PM Modi: ‘నమో భారత్’, ‘మీరట్ మెట్రో’లను ప్రారంభించనున్న ప్రధాని.. 12,930 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు మధ్యాహ్నం మీరట్ లోని శతాబ్ది నగర్ స్టేషన్లో మీరట్ మెట్రో మరియు నమో భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన శతాబ్ది నగర్ నుండి మీరట్ సౌత్ స్టేషన్ వరకు స్వయంగా మెట్రోలో ప్రయాణించనున్నారు. ఆ తర్వాత మీరట్ లో రూ.12,930 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Income Tax Rules: క్రెడిట్ కార్డ్ వినియోగదారులు జాగ్రత్త.. ఐటీ శాఖ కొత్త నిబంధనలు ఇవే!
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
ఢిల్లీ-మీరట్ మధ్య నిర్మించిన పూర్తి 82 కిలోమీటర్ల పొడవైన ‘నమో భారత్’ కారిడార్ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ నుండి న్యూ అశోక్ నగర్ వరకు ఉన్న 5 కి.మీ సెక్షన్. ఇంకా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ సౌత్ నుండి మోదీపురం వరకు ఉన్న 21 కి.మీ సెక్షన్లను ఆయన ప్రారంభిస్తారు. గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ ‘రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్’ (RRTS), దేశంలోనే మొట్టమొదటిది. ఇది సాహిబాబాద్, ఘజియాబాద్, మోదీనగర్, మీరట్ వంటి ప్రధాన పట్టణాలను ఢిల్లీతో అతివేగంగా అనుసంధానిస్తుంది.
నమో భారత్ రైళ్లు ప్రయాణించే అదే ట్రాక్స్ పైన మీరట్ మెట్రో కూడా నడవడం ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత. గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ మెట్రో, దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో వ్యవస్థగా రికార్డు సృష్టించనుంది. మీరట్ సౌత్ నుండి మోదీపురం వరకు ఉన్న మొత్తం దూరాన్ని అన్ని స్టాపులతో కలిపి కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
Budget Smartphones: కేవలం రూ.10000 లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..
ఒకే ట్రాక్ పై ఇంటర్-సిటీ ప్రయాణం కోసం ‘నమో భారత్’, ఇంట్రా-సిటీ (నగరం లోపల) ప్రయాణం కోసం ‘మీరట్ మెట్రో’ సేవలను అనుసంధానించడం ద్వారా భారతీయ రవాణా రంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఈ వ్యవస్థ వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, ప్రయాణం మరింత సులభతరం కానుంది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!