CBSE Exams Cancelled: యుద్ధం ఎఫెక్ట్.. ఆ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు..
- కీలక నిర్ణయం తీసుకున్న సీబీఎస్ఈ..
- యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లోని పరీక్షలు రద్దు..
- గ్రేడింగ్ ఆధారంగా ఫలితాలు ప్రకటించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు విద్యారంగాన్ని కూడా తాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్.. ఇతర ప్రాంతాలలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో.. అక్కడి భారతీయ విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన పరీక్షలను బోర్డు ఇప్పుడు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఏయే దేశాల్లో ప్రభావం?
గల్ఫ్ రీజియన్లోని ప్రధాన దేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. ముఖ్యంగా.. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాల్లో ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 10 మధ్య జరగాల్సిన 12వ తరగతి ప్రధాన పరీక్షలతో పాటు.. గతంలో వాయిదా పడిన పది ఇతర పరీక్షలను కూడా రద్దు చేశారు. దాడుల కారణంగా నిర్వహించలేకపోయిన పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేసినట్లు బోర్డు స్పష్టం చేసింది.
Also Read
- Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
పరీక్షలు జరగని పక్షంలో విద్యార్థుల ప్రతిభను ఎలా అంచనా వేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై సీబీఎస్ఈ స్పందిస్తూ.. ఫలితాల గణన ప్రక్రియను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. అయితే.. విద్యా నిపుణుల అంచనా ప్రకారం ఈ క్రింది అంశాల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చే అవకాశం ఉంది.
పాఠశాల స్థాయిలో నిర్వహించిన యూనిట్ టెస్టులు, బోర్డు పరీక్షలకు ముందు జరిగిన మాక్ ఎగ్జామ్స్ మార్కులు, విద్యార్థులు సమర్పించిన ప్రాజెక్ట్ వర్క్ , ల్యాబ్ పరీక్షల పనితీరు, విద్యా సంవత్సరం పొడవునా విద్యార్థి చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను ఇవ్వనున్నారు.
Also Read:Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 4గురు మృతి..
యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలు నిలిచిపోవడం, ప్రశ్నాపత్రాల సరఫరాలో ఇబ్బందులు, అన్నింటికంటే మిన్నగా విద్యార్థుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటం వల్ల బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పరీక్షల కంటే ప్రాణాలు ముఖ్యమని భావించిన సీబీఎస్ఈ, విద్యార్థులపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది. పశ్చిమాసియాలోని భారతీయ విద్యార్థులు , వారి తల్లిదండ్రులు ఈ వార్తతో కొంత ఊరట చెందినప్పటికీ.. ఫలితాల ప్రక్రియపై ఆందోళన చెందుతున్నారు. బోర్డు త్వరలోనే పారదర్శకమైన గ్రేడింగ్ విధానాన్ని తీసుకువస్తుందని ఆశిద్దాం. ఇదిలా ఉండగా.. ఇతర దేశాల్లో, భారతదేశంలోని పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని బోర్డు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?