CBSE Exams Cancelled: యుద్ధం ఎఫెక్ట్.. ఆ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు..
- కీలక నిర్ణయం తీసుకున్న సీబీఎస్ఈ..
- యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లోని పరీక్షలు రద్దు..
- గ్రేడింగ్ ఆధారంగా ఫలితాలు ప్రకటించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు విద్యారంగాన్ని కూడా తాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్.. ఇతర ప్రాంతాలలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో.. అక్కడి భారతీయ విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన పరీక్షలను బోర్డు ఇప్పుడు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఏయే దేశాల్లో ప్రభావం?
గల్ఫ్ రీజియన్లోని ప్రధాన దేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. ముఖ్యంగా.. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాల్లో ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 10 మధ్య జరగాల్సిన 12వ తరగతి ప్రధాన పరీక్షలతో పాటు.. గతంలో వాయిదా పడిన పది ఇతర పరీక్షలను కూడా రద్దు చేశారు. దాడుల కారణంగా నిర్వహించలేకపోయిన పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేసినట్లు బోర్డు స్పష్టం చేసింది.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
పరీక్షలు జరగని పక్షంలో విద్యార్థుల ప్రతిభను ఎలా అంచనా వేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై సీబీఎస్ఈ స్పందిస్తూ.. ఫలితాల గణన ప్రక్రియను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. అయితే.. విద్యా నిపుణుల అంచనా ప్రకారం ఈ క్రింది అంశాల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చే అవకాశం ఉంది.
పాఠశాల స్థాయిలో నిర్వహించిన యూనిట్ టెస్టులు, బోర్డు పరీక్షలకు ముందు జరిగిన మాక్ ఎగ్జామ్స్ మార్కులు, విద్యార్థులు సమర్పించిన ప్రాజెక్ట్ వర్క్ , ల్యాబ్ పరీక్షల పనితీరు, విద్యా సంవత్సరం పొడవునా విద్యార్థి చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను ఇవ్వనున్నారు.
Also Read:Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 4గురు మృతి..
యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలు నిలిచిపోవడం, ప్రశ్నాపత్రాల సరఫరాలో ఇబ్బందులు, అన్నింటికంటే మిన్నగా విద్యార్థుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటం వల్ల బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పరీక్షల కంటే ప్రాణాలు ముఖ్యమని భావించిన సీబీఎస్ఈ, విద్యార్థులపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది. పశ్చిమాసియాలోని భారతీయ విద్యార్థులు , వారి తల్లిదండ్రులు ఈ వార్తతో కొంత ఊరట చెందినప్పటికీ.. ఫలితాల ప్రక్రియపై ఆందోళన చెందుతున్నారు. బోర్డు త్వరలోనే పారదర్శకమైన గ్రేడింగ్ విధానాన్ని తీసుకువస్తుందని ఆశిద్దాం. ఇదిలా ఉండగా.. ఇతర దేశాల్లో, భారతదేశంలోని పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని బోర్డు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!