Deputy CM Narayana swamy: చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ఘాటు వ్యాఖ్యలు.. 30 ఏళ్లు ఏం పీకారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి… చిత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆయన… సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు… చంద్రబాబు 30 ఏళ్లు ఏం పీకారు అంటూ ఫైర్ అయ్యారు.. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు ఏమి పీకాడు… మా సీఎం వైఎస్ జగన్ను పట్టుకుని కుప్పానికి వెళ్లి ఏం పీకుతాడు అని చంద్రబాబు మాట్లాడుతాడా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు… సీఎం జగన్మోహన్రెడ్డికి అపూర్వ స్వాగతం పలకడానికి కుప్పం ప్రజలు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు నారాయణస్వామి.. ఇక, చరిత్రలో నిలిచిపోయాలే కుప్పంలో వైఎస్ జగన్ పర్యటన జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ, కుప్పం వైసీపీ ఇంఛార్జ్ భరత్.. పులివెందలలో వైఎస్ జగన్ మెజారిటీ పెరుగుతుంటే… కుప్పంలో చంద్రబాబు మెజార్టీ పడిపోతా ఉందని ఎద్దేవా చేసిన ఆయన.. ఓటమి భయంతో చంద్రబాబు అబద్ధాలకు బ్రాండ్గా మారాడంటూ మండిపడ్డారు.
Read Also: Komatireddy Rajagopal Reddy: బీజేపీ తరపున మరో ‘ఆర్’ గెలవడం ఖాయం
Also Read
- Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
- Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
కాగా, రేపు కుప్పంలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్.. సీఎం పర్యటన సందర్భంగా సర్వాంగ సుందరంగా కుప్పాన్ని ముస్తాబు చేశారు.. కుప్పాన్ని వైసీపీ జెండాలతో నింపేశారు నేతలు.. 175/175.. ఫస్ట్ టార్గెట్ కుప్పం అంటూ పెయింటింగ్స్ వేశారు. ఇక, శుక్రవారం 3వ విడత వైఎస్ఆర్ చేయూత పథకాన్ని కుప్పంలో ప్రారంభిస్తారు సీఎం.. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 26,39,703 మంది మహిళలకు రూ.4,949.44 కోట్లు లబ్ది చేకూరనుంది. చిత్తూరు జిల్లాలో 1,02,584 మంది లబ్దిదారులకు రూ.192.34 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం.. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 నుండి 60 ఏళ్ల వయసు మధ్య గల అర్హులైన మహిళలకు ఒక్కొక్కరికి రూ. 18,750లను బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. చిత్తూరు జిల్లాకు చెందిన 1,02,584 మంది లబ్దిదారులకు రూ.192.34 కోట్లు లబ్ది చేకూరనుండగా.. ఒక్క కుప్పం నియోజకవర్గానికి చెందిన 15,011 మంది మహిళలకు రూ.28.14 కోట్లు వారి ఖాతాల్లో జమ కానున్నాయి.
తాజావార్తలు
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!