Election Commission: మోగిన ఎన్నికల నగారా.. 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల తేదీలు ప్రకటన..
- దేశంలో మోగిన ఎన్నికల నగారా..
- 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీకి ఎన్నికలు..
- తేదీలను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం..
Election Commission: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాలు- తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం-పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఆదివారం కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
ఎన్నికల షెడ్యూల్ ముందు పార్టీ నేతలతో , చీఫ్ ఎలక్టోరల్ అధికారులు, డీజీపీలు, జిల్లా కలెక్టర్, ఎస్పీలు, నోడల్ అధికారులతో భేటీ జరినట్లు చెప్పారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు సీఈసీ చెప్పారు. అర్హత కలిగిన ప్రతీ వ్యక్తిని ఓటర్ల జాబితాలో చేరుస్తామని చెప్పారు. అక్రమ ఓటర్లను తొలగించడానికి సర్ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. ఓటర్ల అవగాహన కోసం అధికారులు, యువ ఓటర్లతో మాట్లాడినట్లు తెలిపారు. ఓటింగ్ పారదర్శకంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల కోసం 2.19 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఈసీ చెప్పింది. దీని కోసం 25 లక్షల మంది ఎన్నికల అధికారుల్ని నియమించారు. 15 లక్షల పోలింగ్ సిబ్బంది, 8.5 లక్షల మంది భద్రతా సిబ్బంది ఉన్నారు.
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..

పశ్చిమ బెంగాల్ అత్యధికంగా 6.44 కోట్ల మంది ఓటర్లతో అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడులో 5.67 కోట్లు, కేరళలో 2.7 కోట్లు, అస్సాంలో 2.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 9.44 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ చర్చ జరుతున్న నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్ని తక్కువ విడతల్లో నిర్వహించనుంది.
Election Commission of India announces dates for Assembly elections in 5 states/UTs.
1. Assam- Date of Polling- 9th April; Date of Counting 4th May
2. Tamil Nadu- Date of Polling- 23rd April; Date of Counting- 4th May
3. West Bengal- Date of Polling- 23rd April (1st phase),… pic.twitter.com/DBOTFMnKpV
— ANI (@ANI) March 15, 2026
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!