తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా హైదరాబాద్తోపాటు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న రాత్రి కూడా నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Read Also: CM KCR Yadadri Tour: నేడు యాదాద్రికి […]
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇవాళ యాదాద్రిలో పర్యటించనున్నారు.. ఉదయం 10.30 గంటలకు రోడ్డు మార్గంలో యాదగిరి గుట్టకు బయల్దేరి వెళ్లనున్నారు సీఎం దంపతులు.. ఉదయం 11.30 గంటలకు యాదాద్రికి చేరుకోనున్న ఆయన.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఇక, ఆలయ ‘విమాన గోపురం’కు బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. ఇక, తన పర్యటనలో భాగంగా క్షేత్రంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిని […]
* ఏఐసీసీ అధ్యక్ష పదవికి నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు.. రేసులో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్, కమల్నాథ్, ఖర్గే, వేణుగోపాల్, * నేడు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, ద్రవ్యోల్బణం అదుపునకు వడ్డీరేట్లు పెంచే అవకాశం * నేడు జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. అవార్డులను ప్రదానం చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము * నేడు కర్ణాటకలో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర * నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్.. ఉదయం 11:30కు […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి… 27 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు.. పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారాయన.. 27 మందిలో ఇద్దరు మంత్రులు, మరో ఇద్దరు మాజీ మంత్రులు కూడా ఉన్నారని.. మిగిలిన వారు ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జ్ లు, రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు.. ముఖ్యంగా.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175కి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సరిగా పాల్గొనని ప్రజాప్రతినిధులకు హెచ్చరికలు జారీ […]
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బిర్యానీ ఫైటింగ్ వ్యవహారం హోం మంత్రి మహమూద్ అలీ వరకు వెళ్లింది… హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే.. ఇక, ఓల్డ్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు హోటల్స్ తెరిచి ఉండే సందర్భాలు ఉంటాయి… మరికొన్ని రాత్రి 11 గంటలకే మూత పడుతున్నాయి.. ఇంకా కొన్ని హోటల్స్ చాటుమాటుగా.. అర్ధరాత్రి వరకు బిర్యానీ, ఇతర విక్రయాలు కొనసాగిస్తూనే ఉంటాయి.. అయితే, అర్ధరాత్రి హోంమంత్రి మహమూద్ అలీకి ఫోన్ […]
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. ప్రతిపక్ష తెలుగు దేశం కూడా భారతీయ జనతా పార్టీతో మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కారణం అన్నారు.. ఇప్పటికీ బిల్లులు మ్యానువల్ గా జరగడం వెనుక ఉద్దేశ్యాలను ప్రశ్నిస్తున్నాం.. ఆర్ & ఆర్ నిర్ధారణ, నిర్వాసితుల గుర్తింపు లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు.. కేంద్రం నిధులు ఇస్తే పూర్తి చేస్తామని […]
మిర్చి ధర కొత్త రికార్డు సృష్టించింది… వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డులు నెలకొల్పింది… దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 90 వేలు పలికింది… మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు కావడం విశేషం.. హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబత్ పల్లికి చెందిన అశోక్ అనే రైతు మార్కెట్కు మిర్చి తీసుకొచ్చారు.. రైతు తీసుకొచ్చిన మిర్చిని మాదవి ట్రేడర్స్ విక్రయించగా… క్వింటాల్కు రూ.90 వేలు వెచ్చించి కోనుగోలు చేసింది […]
బంగారం కొనేవారికి శుభవార్త చెబుతూ ఇవాళ నిలకడగా ఉన్నాయి పసిడి ధరలు.. ఇదే సమయంలో.. వెండి మాత్రం భారీగా తగ్గింది.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ఇవాళ నమోదైన బంగారం, వెండి ధరల విషయానికి వస్తే.. నిన్నటితో పోలిస్తే ఈరోజు ఇవాళ ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.45,800 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.49,970 పలుకుతోంది. ఇక, […]
ఒకప్పుడు ఎకరాల్లో కొనేవారు.. ఇప్పుడు గజాల్లో కొనుగోలు చేసేందుకే ఇబ్బంది పడుతున్నారు.. ఎస్ఎఫ్టీల్లో కొని సంబరపడాల్సిన పరిణామాలు వచ్చాయి.. అయితే, తెలుగు, తమిళ సినిమాల్లో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటి వాణిశ్రీ భూమి కబ్జాకు గురైంది.. దాదాపు 11 ఏళ్ల క్రితం వాణిశ్రీ భూమిని కొందరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.. ఆ భూమి విలువ ప్రస్తుత మార్కెట్లో రూ.20 కోట్లకు పై మాటేనటి.. అయితే, నకిలీ పత్రాలతో జరిగిన రిజిస్ట్రేషన్ను […]
ఫ్రీగా వస్తే కండోములు కూడా కావాలంటారు అంటూ ఓ మహిళా ఐఏఎస్ అధికారి చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయాయి… ఇంతకీ.. ఆమె ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే విషయానికి వస్తే.. బీహార్లోని పాట్నాలో విద్యార్థులతో ‘శశక్త్ బేటీ.. సమృద్ధ్ బీహార్’ పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు బీహార్ ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ హర్జోత్ కౌర్… అయితే, ఓ విద్యార్థిని నుంచి ఆమెకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.. విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్లు, సైకిళ్లు […]