ఈ నెలలో క్రిస్మస్, జనవరిలో సంక్రాంతి పండుగలను రానున్నాయి… సంక్రాంతి పండుగ అంటే తెలుగు లోగిళ్లలో సందడి వాతావరణం నెలకొంటుంది.. పట్టణాలను వదిలి.. అంతా పల్లెబాట పడతారు.. దీంతో.. అసలైన పండుగ గ్రామాల్లోనే కనిపిస్తోంది.. ఇక, క్రిస్మస్, సంక్రాంతి సెలవులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలోని స్కూళ్లకు ఈనెల 23 నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానుండగా.. జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు మొదలుకానున్నాయి.. క్రిస్మస్ సెలవులు ఈ నెల 23 నుంచి 30వ […]
మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. రవాణా రంగాల వారికి సంతృప్తి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రముఖులను మీ ఇంటికి విందుకు ఆహ్వానిస్తారు. స్త్రీలు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలించవు. పెద్దలకు శుభాకాంక్షలు అందజేస్తారు. మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి పొందుతారు. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. మత్స్య కోళ్ళ […]
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. సౌతాఫ్రికాలో వెలుగు చూసి క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా ఒమిక్రాన్ బారినపడిపోయింది.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి.. 36 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించింది అమెరికా.. ఈ నేపథ్యంలో ఆ దేశ పౌరులకు వార్నింగ్ ఇచ్చారు అధ్యక్షుడు జో బైడెన్.. శీతాకాలంలో మహమ్మారి మరణాలు, తీవ్ర అస్వస్ధతతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరిగిపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఇప్పటి వరకు వ్యాక్సిన్ […]
నవ్వుపై అనేక అభిప్రాయాలు ఉన్నాయి.. నవ్వని వాడు మనిషే కాదు అని ఎందరో అంటే.. నవ్వు నాలుగు విధాలుగా చేటు అనేవారు కూడా లేకపోలేదు.. అయితే, ఆ నవ్వు గోల ఎలా ఉన్నా.. సంచలన నిర్ణయాలకు వేదికైన ఉత్తర కొరియా.. తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది.. ఆ దేశంలో బహిరంగ ప్రదేశాల్లో నవ్వడం నిషేధం విధించింది.. ఇవాళ్టి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.. కేవలం నవ్వడంపై మాత్రమే కాదు మద్యం సేవించడం, సరుకులు కొనేందుకు షాపింగ్కు […]
పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. జంగారెడ్డిగూడెం సమీపంలో డివైడర్ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడిపోయింది.. అశ్వారావుపేట నుండి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ చిన్నారావు, తొమ్మిది మంది ప్రయాణికులు సహా మొత్తం 10 మంది మృతిచెందారు.. మరికొందరి పరిస్ధితి విషమంగా ఉంది.. అయితే, ఆ ప్రమాదానికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. Read […]
తెలంగాణలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తాజా ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది.. తాజాగా హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది.. అయితే.. మొదట ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీలో మాత్రం టెన్షన్ నెలకొంది.. ఆ ప్రాంతంలో ట్రేసింగ్, టెస్టింగ్ విస్తృతంగా నిర్వహిస్తున్నాయి మెడికల్ టీమ్లు… కాంటాక్టుల్లోనూ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. దీంతో.. ఆ ప్రాంతంలో మరింత […]
సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క హస్తిన పర్యటన వాయిదా పడింది.. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో జరగాల్సిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ రద్దు అయ్యింది. మరోవైపు రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు సీనియర్ పొలిటిషన్, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్.. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుచరులతో సమావేశమై చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయానికి రానున్నారు. మొత్తంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత తిరిగి కాంగ్రెస్ […]
రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కొన్ని సందర్భాల్లో నోరు జారీ.. తమ తప్పును గ్రహించి క్షమాపణలు కోరిన సందర్భాలు చాలానే ఉంటాయి.. తాజాగా, కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్కు ఈ పరిస్థితి ఎదురైంది.. బుధవారం కర్ణాటక అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీ.. అయితే, దానికి స్పీకర్ అనుమతించలేదు.. ఈ సమయంలో స్పీకర్ను ఉద్దేశించి కాంగ్రెస్ సభ్యుడు, మాజీ స్పీకర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఒక సామేతను చెప్పుకొచ్చారు.. ‘ఒక సామెత […]
నామినేటెడ్ పదవుల కోసం చాలా కాలంగా ఆశావహులు ఎదురుచూస్తున్నారు.. అయితే, అందులో కొంతమందికి శుభవార్త చెప్పారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు.. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు సీఎం కేసీఆర్.. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా గజ్జెల నగేష్. తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్గా పాటిమీది జగన్ మోహన్ రావు. […]
హైదరాబాద్లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. కనీసం మిగిలినిపోయిన బిర్యానీ అయిన తిని పొట్ట నింపుకుందామని భావించిన ఓ వలస కార్మికుడి.. ఓ హోటల్కు వెళ్లాడు.. అయితే, దొంగగా భావించిన హోటల్ సిబ్బంది తీవ్రంగా కొట్టడంతో ఆ వ్యక్తి మృతిచెందాడు.. కూకట్పల్లిలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన రాజేష్ అనే కార్మికుడు భార్య, పిల్లలతో కలిసి మాదాపుర్లో ఉంటూ ప్రగతినగర్లో భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు.. […]