Air India: ఎయిర్ ఇండియాలో బయటపడ్డ భారీ కుంభకోణం.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన టాటా గ్రూప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రస్తుతం ఒక విచిత్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంస్థ తన ఉద్యోగులకు కల్పించే ‘ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని’ (Employee Leisure Travel – ELT) వేలాది మంది సిబ్బంది దుర్వినియోగం చేసినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఈ కుంభకోణంలో సుమారు 4,000 మందికి పైగా ఉద్యోగులు భాగస్వాములైనట్లు గుర్తించిన యాజమాన్యం, వారిపై కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
READ ALSO: Election Commission: మోగిన ఎన్నికల నగారా.. 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల తేదీలు ప్రకటన..
Also Read
- Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
- T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
ఏమిటీ కుంభకోణం..
ఎయిర్ ఇండియా పాలసీ ప్రకారం, ప్రతి ఉద్యోగికి ఏడాదికి 14 ఉచిత రిటర్న్ టిక్కెట్లు లభిస్తాయి. వీటిని ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యులు (తల్లిదండ్రులు, భార్యాపిల్లలు) మాత్రమే వాడుకోవాలి. అయితే, దర్యాప్తులో వెల్లడైన నిజాలు యాజమాన్యాన్ని షాక్కు గురిచేశాయి.. వేలాది మంది ఉద్యోగులు తమకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను ‘బంధువుల’గా చూపి ఉచిత టిక్కెట్లు పొందారు. మరికొందరు ఉద్యోగులు ఒకడుగు ముందుకు వేసి, ఉచితంగా పొందిన టిక్కెట్లను బయటి వ్యక్తులకు భారీ ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.
కొత్తగా చేరిన వారే ఎక్కువ..
పలు నివేదికల ప్రకారం.. మొత్తం 24,000 మంది సిబ్బందిలో దాదాపు 16% మంది (4,000 మంది) ఈ అక్రమాలకు పాల్పడ్డారు. విశేషమేమిటంటే, ఈ కుంభకోణంలో చిక్కుకున్న వారిలో మెజారిటీ ఉద్యోగులు ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత, అంటే టాటా గ్రూప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేరిన వారే కావడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన టాటా యాజమాన్యం రికవరీ చర్యలు ప్రారంభించింది. మోసపూరితంగా వాడిన టిక్కెట్ల విలువను ఉద్యోగుల జీతాల నుంచి వసూలు చేస్తున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు విధించడమే కాకుండా, వారి ప్రయాణ సౌకర్యాలను రద్దు చేస్తున్నారు. ఇకపై నామినీలను చేర్చుకోవాలంటే చట్టపరమైన ఆధారాలు, రక్త సంబంధ నిరూపణ పత్రాలు సమర్పించడం తప్పనిసరి చేశారు. నష్టాల నుంచి గట్టెక్కి, సంస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని టాటా గ్రూప్ ప్రయత్నిస్తుంటే, ఉద్యోగులే ఇలాంటి అక్రమాలకు పాల్పడటం సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఆర్థిక నష్టమే కాదని, ఉద్యోగుల నైతికతకు సంబంధించిన సమస్య అని ఎయిర్ ఇండియా వర్గాలు స్పష్టం చేశాయి.
READ ALSO: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సెన్సార్ పూర్తి..!
తాజావార్తలు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!