-
మూసీలో పోటెత్తిన వరద.. మూసారాంబాగ్, చాదర్ఘాట్ బ్రిడ్జిల మూత..
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్తో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎగువ నుంచి భారీ వరదలు రావడంతో.. హైదరాబాద్ జంట జలాశయాలకు క్రమంగా ఇన్ఫ్లో పెరిగిపోతోంది.. దీంతో.. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేసి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఓవైపు జంట జలాశయాల నుంచి వచ్చే నీటితో పాటు.. మరోవైపు వర్షం నీరు మూసీలో చేరడంతో.. ఉధృతంగా ప్రవహిస్తోంది మూసీ నది.. ఇప్పటికే మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరద వెళ్తుండగా.. చాదర్ఘాట్ దగ్గర ఉన్న చిన్న […] -
వరదలో కొట్టుకపోయిన ఆర్టీసీ బస్సు
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మహారాష్ట్రలో వర్షాల కారణంగా.. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.. ఇక, యావత్మాల్ జిల్లాలో వరదలో బస్సు కొట్టుకుపోయింది.. దాహగాం పుల్మారాలో వాగు వంతెనపై నుంచి వదర నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. మహారాష్ట్ర ఎస్టీ బస్ను అలాగే పోనించాడు డ్రైవర్.. అయితే, వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో.. బస్సు కొట్టుకుపోయింది.. ఇక, స్థానికులు అప్రమత్తం అయ్యి.. బస్సులో ఉన్న ఇద్దరిని రక్షించినట్టు […] -
సిద్ధూ రాజీనామా.. ఇలా స్పందించిన కెప్టెన్ అమరీందర్ సింగ్
పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక సంక్షోభం ముగిసిందనుకున్న సమయంలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది.. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ పంపారు.. అయితే, తాను పార్టీని వీడడం లేదని.. కాంగ్రెస్లోనే కొనసాగుతానని పేర్కొన్నారు. మొత్తంగా పీసీసీ చీఫ్గా 72 రోజులు మాత్రమే పనిచేశారు సిద్ధూ.. ఇక, ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు అమరీందర్ సింగ్… “నేను ముందే […] -
హెరిటేజ్పై సీఎం జగన్ విమర్శలు..
గత టీడీపీ ప్రభుత్వం, హెరిటేజ్పై విమర్శలు గుప్పించారు సీఎం వైఎస్ జగన్.. జగనన్న పాలవెల్లువ, మత్స్యశాఖలపై సమీక్ష నిర్వహించారు సీఎం.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం– కార్యదర్శికి మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ- శిక్షణా కరదీపిక పుస్తకాలను ఆవిష్కరించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో సహకార రంగంలోని డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించారని.. కొందరు సహకార డెయిరీలను తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారని ఆరోపించారు.. సహకార […] -
పంజాబ్లో కీలక పరిణామం.. పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా
పంజాబ్లో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. ఇటీవలే సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. సిద్ధూను ఎప్పటికీ సీఎంను కానివ్వను అంటూ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.. మరోవైపు.. పంజాబ్ కాంగ్రెస్లో పొలిటికల్ డ్రామా తారాస్థాయికి చేరింది.. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. అయితే, తాను పార్టీని వీడడం లేదని.. మరికొన్ని రోజులు కాంగ్రెస్లోనే […] -
రైతులకు పరిహారం చెల్లించాల్సిందే.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
గతేడాది వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.. నష్టపోయిన రైతులకు 3 నెలల్లో ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని స్పష్టం చేసింది.. నాలుగు నెలల్లో బీమా సొమ్ము కూడా చెల్లించాలని ఆదేశించిన కోర్టు.. నష్టపోయిన కౌలుదారులకు కూడా పరిహారం, బీమా చెల్లించాలని పేర్కొంది.. పంట దెబ్బతిన్న రైతులను కూడా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది.. రైతు స్వరాజ్య వేదిక విస్సా కిరణ్ కుమార్, రవి కన్నెగంటి, ఎస్.ఆశలత పిల్ పై […] -
హుజురాబాద్ బైపోల్.. ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు
ఎట్టకేలకు హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రభుత్వ సూచనలతో గతంలో వాయిదా పడినా.. ఇప్పుడు షెడ్యూల్ వచ్చేసింది.. ఈ నేపథ్యంలో.. కీలక ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్.. కేంద్ర ఎన్నికల సంఘం హుజురాబాద్ ఉప ఎన్నికలకి షెడ్యూల్ ఇచ్చింది.. అక్టోబర్ 30న ఎన్నికలు ఉంటాయి. నవంబర్ 2 ఫలితాలు వెలువడతాయని తెలిపారు.. కోవిడ్ కేసులు ఇంకా వెలుగు చూస్తున్న నేపథ్యంలో.. నిబంధనలు ఏవిధంగా […] -
సినీ పరిశ్రమకు పవన్ కల్యాణ్ గుదిబండ.. అంతా అదే టాక్..!
సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయం విషయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.. ఈ నేపథ్యంలో పవన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… జనసేనానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఒళ్లంతా బురద చల్లుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. తమ పాలిట గుదిబండ అయ్యారని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ పవన్ కల్యాణ్ గురించి […] -
బెజవాడలో పొలిటికల్ హీట్.. కేశినేని భవన్కు భారీగా పార్టీ శ్రేణులు..
బెజవాడలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది.. ఇక, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోను.. నా కూతురు కూడా ఎన్నికల్లో పోటీ చేయదంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని తెగేసే చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.. దీంతో.. బెజవాడలో టీడీపీ పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది.. కార్పొనేషన్ ఎన్నికల సమయంలో.. టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు చెక్పెట్టేందుకు అప్పట్లో చంద్రబాబు రంగంలోకి దిగారు.. తర్వాత అంతా కేశినేని […] -
పవన్పై కామెంట్లు.. వైసీపీకి జీవీఎల్ కౌంటర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్, అధికార వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. సీఎం వైఎస్ జగన్, మంత్రులపై పవన్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అదే తరహాలో సోషల్ మీడియా వేదికగా ఘాటుగా కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్.. ఇక, తాజాగా ఈ ఎపిసోడ్పై స్పందించారు బీజేపీ సీనియర్ నేత, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు.. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్పై […]
తాజావార్తలు
-
Riyan Parag-Vaibhav: మేమేమైనా ఫిల్మ్ స్టార్స్ హా.. ఫోటోగ్రాఫర్లకు షాక్ ఇచ్చిన రియాన్ పరాగ్!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Maa Inti Bangaram:స్టేజ్పైనే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని..
-
Tamil Nadu Politics: సీఎం విజయ్ సైలెంట్ ఆపరేషన్..మేజిక్ ఫిగర్పై ‘టీవీకే’ కన్ను.. కాంగ్రెస్కు తప్పని టెన్షన్!
-
Devara : రిలీజ్ అయిన రెండేళ్లకు దేవర శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!