Air India: ఎయిర్ ఇండియాలో బయటపడ్డ భారీ కుంభకోణం.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన టాటా గ్రూప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రస్తుతం ఒక విచిత్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంస్థ తన ఉద్యోగులకు కల్పించే ‘ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని’ (Employee Leisure Travel – ELT) వేలాది మంది సిబ్బంది దుర్వినియోగం చేసినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఈ కుంభకోణంలో సుమారు 4,000 మందికి పైగా ఉద్యోగులు భాగస్వాములైనట్లు గుర్తించిన యాజమాన్యం, వారిపై కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
READ ALSO: Election Commission: మోగిన ఎన్నికల నగారా.. 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల తేదీలు ప్రకటన..
Also Read
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
ఏమిటీ కుంభకోణం..
ఎయిర్ ఇండియా పాలసీ ప్రకారం, ప్రతి ఉద్యోగికి ఏడాదికి 14 ఉచిత రిటర్న్ టిక్కెట్లు లభిస్తాయి. వీటిని ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యులు (తల్లిదండ్రులు, భార్యాపిల్లలు) మాత్రమే వాడుకోవాలి. అయితే, దర్యాప్తులో వెల్లడైన నిజాలు యాజమాన్యాన్ని షాక్కు గురిచేశాయి.. వేలాది మంది ఉద్యోగులు తమకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను ‘బంధువుల’గా చూపి ఉచిత టిక్కెట్లు పొందారు. మరికొందరు ఉద్యోగులు ఒకడుగు ముందుకు వేసి, ఉచితంగా పొందిన టిక్కెట్లను బయటి వ్యక్తులకు భారీ ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.
కొత్తగా చేరిన వారే ఎక్కువ..
పలు నివేదికల ప్రకారం.. మొత్తం 24,000 మంది సిబ్బందిలో దాదాపు 16% మంది (4,000 మంది) ఈ అక్రమాలకు పాల్పడ్డారు. విశేషమేమిటంటే, ఈ కుంభకోణంలో చిక్కుకున్న వారిలో మెజారిటీ ఉద్యోగులు ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత, అంటే టాటా గ్రూప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేరిన వారే కావడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన టాటా యాజమాన్యం రికవరీ చర్యలు ప్రారంభించింది. మోసపూరితంగా వాడిన టిక్కెట్ల విలువను ఉద్యోగుల జీతాల నుంచి వసూలు చేస్తున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు విధించడమే కాకుండా, వారి ప్రయాణ సౌకర్యాలను రద్దు చేస్తున్నారు. ఇకపై నామినీలను చేర్చుకోవాలంటే చట్టపరమైన ఆధారాలు, రక్త సంబంధ నిరూపణ పత్రాలు సమర్పించడం తప్పనిసరి చేశారు. నష్టాల నుంచి గట్టెక్కి, సంస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని టాటా గ్రూప్ ప్రయత్నిస్తుంటే, ఉద్యోగులే ఇలాంటి అక్రమాలకు పాల్పడటం సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఆర్థిక నష్టమే కాదని, ఉద్యోగుల నైతికతకు సంబంధించిన సమస్య అని ఎయిర్ ఇండియా వర్గాలు స్పష్టం చేశాయి.
READ ALSO: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సెన్సార్ పూర్తి..!
తాజావార్తలు
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!