PM Modi: ‘నమో భారత్’, ‘మీరట్ మెట్రో’లను ప్రారంభించనున్న ప్రధాని.. 12,930 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు మధ్యాహ్నం మీరట్ లోని శతాబ్ది నగర్ స్టేషన్లో మీరట్ మెట్రో మరియు నమో భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన శతాబ్ది నగర్ నుండి మీరట్ సౌత్ స్టేషన్ వరకు స్వయంగా మెట్రోలో ప్రయాణించనున్నారు. ఆ తర్వాత మీరట్ లో రూ.12,930 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Income Tax Rules: క్రెడిట్ కార్డ్ వినియోగదారులు జాగ్రత్త.. ఐటీ శాఖ కొత్త నిబంధనలు ఇవే!
Also Read
- Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
- CI Nagaraju-SIT: సాయికృష్ణ హత్య కేసు.. సిట్ విచారణకు సహకరించని సీఐ నాగరాజు!
- Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
- TTD Tickets: భక్తులను అయోమయానికి గురిచేసిన టీటీడీ.. చివరకు ఏమైందంటే?
ఢిల్లీ-మీరట్ మధ్య నిర్మించిన పూర్తి 82 కిలోమీటర్ల పొడవైన ‘నమో భారత్’ కారిడార్ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ నుండి న్యూ అశోక్ నగర్ వరకు ఉన్న 5 కి.మీ సెక్షన్. ఇంకా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ సౌత్ నుండి మోదీపురం వరకు ఉన్న 21 కి.మీ సెక్షన్లను ఆయన ప్రారంభిస్తారు. గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ ‘రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్’ (RRTS), దేశంలోనే మొట్టమొదటిది. ఇది సాహిబాబాద్, ఘజియాబాద్, మోదీనగర్, మీరట్ వంటి ప్రధాన పట్టణాలను ఢిల్లీతో అతివేగంగా అనుసంధానిస్తుంది.
నమో భారత్ రైళ్లు ప్రయాణించే అదే ట్రాక్స్ పైన మీరట్ మెట్రో కూడా నడవడం ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత. గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ మెట్రో, దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో వ్యవస్థగా రికార్డు సృష్టించనుంది. మీరట్ సౌత్ నుండి మోదీపురం వరకు ఉన్న మొత్తం దూరాన్ని అన్ని స్టాపులతో కలిపి కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
Budget Smartphones: కేవలం రూ.10000 లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..
ఒకే ట్రాక్ పై ఇంటర్-సిటీ ప్రయాణం కోసం ‘నమో భారత్’, ఇంట్రా-సిటీ (నగరం లోపల) ప్రయాణం కోసం ‘మీరట్ మెట్రో’ సేవలను అనుసంధానించడం ద్వారా భారతీయ రవాణా రంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఈ వ్యవస్థ వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, ప్రయాణం మరింత సులభతరం కానుంది.
తాజావార్తలు
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pant LSG Journey: ఎఫ్ వర్డ్, విమర్శలు, అసంతృప్తి, లీడర్షిప్ రీసెట్.. ఎల్ఎస్జీలో పంత్ ప్రయాణం సాగిందిలా!
-
Rajinikanth173 : సూపర్ స్టార్ 173 టైటిల్ ‘ధర్మన్’ ది డెడ్లీ డాక్టర్.. దర్శకుడు ఎవరంటే?
-
Sardar2 : కార్తీ ‘సర్దార్ -2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారి యాక్షన్ డబుల్
-
Gold Price Prediction: బంగారం ధరలు రూ.30,000 వరకు తగ్గే అవకాశం.. డాయిష్ బ్యాంక్ సంచలన రిపోర్ట్?
ట్రెండింగ్
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!