CBSE Exams Cancelled: యుద్ధం ఎఫెక్ట్.. ఆ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు..
- కీలక నిర్ణయం తీసుకున్న సీబీఎస్ఈ..
- యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లోని పరీక్షలు రద్దు..
- గ్రేడింగ్ ఆధారంగా ఫలితాలు ప్రకటించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు విద్యారంగాన్ని కూడా తాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్.. ఇతర ప్రాంతాలలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో.. అక్కడి భారతీయ విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన పరీక్షలను బోర్డు ఇప్పుడు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఏయే దేశాల్లో ప్రభావం?
గల్ఫ్ రీజియన్లోని ప్రధాన దేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. ముఖ్యంగా.. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాల్లో ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 10 మధ్య జరగాల్సిన 12వ తరగతి ప్రధాన పరీక్షలతో పాటు.. గతంలో వాయిదా పడిన పది ఇతర పరీక్షలను కూడా రద్దు చేశారు. దాడుల కారణంగా నిర్వహించలేకపోయిన పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేసినట్లు బోర్డు స్పష్టం చేసింది.
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
పరీక్షలు జరగని పక్షంలో విద్యార్థుల ప్రతిభను ఎలా అంచనా వేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై సీబీఎస్ఈ స్పందిస్తూ.. ఫలితాల గణన ప్రక్రియను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. అయితే.. విద్యా నిపుణుల అంచనా ప్రకారం ఈ క్రింది అంశాల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చే అవకాశం ఉంది.
పాఠశాల స్థాయిలో నిర్వహించిన యూనిట్ టెస్టులు, బోర్డు పరీక్షలకు ముందు జరిగిన మాక్ ఎగ్జామ్స్ మార్కులు, విద్యార్థులు సమర్పించిన ప్రాజెక్ట్ వర్క్ , ల్యాబ్ పరీక్షల పనితీరు, విద్యా సంవత్సరం పొడవునా విద్యార్థి చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను ఇవ్వనున్నారు.
Also Read:Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 4గురు మృతి..
యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలు నిలిచిపోవడం, ప్రశ్నాపత్రాల సరఫరాలో ఇబ్బందులు, అన్నింటికంటే మిన్నగా విద్యార్థుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటం వల్ల బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పరీక్షల కంటే ప్రాణాలు ముఖ్యమని భావించిన సీబీఎస్ఈ, విద్యార్థులపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది. పశ్చిమాసియాలోని భారతీయ విద్యార్థులు , వారి తల్లిదండ్రులు ఈ వార్తతో కొంత ఊరట చెందినప్పటికీ.. ఫలితాల ప్రక్రియపై ఆందోళన చెందుతున్నారు. బోర్డు త్వరలోనే పారదర్శకమైన గ్రేడింగ్ విధానాన్ని తీసుకువస్తుందని ఆశిద్దాం. ఇదిలా ఉండగా.. ఇతర దేశాల్లో, భారతదేశంలోని పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని బోర్డు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
BharatPe Flex Feature: భారత్పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
-
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!