CBSE Exams Cancelled: యుద్ధం ఎఫెక్ట్.. ఆ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు..
- కీలక నిర్ణయం తీసుకున్న సీబీఎస్ఈ..
- యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లోని పరీక్షలు రద్దు..
- గ్రేడింగ్ ఆధారంగా ఫలితాలు ప్రకటించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు విద్యారంగాన్ని కూడా తాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్.. ఇతర ప్రాంతాలలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో.. అక్కడి భారతీయ విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన పరీక్షలను బోర్డు ఇప్పుడు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఏయే దేశాల్లో ప్రభావం?
గల్ఫ్ రీజియన్లోని ప్రధాన దేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. ముఖ్యంగా.. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాల్లో ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 10 మధ్య జరగాల్సిన 12వ తరగతి ప్రధాన పరీక్షలతో పాటు.. గతంలో వాయిదా పడిన పది ఇతర పరీక్షలను కూడా రద్దు చేశారు. దాడుల కారణంగా నిర్వహించలేకపోయిన పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేసినట్లు బోర్డు స్పష్టం చేసింది.
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
- Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
పరీక్షలు జరగని పక్షంలో విద్యార్థుల ప్రతిభను ఎలా అంచనా వేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై సీబీఎస్ఈ స్పందిస్తూ.. ఫలితాల గణన ప్రక్రియను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. అయితే.. విద్యా నిపుణుల అంచనా ప్రకారం ఈ క్రింది అంశాల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చే అవకాశం ఉంది.
పాఠశాల స్థాయిలో నిర్వహించిన యూనిట్ టెస్టులు, బోర్డు పరీక్షలకు ముందు జరిగిన మాక్ ఎగ్జామ్స్ మార్కులు, విద్యార్థులు సమర్పించిన ప్రాజెక్ట్ వర్క్ , ల్యాబ్ పరీక్షల పనితీరు, విద్యా సంవత్సరం పొడవునా విద్యార్థి చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను ఇవ్వనున్నారు.
Also Read:Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 4గురు మృతి..
యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలు నిలిచిపోవడం, ప్రశ్నాపత్రాల సరఫరాలో ఇబ్బందులు, అన్నింటికంటే మిన్నగా విద్యార్థుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటం వల్ల బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పరీక్షల కంటే ప్రాణాలు ముఖ్యమని భావించిన సీబీఎస్ఈ, విద్యార్థులపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది. పశ్చిమాసియాలోని భారతీయ విద్యార్థులు , వారి తల్లిదండ్రులు ఈ వార్తతో కొంత ఊరట చెందినప్పటికీ.. ఫలితాల ప్రక్రియపై ఆందోళన చెందుతున్నారు. బోర్డు త్వరలోనే పారదర్శకమైన గ్రేడింగ్ విధానాన్ని తీసుకువస్తుందని ఆశిద్దాం. ఇదిలా ఉండగా.. ఇతర దేశాల్లో, భారతదేశంలోని పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని బోర్డు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!