ఆ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత కుదరదు.. స్పష్టం చేసిన వెంకయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టులో జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే… ఇక, ఆ 12 మంది ఎంపీలను శీతాకాల సమావేశాల్లో కూడా సస్పెండ్ చేస్తూ రాజ్యసభ సోమవారం తీర్మానాన్ని ఆమోదించడంతో.. ఒక్కసారిగా పొలిటిక్ హీట్ పెరిగింది… రాజ్యసభ సభ్యులు.. ఫూలో దేవి నేత, ఛాయా వర్మ, రిపున్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, డోలా సేన్, శాంతా చెత్రి, ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్, ఎలమారమ్ కరీమ్, బినయ్ విశ్వంను శీతాకాల సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం ప్రవేశపెట్టడం.. మూజువాణి ఓటుతో ఆమోదించడం జరిగిపోయాయి..
అయితే, ఈ వ్యవహారంపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరగగా.. ఆ 12 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు మల్లిఖార్జున్ ఖర్గే.. వర్షాకాల సమావేశాల్లో జరిగిన ఘటనపై ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకున్నారంటూ ఆయన నిలదీశారు.. ఇక, దీనిపై స్పందించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు.. వర్షాకాల సమావేశాల్లో ఎదురైన చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతున్నాయని వ్యాఖ్యానించారు.. సభలో అనుచితంగా ప్రవర్తిస్తూ రభస సృష్టించిన ఎంపీలపై చర్యలు తీసుకునే హక్కు చైర్మన్కు ఉందన్న ఆయన.. సస్పెన్షన్ ఎత్తివేత అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు.. సస్పెన్షన్ ఎత్తివేత కుదరని స్పష్టం చేశారు.
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!