ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో లేఖ రాశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. ప్రభుత్వానికి అనేక అంశాలపై లేఖలు రాస్తూ వచ్చిన ఆయన.. ఈ సారి కోడిగుడ్ల నాణ్యతను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే కోడిగుడ్లల్లో నాణ్యత లేదని లేఖలో పేర్కొన్నా సోము వీర్రాజు.. కుళ్లిపోయిన కోడిగుడ్లను ఇవ్వడం వల్ల పిల్లలకు వాంతులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. పౌష్టికాహార లోపాన్ని నివారించేలా కేంద్రం తగినంతగా నిధులిస్తున్నా.. […]
దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై గత కొంతకాలంగా చర్చ సాగుతూనే ఉంది… గతంలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. ప్రస్తుతం పురుషుల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు, అమ్మాయిల వయసు 18 ఏళ్లుగా ఉండగా.. దీనిపై సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం… అమ్మాయిల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనకు తీసుకొచ్చింది.. ఇక, ఈ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడావేసినట్టుగా చెబుతున్నారు.. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ […]
పీఆర్సీ పై పీటముడి వీడడం లేదు.. పీఆర్సీ, ఇతర 70 డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుల సజ్జల నిన్న జరిపిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి.. అయితే.. ఇవాళ అంటే.. వరుసగా మూడో రోజూ కూడా చర్చలు కొనసాగనున్నాయి.. ఉద్యోగ సంఘాలతో మరో దఫా చర్చించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల.. ఫిట్మెంట్, మానిటరీ బెనిఫిట్స్ అమలు తేదీ తేలటమే కీలకంగా మారినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు, […]
రాజకీయాల్లో.. ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్న నేతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి… పదువులు కూడా పోగొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.. తాజాగా, గోవా మంత్రి మిలింద్ నాయక్.. తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది… మంత్రి మిలింద్ నాయక్.. అధికారాన్ని దుర్వినియోగం చేశారని.. ఒక మహిళను లైంగికంగా వేధించారంటూ కాంగ్రెస్ పార్టీ గోవా అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ ఆరోపణలు గుప్పించారు.. ఆ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.. […]
హైదరాబాద్లోని గచ్చిబౌలి నానక్రాంగూడలో సీబీఐ అధికారులమంటూ ఓ ఇంట్లోకి దూరిన దొంగల ముఠా.. సోదాలు చేయాలంటూ ఇంటిని గుల్ల చేశారు.. కిలో 44 గ్రాముల బంగారంతో పాటు రూ.2 లక్షల నగదును దోచేశారు.. ఇక, నకిలీ సీబీఐ అధికారులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు.. నకిలీ ఐడీ కార్డులు సృష్టించి దోపిడీకి పాల్పడ్డారని.. ఇంటి యజమాని సుబ్రహ్మణ్యంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంవత్సరం క్రితం కలిసి పని చేసిన వ్యక్తులే దొంగతనానికి […]
బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాటపట్టారు.. ప్రభుత్వ రంగ బ్యాంకులు నేటి నుంచి రెండు రోజుల పాటు సమ్మెలో పాల్గొనబోతున్నాయి.. డిసెంబర్ 16, 17 తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఈ సమ్మెలో పాల్గొని.. తమ డిమాండ్లను వినిపించబోతున్నాయి.. ఇంతకీ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు వెళ్లాల్సిన కారణాలు ఏంటి? వారి డిమాండ్లు ఏంటి? అని ఓసారి పరిశీలిస్తే.. ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో రెండింటిని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని ప్రభుత్వం బడ్జెట్ 2021-22లో కేంద్రం నిర్ణయించడం.. […]
తమిళనాడు తాజాగా జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం 14 మంది మృతిచెందిన ఘటన అందరినీ కలచివేసింది.. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక చోట వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఇవాళ మరో విమానం కుప్పకూలింది.. 9 మంది ప్రాణాలను తీసింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్లో ఓ విమానం ప్రమాదానికి గురైంది.. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఇద్దరు సిబ్బంది సహా ఏడుగురు ప్రయాణికులతో ఓ ప్రైవేట్ […]
ఆఫీసులోనో.. ఇంట్లోనో.. కూర్చొని.. నచ్చిన ఫుడ్, మెచ్చిన హోటల్ నుంచి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లో ఆర్డర్ చేస్తే.. కోరుకున్న చోటుకే ఫుడ్ వచ్చేస్తోంది.. ఇదంతా ఏ సిటీ, టౌన్లోనే అయితేనే సాధ్యం.. కానీ, ఆ హద్దులు చెరిపేసి.. అంతరిక్షంలోనూ ఫుడ్ డెలివరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది ‘ఊబెర్ ఈట్స్’ ఫుడ్ డెలివరీ యాప్.. అయితే, అంతరిక్షం నుంచి ఆర్డర్ రావడం ఏంటి..? ఆ ఆర్డర్ ఎలా డెలివరీ చేశారు..? అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా […]
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్.. ఇప్పుడు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ థర్డ్ వేవ్కు కూడా దారితీసే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఉన్నాయి.. అయితే, ఫస్ట్వేవ్, సెకండ్ వేవ్ సమయంలోనూ చిన్నారులు కరోనా బారినపడ్డా.. ఇప్పుడు ఒమిక్రాన్ చిన్నారులపై పడగ విప్పుతుందా? అనే టెన్షన్ మొదలైంది.. దానికి కారణం లేకపోలేదు.. ఎందుకంటే.. తాజాగా పశ్చిమ బెంగాల్లో మొదటి ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. ముర్షిదాబాద్ జిల్లాకు […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని కాంట్రాక్టర్లు, బిల్డర్లకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదురవుతాయి. సతీసమేతంగా ఒక పుణ్య క్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలు కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా మెలగాలి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వృషభం : ఈ రోజు ఈ రాశివారు వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మీ ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలిస్తాయి. ధనమూలక సమస్యలను ధీటుగా […]