భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.. ఇప్పటికే 14 రోజులు పూర్తి చేసుకున్న బండి పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది.. ఇవాళ సంగారెడ్డిలోని సంగుపేట నుంచి చిట్కూల్ వరకు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర కొనసాగనుంది.. ఇక, జోగిపేట్ మెయిన్ రోడ్.. హనుమాన్ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు.. మరోవైపు, సంజయ్తో పాటు ఇవాళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి […]
జమ్మూకాశ్మీర్ పర్యటనలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. జమ్మూకశ్మీర్తో మా కుటుంబానికి అనుబంధం ఉందన్న ఆయన.. తమ కుటుంబీకులు కూడా కశ్మీరీ పండిట్లేనని చెప్పారు.. ఇక్కడికి వచ్చి వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించినప్పుడు తన సొంతింటికి వచ్చినట్లు అనిపించిందన్నారు. ఇక, కొందరు కశ్మీరి పండిట్లు రాహుల్ గాంధీని కలిశారు. అయితే, వారి కోసం ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రవేశపెట్టిందని రాహుల్ గాంధీ. కశ్మీరీ పండిట్ సోదరులకు తన వంతు ఏదైనా సాయం చేస్తానని చెప్పారు. […]
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్కు బైక్లంటే ఎంతో ఇష్టం.. అప్పుడప్పుడు ఖరీదైన బైక్లపై హైదరాబాద్లో చక్కర్లు కొట్టేస్తుంటాడు.. 2020లో ఓసారి ఓవర్ స్పీడ్ కారణంగా పోలీసులు ఫైన్ కూడా వేశారు. ఇక, ఇప్పుడు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ బైక్ ఖరీదు అక్షరాల 18 లక్షలు.. ఇది 1160 సీసీతో నడిచే స్పోర్ట్స్ బైక్.. మూడు ఇంజిన్ల ఉండటం ఈ బైక్ ప్రత్యేకత.. దీనిని లగ్జరీ బైక్లకు పేరుగాంచిన ట్రయంప్ సంస్థ తయారు చేసింది. ఈ […]
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూసేవారికి గుడ్ న్యూస్.. క్రమంగా పసిడి ధర దిగివస్తూనే ఉంది.. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 తగ్గిపోయింది.. గత మూడు రోజుల్లో 560 రూపాయలు తగ్గడంతో.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000కి క్షీణించింది.. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.510 తగ్గుదలతో రూ.44,000కు పడిపోయింది. మరోవైపు.. పసిడి బాటలోనే వెండి ధర కూడా కిందకు దిగివచ్చింది.. […]
మూడు రోజుల క్రితం వరకు తెలంగాణవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. అయితే రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 5 రోజులు ఉరుములు, మెరుపులతో […]
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరో సాయిధరమ్ తేజ్కు అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సాయితేజ్ శరీరంలో అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని, కాలర్బోన్ విరిగిందని పేర్కొన్నారు. ఆయన ఇంకా 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని… ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది.. తప్పనిసరిగా కోలుకుంటారాన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు అపోలో వైద్యులు. కాగా, నిన్న రాత్రి […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో మాటపడే అవకాశం ఉంది.. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం.. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పేలా లేవు. వృషభం : ఈ రోజు ఈ రాశివారు భాగస్వామిక చర్చల్లో చేసే ప్రతిపాదనలకు గుర్తింపు, ఆమోదం లభిస్తాయి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయడం మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఒక స్థిరాస్తి […]
ఉత్తరప్రదేశ్లోని సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మరో కీల నిర్ణయం తీసుకుంది.. శ్రీకృష్ణుడు జన్మస్థలంలో మాంసం, మద్యం విక్రయాలపై నిషేధం విధించింది… బృందావన్-మధురతో పాటు.. వాటికి 10 కిలోమీటర్ల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం విధించింనట్టు యోడీ సర్కార్ పేర్కొంది.. ఇక, ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది ప్రభుత్వం.. మధుర, బృందావన్ను టూరిస్ట్ ప్లేస్లుగా ప్రకటించడంతో.. అక్కడ మద్యం, మాంసంపై నిషేధం విధించామని.. ఇప్పటి వరకు ఆ వృత్తుల్లో ఉన్న వారికి […]
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.. ఇక, వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు శోభ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ – శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య… తదితరులు పాల్గొన్నారు. […]
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య మళ్లీ భారీగా పెరింది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 67,911 శాంపిల్స్ పరీక్షించగా.. 1,608 మందికి పాజిటివ్గా తేలింది.. మరో ఆరుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 1,107 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి […]