Air India: ఎయిర్ ఇండియాలో బయటపడ్డ భారీ కుంభకోణం.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన టాటా గ్రూప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రస్తుతం ఒక విచిత్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంస్థ తన ఉద్యోగులకు కల్పించే ‘ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని’ (Employee Leisure Travel – ELT) వేలాది మంది సిబ్బంది దుర్వినియోగం చేసినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఈ కుంభకోణంలో సుమారు 4,000 మందికి పైగా ఉద్యోగులు భాగస్వాములైనట్లు గుర్తించిన యాజమాన్యం, వారిపై కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
READ ALSO: Election Commission: మోగిన ఎన్నికల నగారా.. 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల తేదీలు ప్రకటన..
Also Read
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
ఏమిటీ కుంభకోణం..
ఎయిర్ ఇండియా పాలసీ ప్రకారం, ప్రతి ఉద్యోగికి ఏడాదికి 14 ఉచిత రిటర్న్ టిక్కెట్లు లభిస్తాయి. వీటిని ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యులు (తల్లిదండ్రులు, భార్యాపిల్లలు) మాత్రమే వాడుకోవాలి. అయితే, దర్యాప్తులో వెల్లడైన నిజాలు యాజమాన్యాన్ని షాక్కు గురిచేశాయి.. వేలాది మంది ఉద్యోగులు తమకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను ‘బంధువుల’గా చూపి ఉచిత టిక్కెట్లు పొందారు. మరికొందరు ఉద్యోగులు ఒకడుగు ముందుకు వేసి, ఉచితంగా పొందిన టిక్కెట్లను బయటి వ్యక్తులకు భారీ ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.
కొత్తగా చేరిన వారే ఎక్కువ..
పలు నివేదికల ప్రకారం.. మొత్తం 24,000 మంది సిబ్బందిలో దాదాపు 16% మంది (4,000 మంది) ఈ అక్రమాలకు పాల్పడ్డారు. విశేషమేమిటంటే, ఈ కుంభకోణంలో చిక్కుకున్న వారిలో మెజారిటీ ఉద్యోగులు ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత, అంటే టాటా గ్రూప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేరిన వారే కావడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన టాటా యాజమాన్యం రికవరీ చర్యలు ప్రారంభించింది. మోసపూరితంగా వాడిన టిక్కెట్ల విలువను ఉద్యోగుల జీతాల నుంచి వసూలు చేస్తున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు విధించడమే కాకుండా, వారి ప్రయాణ సౌకర్యాలను రద్దు చేస్తున్నారు. ఇకపై నామినీలను చేర్చుకోవాలంటే చట్టపరమైన ఆధారాలు, రక్త సంబంధ నిరూపణ పత్రాలు సమర్పించడం తప్పనిసరి చేశారు. నష్టాల నుంచి గట్టెక్కి, సంస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని టాటా గ్రూప్ ప్రయత్నిస్తుంటే, ఉద్యోగులే ఇలాంటి అక్రమాలకు పాల్పడటం సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఆర్థిక నష్టమే కాదని, ఉద్యోగుల నైతికతకు సంబంధించిన సమస్య అని ఎయిర్ ఇండియా వర్గాలు స్పష్టం చేశాయి.
READ ALSO: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సెన్సార్ పూర్తి..!
తాజావార్తలు
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!