రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేంద్రంగా… కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భారత్ జోడో యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ… స్వామి వివేకానంద విగ్రహాన్ని సందర్శించకుండా అగౌరవపర్చారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. భారత్ను ఏకం చేసేందుకు కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభించిన రాహుల్.. స్వామి వివేకానందుడిని మర్చిపోవడం సిగ్గుగా అన్పించట్లేదా ? అంటూ మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, స్మృతి ఇరానీ వ్యాఖ్యలను […]
* నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఇవాళ రెండు తీర్మానాలు చేయనున్న అసెంబ్లీ, ఏడు బిల్లులపై చర్చ, ఆమోదం తెలపనున్న శాసనసభ * ప్రకాశం : ఒంగోలులో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయక మంత్రి ఏ.నారాయణస్వామి పర్యటన… కలెక్టరేట్ లోని స్పందన హాల్లో 160 మంది విభిన్న ప్రతిభావంతులకు 35 లక్షల రూపాయల విలువైన పరికరాలను అందించనున్న మంత్రి నారాయణస్వామి.. * విశాఖపట్నం: నేడు ఉమ్మడి విశాఖ జిల్లాల సమన్వయకర్త వైవీ […]
ప్రజా గాయకుడు గద్దర్ అంటే తెలియనివారుండరు.. ఆయనో కరుడుగట్టిన కమ్యూనిస్టు అనిది నిన్నటి మాట.. ఇప్పుడా ఎర్రమందారం కాస్తా.. కలర్ మారబోతుందా? అనే చర్చ సాగుతోంది.. ఆయన ఈ మధ్య తరచూ వివిధ పార్టీల నేతలను కలవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రాజకీయ విశ్లేషకులు.. ఈ కామ్రేడ్.. ఏ పార్టీ కండువైనా కప్పుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. దీనికి కారణం లేకపోలేదు.. ఈ మధ్య వరుసగా కాంగ్రెస్తో పాటు బీజేపీ నేతలను కూడా కలుస్తూ వచ్చారు […]
కేసీఆర్, నితీష్ కుమార్ లాంటి నేతలు ఎన్ని కుయుక్తులు పన్నినా... నరేంద్ర మోడీని ఏమీ చేయలేరు.. ప్రధాని పదవి విషయంలో కేసీఆర్, ఇతర నేతలవి పగటి కలలేనని.. ప్రధాని అంటేనే బాగ్ మిల్కా బాగ్ లా పారిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు విజయశాంతి
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతుంది… తాజా పరిణామాలపై ఫైర్ అయ్యారు ఈటల… నన్ను సభకు రానియొద్దని అయన అనుకున్నట్టునాడు.. కానీ, కేసీఆర్ని సభకు రాకుండా చేసే బాధ్యత నాది అని నేను చెబుతున్నానంటూ వ్యాఖ్యానించారు.. కేసీఆర్ ది శంకిని తనం అని మండిపడ్డ ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీపై అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇంకా ఎన్ని రోజులు ఈ మీటర్ల గురించి మాట్లాడుతారని ప్రశ్నించిన ఈటల […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కొత్త ఆదాయ మార్గంపై దృష్టి సారించింది.. ఇప్పుడు పరిస్థితి కొంత మారినా.. సాధారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర.. గందరగోళమైన పరిస్థితి ఉంటుంది.. ఎక్కడికక్కడ ఓపెన్ స్థలాల్లో ట్రాన్స్ఫార్మర్లు దర్శనమిస్తాయి.. ఇవి ప్రమాదాలకు పొంచి ఉంటాయి.. చివరకు చెత్త కొందరు ప్రజలు అక్కడే పడవేసి వెళ్లిపోతుంటారు.. అయితే, వాటిని ఆదాయ వనరులుగా వినియోగించేకునే ప్లాన్ చేస్తుంది జీహెచ్ఎంసీ.. అంటే.. ప్రజల భద్రతతో పాటు పారిశుధ్యాన్ని పెంపొందిస్తూ.. సిటీ వ్యాప్తంగా […]
భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని.. బీజేపీ టార్గెట్ చేస్తోంది.. పాదయాత్రలో ఉపయోగిస్తున్న కంటైనర్ల నుంచి అనేక రకాల విమర్శలు సందిస్తున్నారు.. అంతేకాదు.. రాహుల్ గాంధీ ధరించిన టీషర్ట్పై ఇప్పుడు చర్చ సాగుతోంది.. అయితే, రాహుల్ గాంధీ టీ షర్ట్ మీద బీజేపీ మాట్లాడి దిగజారుడు పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… రాహుల్ గాంధీని ఏం విమర్శించాలో అర్దం కాక.. టీ షర్ట్ మీద విమర్శలు చేస్తున్నారని […]
తెలంగాణలో వర్షాలు మళ్లీ దంచికొడుతున్నాయి.. మునుపెన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో అన్నట్టుగా.. ఇప్పుడు దాదాపు 115 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టేశాయి.. జులై, ఆగస్టుతో పాటు సెప్టెంబర్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.. జులై నెలలో కురిసిన వర్షాలకు ఊళ్లకు ఊళ్లే కొన్ని వారాల పాటు వరద ముంపునకు గురికాగా.. పూర్తిస్థాయిలో తేరుకోకముందే మరోసారి వర్షాలు అందుకున్నాయి.. దీంతో, మళ్లీ వరద ముంపు పెరుగుతోంది. జులై నెలలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవగా.. ఆగస్టులో […]
మితిమీరిన వేగం కొన్నిసార్లు.. నిర్లక్ష్యం మరికొన్నిసార్లు.. ఎంతోమందిని రోడ్డు ప్రమాదాల రూపంలో పొట్టనబెట్టుకుంటూనే ఉంది… భారత్లో ప్రతీ గంటకు సగటున 50 మంది రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలుపోగొట్టుకుంటున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికలు చెబుతున్నాయి… 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై తాజాగా నివేదిక విడుదల చేసింది ఎన్సీఆర్బీ.. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 4 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.. అయితే, ఏ సమయంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా నివేదికలో […]
భారత్లో బంగారానికి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది.. ఏ శుభకార్యం జరిగినా పసిడి కొనేస్తుంటారు.. ఇక, పెళ్లిళ్లకైతే చెప్పాల్సిన పనేలేదు.. ధరలతో సంబంధం లేకుండా.. అవసరాన్ని బట్టి పెద్ద ఎత్తున బంగారం కొనుగుళ్లు సాగుతుంటాయి.. అయితే, గత రెండు రోజులగా పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. పసిడి ధరలు కిందికి దిగివచ్చాయి.. ఇవాళ్టి ధరల్లో కూడా ఎలాంటి మార్పులేదు.. దీంతో.. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, విశాఖపట్నం ఇలా.. అన్ని ప్రాంతాల్లోనూ బంగారం ధరలు […]