India vs South Africa: మిల్లర్ దూకుడు.. బుమ్రా పంజా! సూపర్ 8లో టీమిండియాకు తప్పని అగ్ని పరీక్ష!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs South Africa: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నేడు భారత్ దక్షిణాఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్లో తలపడింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 187 పరుగులు చేసింది. భారత్కు 188 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే.. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా తమ జట్టులో నాలుగు మార్పులు చేసింది. కానీ భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా ఈ మ్యాచ్ లోకి అడుగుపెట్టింది. గత రెండు నెలల్లో ఇరు జట్లు తలపడటం ఇది ఆరోసారి. అయితే, ఈ ప్రపంచ కప్ లో వారు తలపడటం ఇదే తొలిసారి. భారత్ ఇప్పుడు బ్యాటింగ్ చేస్తోంది.
READ MORE: USA: అమెరికాలో మెరిసిన పెద్దపల్లి కళాకారుడు.. మహాభారత చిత్రంతో అదరగొట్టిన తెలుగోడు..
Also Read
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
దక్షిణాఫ్రికా జట్టు తరఫున డికాక్, మార్క్రామ్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. అయితే, జస్ప్రీత్ బుమ్రా రెండో ఓవర్లో డికాక్(6)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అర్ష్దీప్ మార్క్రామ్ను అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా కేవలం 12 పరుగులకే పరిమితమైంది. అప్పటికీ.. బుమ్రా విధ్వంసం కొనసాగింది. తన రెండవ ఓవర్(ఇన్నింగ్స్లో నాల్గవ ఓవర్)లో ర్యాన్ రికెల్టన్(7)ను అవుట్ చేశాడు. ఆరు ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా 41-3తో నిరుత్సాహంగా కనిపించింది. వెంటనే.. డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్ ఎంట్రీ ఇచ్చారు. బ్రెవిస్ కేవలం 29 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. మిల్లర్తో కలిసి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 13వ ఓవర్లో శివమ్ దుబే బ్రెవిస్ను అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యం తెరపడింది. కానీ మిల్లర్ ఊచకోత మొదలు పెట్టాడు. 35 బంతుల్లో 63 పరుగులు చేశాడు. 16వ ఓవర్లో, వరుణ్ డేవిడ్ మిల్లర్ వికెట్ తీసుకోవడంతో దక్షిణాఫ్రికాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత, 18వ ఓవర్లో, అర్ష్దీప్ జాన్సెన్ను అవుట్ చేశాడు. 19వ ఓవర్లో, బుమ్రా మరో వికెట్ తీసుకున్నాడు. కానీ స్టబ్స్ చివరికి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా భారత్కు 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ రెండు వికెట్లు పడగొట్టగా, వరుణ్, దూబే ఒక్కో వికెట్ తీశారు. అయితే.. ఈ స్టేడియంలో ఇంత పెద్ద స్కోర్ సాధించడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. సూపర్ 8లో టీమిండియాకు అగ్ని అగ్ని పరీక్ష తప్పడం లేదు!
తాజావార్తలు
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!