CBSE Exams Cancelled: యుద్ధం ఎఫెక్ట్.. ఆ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు..
- కీలక నిర్ణయం తీసుకున్న సీబీఎస్ఈ..
- యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లోని పరీక్షలు రద్దు..
- గ్రేడింగ్ ఆధారంగా ఫలితాలు ప్రకటించే అవకాశం..
పశ్చిమాసియా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు విద్యారంగాన్ని కూడా తాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్.. ఇతర ప్రాంతాలలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో.. అక్కడి భారతీయ విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన పరీక్షలను బోర్డు ఇప్పుడు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఏయే దేశాల్లో ప్రభావం?
గల్ఫ్ రీజియన్లోని ప్రధాన దేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. ముఖ్యంగా.. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాల్లో ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 10 మధ్య జరగాల్సిన 12వ తరగతి ప్రధాన పరీక్షలతో పాటు.. గతంలో వాయిదా పడిన పది ఇతర పరీక్షలను కూడా రద్దు చేశారు. దాడుల కారణంగా నిర్వహించలేకపోయిన పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేసినట్లు బోర్డు స్పష్టం చేసింది.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
పరీక్షలు జరగని పక్షంలో విద్యార్థుల ప్రతిభను ఎలా అంచనా వేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై సీబీఎస్ఈ స్పందిస్తూ.. ఫలితాల గణన ప్రక్రియను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. అయితే.. విద్యా నిపుణుల అంచనా ప్రకారం ఈ క్రింది అంశాల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చే అవకాశం ఉంది.
పాఠశాల స్థాయిలో నిర్వహించిన యూనిట్ టెస్టులు, బోర్డు పరీక్షలకు ముందు జరిగిన మాక్ ఎగ్జామ్స్ మార్కులు, విద్యార్థులు సమర్పించిన ప్రాజెక్ట్ వర్క్ , ల్యాబ్ పరీక్షల పనితీరు, విద్యా సంవత్సరం పొడవునా విద్యార్థి చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను ఇవ్వనున్నారు.
Also Read:Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 4గురు మృతి..
యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలు నిలిచిపోవడం, ప్రశ్నాపత్రాల సరఫరాలో ఇబ్బందులు, అన్నింటికంటే మిన్నగా విద్యార్థుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటం వల్ల బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పరీక్షల కంటే ప్రాణాలు ముఖ్యమని భావించిన సీబీఎస్ఈ, విద్యార్థులపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది. పశ్చిమాసియాలోని భారతీయ విద్యార్థులు , వారి తల్లిదండ్రులు ఈ వార్తతో కొంత ఊరట చెందినప్పటికీ.. ఫలితాల ప్రక్రియపై ఆందోళన చెందుతున్నారు. బోర్డు త్వరలోనే పారదర్శకమైన గ్రేడింగ్ విధానాన్ని తీసుకువస్తుందని ఆశిద్దాం. ఇదిలా ఉండగా.. ఇతర దేశాల్లో, భారతదేశంలోని పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని బోర్డు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?