Fact Check: అవునా? 4 జీ, 3 జీ మొబైల్స్ నిలిచిపోతాయా? నిజమెంత..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెలికం మార్కెట్లో కొత్త శకం ప్రారంభమైంది.. ఇప్పటికే భారత్లో 5జీ సేవలు ప్రాంభంమయ్యాయి.. టెలికం సంస్థలు.. 5జీ సేవలను అందించడంలో నిమగ్నమైపోయాయి.. అయితే.. ఇప్పుడు 4జీ అందుబాటులోకి వచ్చినా.. 3జీ కూడా వాడేవారున్నారు.. కానీ, 5జీ ఎంట్రీతో 3జీ, 4 జీ మొబైళ్ల తయారీ నిలిచిపోతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 3జీ, 4జీ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేయాలని మొబైల్ తయారీ సంస్థలకు ప్రభుత్వం సూచనలు జారీ చేసిందని.. ఇక, త్వరలోనే అది అమలు కాబోతోందనేది వాటి సారాశం.. ఇక, కొన్నిసార్లు రియల్ ఏది? వైరల్ ఏది? అనే విషయాలు పట్టించుకోని సోషల్ మీడియాలో అది కాస్త రచ్చగా మారిపోయింది.. అయితే, అందులో నిజం ఎంత? అనే దానిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లారిటీ ఇచ్చింది..
4జీ, 3జీ ఫోన్ల తయారీని నిలిపిపేయాలని వివిధ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందన్న మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న నేపథ్యంలో.. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది.. వైరల్గా మారిన ఆ మెసేజ్ అబద్ధమని స్పష్టం చేసింది.. ఫ్యాక్ట్చెక్ అకౌంట్ ద్వారా ఈ విషయంపై వివరణ ఇచ్చింది.. 4జీ, 3జీ ఫోన్ల ఉత్పత్తిని ఆపేయాలని కంపెనీలకు ప్రభుత్వం సూచించిందన్న మెసేజ్.. ఫేక్ అని తేల్చేసింది. కంపెనీలకు భారత ప్రభుత్వం అలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని పేర్కొంది. అంటే.. దీని ప్రకారం.. 3జీ, 4జీ మొబైల్ ఫోన్ల తయారీ ఆపాలంటూ వైరల్ అవుతున్న వైరల్ న్యూస్కు దీంతో… చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
Also Read
- Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
- Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
- Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
కాగా, భారతి ఎయిర్టెల్ మరియు రిలయన్స్ జియో అక్టోబర్ 1 నుండి దేశంలోని కొన్ని నగరాల్లో 5జీ సేవలను అందించడం ప్రారంభించాయి. ఎయిర్టెల్.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, నాగ్పూర్ మరియు వారణాసిలలో సేవలను ప్రారంభించింది. అదే సమయంలో, జియో ఢిల్లీ, ముంబై, కోల్కతా మరియు వారణాసిలలో సేవలను ప్రారంభించింది. దేశంలోని నగరాల్లో 5జీ సేవ ప్రారంభించబడింది. 5జీ వెబ్ ప్రారంభమైన వెంటనే వారి సమాచారం సెకన్లలో అయిపోతుందని వినియోగదారులు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. అయితే 5జీ వెబ్ యొక్క వేగం 500 నుండి 600 ఎంబీపీఎస్ వరకు ఉన్నట్లు పరీక్షలో వెల్లడైంది. జియో తన కస్టమర్లకు లిమిట్లెస్ 5జీ వెబ్ను అందిస్తోంది. అదే సమయంలో, ఎయిర్టెల్ తన కస్టమర్ల మునుపటి ప్లాన్లో 5జీ వెబ్ సేవను అందిస్తోంది. అయినప్పటికీ, ప్రతి ప్లాట్ఫారమ్లు తమ 5జీ ప్లాన్లను వెల్లడించలేదు.
कुछ मीडिया रिपोर्ट्स में दावा किया जा रहा है कि भारत सरकार ने स्मार्टफोन कंपनियों को 3G और 4G स्मार्टफोन की मैन्युफैक्चरिंग बंद करने का निर्देश दिया है#PIBFactCheck:
▶️ यह खबर #फ़र्ज़ी है
▶️ भारत सरकार ने ऐसा कोई निर्देश नहीं दिया है pic.twitter.com/EE2k3xss3E
— PIB Fact Check (@PIBFactCheck) October 13, 2022
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..