Deputy CM Narayana swamy: చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ఘాటు వ్యాఖ్యలు.. 30 ఏళ్లు ఏం పీకారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి… చిత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆయన… సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు… చంద్రబాబు 30 ఏళ్లు ఏం పీకారు అంటూ ఫైర్ అయ్యారు.. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు ఏమి పీకాడు… మా సీఎం వైఎస్ జగన్ను పట్టుకుని కుప్పానికి వెళ్లి ఏం పీకుతాడు అని చంద్రబాబు మాట్లాడుతాడా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు… సీఎం జగన్మోహన్రెడ్డికి అపూర్వ స్వాగతం పలకడానికి కుప్పం ప్రజలు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు నారాయణస్వామి.. ఇక, చరిత్రలో నిలిచిపోయాలే కుప్పంలో వైఎస్ జగన్ పర్యటన జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ, కుప్పం వైసీపీ ఇంఛార్జ్ భరత్.. పులివెందలలో వైఎస్ జగన్ మెజారిటీ పెరుగుతుంటే… కుప్పంలో చంద్రబాబు మెజార్టీ పడిపోతా ఉందని ఎద్దేవా చేసిన ఆయన.. ఓటమి భయంతో చంద్రబాబు అబద్ధాలకు బ్రాండ్గా మారాడంటూ మండిపడ్డారు.
Read Also: Komatireddy Rajagopal Reddy: బీజేపీ తరపున మరో ‘ఆర్’ గెలవడం ఖాయం
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
కాగా, రేపు కుప్పంలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్.. సీఎం పర్యటన సందర్భంగా సర్వాంగ సుందరంగా కుప్పాన్ని ముస్తాబు చేశారు.. కుప్పాన్ని వైసీపీ జెండాలతో నింపేశారు నేతలు.. 175/175.. ఫస్ట్ టార్గెట్ కుప్పం అంటూ పెయింటింగ్స్ వేశారు. ఇక, శుక్రవారం 3వ విడత వైఎస్ఆర్ చేయూత పథకాన్ని కుప్పంలో ప్రారంభిస్తారు సీఎం.. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 26,39,703 మంది మహిళలకు రూ.4,949.44 కోట్లు లబ్ది చేకూరనుంది. చిత్తూరు జిల్లాలో 1,02,584 మంది లబ్దిదారులకు రూ.192.34 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం.. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 నుండి 60 ఏళ్ల వయసు మధ్య గల అర్హులైన మహిళలకు ఒక్కొక్కరికి రూ. 18,750లను బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. చిత్తూరు జిల్లాకు చెందిన 1,02,584 మంది లబ్దిదారులకు రూ.192.34 కోట్లు లబ్ది చేకూరనుండగా.. ఒక్క కుప్పం నియోజకవర్గానికి చెందిన 15,011 మంది మహిళలకు రూ.28.14 కోట్లు వారి ఖాతాల్లో జమ కానున్నాయి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!