Fact Check: అవునా? 4 జీ, 3 జీ మొబైల్స్ నిలిచిపోతాయా? నిజమెంత..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెలికం మార్కెట్లో కొత్త శకం ప్రారంభమైంది.. ఇప్పటికే భారత్లో 5జీ సేవలు ప్రాంభంమయ్యాయి.. టెలికం సంస్థలు.. 5జీ సేవలను అందించడంలో నిమగ్నమైపోయాయి.. అయితే.. ఇప్పుడు 4జీ అందుబాటులోకి వచ్చినా.. 3జీ కూడా వాడేవారున్నారు.. కానీ, 5జీ ఎంట్రీతో 3జీ, 4 జీ మొబైళ్ల తయారీ నిలిచిపోతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 3జీ, 4జీ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేయాలని మొబైల్ తయారీ సంస్థలకు ప్రభుత్వం సూచనలు జారీ చేసిందని.. ఇక, త్వరలోనే అది అమలు కాబోతోందనేది వాటి సారాశం.. ఇక, కొన్నిసార్లు రియల్ ఏది? వైరల్ ఏది? అనే విషయాలు పట్టించుకోని సోషల్ మీడియాలో అది కాస్త రచ్చగా మారిపోయింది.. అయితే, అందులో నిజం ఎంత? అనే దానిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లారిటీ ఇచ్చింది..
4జీ, 3జీ ఫోన్ల తయారీని నిలిపిపేయాలని వివిధ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందన్న మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న నేపథ్యంలో.. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది.. వైరల్గా మారిన ఆ మెసేజ్ అబద్ధమని స్పష్టం చేసింది.. ఫ్యాక్ట్చెక్ అకౌంట్ ద్వారా ఈ విషయంపై వివరణ ఇచ్చింది.. 4జీ, 3జీ ఫోన్ల ఉత్పత్తిని ఆపేయాలని కంపెనీలకు ప్రభుత్వం సూచించిందన్న మెసేజ్.. ఫేక్ అని తేల్చేసింది. కంపెనీలకు భారత ప్రభుత్వం అలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని పేర్కొంది. అంటే.. దీని ప్రకారం.. 3జీ, 4జీ మొబైల్ ఫోన్ల తయారీ ఆపాలంటూ వైరల్ అవుతున్న వైరల్ న్యూస్కు దీంతో… చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
Also Read
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
- Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
- Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
కాగా, భారతి ఎయిర్టెల్ మరియు రిలయన్స్ జియో అక్టోబర్ 1 నుండి దేశంలోని కొన్ని నగరాల్లో 5జీ సేవలను అందించడం ప్రారంభించాయి. ఎయిర్టెల్.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, నాగ్పూర్ మరియు వారణాసిలలో సేవలను ప్రారంభించింది. అదే సమయంలో, జియో ఢిల్లీ, ముంబై, కోల్కతా మరియు వారణాసిలలో సేవలను ప్రారంభించింది. దేశంలోని నగరాల్లో 5జీ సేవ ప్రారంభించబడింది. 5జీ వెబ్ ప్రారంభమైన వెంటనే వారి సమాచారం సెకన్లలో అయిపోతుందని వినియోగదారులు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. అయితే 5జీ వెబ్ యొక్క వేగం 500 నుండి 600 ఎంబీపీఎస్ వరకు ఉన్నట్లు పరీక్షలో వెల్లడైంది. జియో తన కస్టమర్లకు లిమిట్లెస్ 5జీ వెబ్ను అందిస్తోంది. అదే సమయంలో, ఎయిర్టెల్ తన కస్టమర్ల మునుపటి ప్లాన్లో 5జీ వెబ్ సేవను అందిస్తోంది. అయినప్పటికీ, ప్రతి ప్లాట్ఫారమ్లు తమ 5జీ ప్లాన్లను వెల్లడించలేదు.
कुछ मीडिया रिपोर्ट्स में दावा किया जा रहा है कि भारत सरकार ने स्मार्टफोन कंपनियों को 3G और 4G स्मार्टफोन की मैन्युफैक्चरिंग बंद करने का निर्देश दिया है#PIBFactCheck:
▶️ यह खबर #फ़र्ज़ी है
▶️ भारत सरकार ने ऐसा कोई निर्देश नहीं दिया है pic.twitter.com/EE2k3xss3E
— PIB Fact Check (@PIBFactCheck) October 13, 2022
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..