పరిస్థితి.. జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు.. సడలింపులు ఇస్తూ ముందుకు సాగుతుండగా.. తక్కువ జనాభా ఉన్న దేశాలు అయితే.. ఒక్క కేసు వెలుగు చూసినా లాక్డౌన్ విధిస్తున్నాయి.. ఇప్పటికే కరోనాపై పోరాటం చేసి విజయం సాధించింది న్యూజిలాండ్.. ఆపద సమయంలో.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకు కదిలారు ప్రధాని జెసిండా ఆర్డెర్న్.. అయితే, 6 నెలల తర్వాత స్థానికంగా తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.. […]