PM Modi: ‘నమో భారత్’, ‘మీరట్ మెట్రో’లను ప్రారంభించనున్న ప్రధాని.. 12,930 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు మధ్యాహ్నం మీరట్ లోని శతాబ్ది నగర్ స్టేషన్లో మీరట్ మెట్రో మరియు నమో భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన శతాబ్ది నగర్ నుండి మీరట్ సౌత్ స్టేషన్ వరకు స్వయంగా మెట్రోలో ప్రయాణించనున్నారు. ఆ తర్వాత మీరట్ లో రూ.12,930 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Income Tax Rules: క్రెడిట్ కార్డ్ వినియోగదారులు జాగ్రత్త.. ఐటీ శాఖ కొత్త నిబంధనలు ఇవే!
Also Read
- Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
- Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
- Milk Storage Tips: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా..? ఈ చిన్న చిట్కాలతో తాజాగా నిల్వ చేసుకోండి
- PM Modi: చెప్పడమే కాదు.. చేసి చూపించారు.. పెట్రోల్ సేవ్ చేసేందుకు 'కాన్వాయ్' కట్ చేసిన ప్రధాని మోడీ!
ఢిల్లీ-మీరట్ మధ్య నిర్మించిన పూర్తి 82 కిలోమీటర్ల పొడవైన ‘నమో భారత్’ కారిడార్ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ నుండి న్యూ అశోక్ నగర్ వరకు ఉన్న 5 కి.మీ సెక్షన్. ఇంకా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ సౌత్ నుండి మోదీపురం వరకు ఉన్న 21 కి.మీ సెక్షన్లను ఆయన ప్రారంభిస్తారు. గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ ‘రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్’ (RRTS), దేశంలోనే మొట్టమొదటిది. ఇది సాహిబాబాద్, ఘజియాబాద్, మోదీనగర్, మీరట్ వంటి ప్రధాన పట్టణాలను ఢిల్లీతో అతివేగంగా అనుసంధానిస్తుంది.
నమో భారత్ రైళ్లు ప్రయాణించే అదే ట్రాక్స్ పైన మీరట్ మెట్రో కూడా నడవడం ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత. గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ మెట్రో, దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో వ్యవస్థగా రికార్డు సృష్టించనుంది. మీరట్ సౌత్ నుండి మోదీపురం వరకు ఉన్న మొత్తం దూరాన్ని అన్ని స్టాపులతో కలిపి కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
Budget Smartphones: కేవలం రూ.10000 లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..
ఒకే ట్రాక్ పై ఇంటర్-సిటీ ప్రయాణం కోసం ‘నమో భారత్’, ఇంట్రా-సిటీ (నగరం లోపల) ప్రయాణం కోసం ‘మీరట్ మెట్రో’ సేవలను అనుసంధానించడం ద్వారా భారతీయ రవాణా రంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఈ వ్యవస్థ వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, ప్రయాణం మరింత సులభతరం కానుంది.
తాజావార్తలు
-
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
-
Bhuvneshwar Kumar: నేను బౌలర్ను కాదు.. భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
-
Milk Storage Tips: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా..? ఈ చిన్న చిట్కాలతో తాజాగా నిల్వ చేసుకోండి
-
Pat Cummins: ఎస్ఆర్హెచ్ కెప్టెన్కు బీసీసీఐ బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్కు పీడకలగా మారిన అహ్మదాబాద్ మ్యాచ్!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!