India vs South Africa: సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం.. సన్నగిల్లిన సెమీస్ ఆశలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs South Africa: సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా పరాజయం పాలైంది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ టీ20 వరల్డ్ కప్లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో గెలిచిన భారత జట్టు సూపర్ 8లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. 188 లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సూర్య సైన్యం 111 పరుగులకే కుప్పకూలిపోయింది. ఒక్క శివమ్ దూబే(42) మాత్రమే చివరి వరకు పోరాడాడు. కానీ.. సరైన పాట్నర్ లేకపోవడంతో ఏం చేయలేకపోయాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా 187 పరుగులు చేసింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. తొలి ఓవర్లోనే ఐడెన్ మార్క్రమ్ వేసిన ఆఫ్ బ్రేక్ బంతిని భారీ షాట్కు ప్రయత్నించిన కిషన్(0) రియన్ రికెల్టన్ చేతికి చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్లోనే జాన్సెన్ తిలక్ వర్మను అవుట్ చేశాడు. సూర్య, అభిషేక్ల నుంచి భారీ భాగస్వామ్యం ఆశించనా ఫలితం లేకుండా పోయింది. అభిషేక్ మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో జాన్సెన్ అభిషేక్(15)ను అవుట్ చేశాడు. ఆరు ఓవర్ల తర్వాత, భారత స్కోరు 31-3కి పడిపోయింది. ఆ తర్వాత ఎనిమిదో ఓవర్లో వాషింగ్టన్ సుందర్ 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తొమ్మిదో ఓవర్లో భారత్ 50 పరుగుల మార్కును దాటింది.
READ MORE: Jasprit Bumrah: బుమ్రా నయా హిస్టరీ.. టీ20 వరల్డ్కప్ చరిత్రలో టాప్ వికెట్ టేకర్గా యార్కర్ కింగ్..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
10వ ఓవర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 18 పరుగులు) ఔటవ్వడంతో టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. 10 ఓవర్ల తర్వాత భారత్ 57-5కి పరిమితమైంది. 15వ ఓవర్లో కేశవ్ మహారాజ్ హార్దిక్(18), రింకు సింగ్(0)ను అవుట్ చేశాడు. అదే ఓవర్లో కేశవ్ అర్ష్ దీప్(1)ను సైతం పెవిలియన్కు పంపాడు. దీంతో ఒకే ఓవరల్లో కేశవ్ మొత్తం మూడు వికెట్లు పడగొట్టాడు. శివం దూబే 42 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ టీం ఇండియా 19వ ఓవర్లో 111 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమి భారత రన్ రేట్ -3.80కి తగ్గింది. దీని అర్థం భారతదేశం తదుపరి రెండు మ్యాచ్లను గణనీయమైన తేడాతో గెలవాలి. భారతదేశం సెమీ-ఫైనల్కు చేరుకోవాలనే ఆశలు ఈ ఓటమితో తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు.. దక్షిణాఫ్రికా తరఫున జాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, లుంగి మూడు, బాష్ రెండు వికెట్లు పడగొట్టారు.
READ MORE: India vs South Africa: మిల్లర్ దూకుడు.. బుమ్రా పంజా! సూపర్ 8లో టీమిండియాకు తప్పని అగ్ని పరీక్ష!
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!