Fact Check: అవునా? 4 జీ, 3 జీ మొబైల్స్ నిలిచిపోతాయా? నిజమెంత..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెలికం మార్కెట్లో కొత్త శకం ప్రారంభమైంది.. ఇప్పటికే భారత్లో 5జీ సేవలు ప్రాంభంమయ్యాయి.. టెలికం సంస్థలు.. 5జీ సేవలను అందించడంలో నిమగ్నమైపోయాయి.. అయితే.. ఇప్పుడు 4జీ అందుబాటులోకి వచ్చినా.. 3జీ కూడా వాడేవారున్నారు.. కానీ, 5జీ ఎంట్రీతో 3జీ, 4 జీ మొబైళ్ల తయారీ నిలిచిపోతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 3జీ, 4జీ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేయాలని మొబైల్ తయారీ సంస్థలకు ప్రభుత్వం సూచనలు జారీ చేసిందని.. ఇక, త్వరలోనే అది అమలు కాబోతోందనేది వాటి సారాశం.. ఇక, కొన్నిసార్లు రియల్ ఏది? వైరల్ ఏది? అనే విషయాలు పట్టించుకోని సోషల్ మీడియాలో అది కాస్త రచ్చగా మారిపోయింది.. అయితే, అందులో నిజం ఎంత? అనే దానిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లారిటీ ఇచ్చింది..
4జీ, 3జీ ఫోన్ల తయారీని నిలిపిపేయాలని వివిధ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందన్న మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న నేపథ్యంలో.. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది.. వైరల్గా మారిన ఆ మెసేజ్ అబద్ధమని స్పష్టం చేసింది.. ఫ్యాక్ట్చెక్ అకౌంట్ ద్వారా ఈ విషయంపై వివరణ ఇచ్చింది.. 4జీ, 3జీ ఫోన్ల ఉత్పత్తిని ఆపేయాలని కంపెనీలకు ప్రభుత్వం సూచించిందన్న మెసేజ్.. ఫేక్ అని తేల్చేసింది. కంపెనీలకు భారత ప్రభుత్వం అలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని పేర్కొంది. అంటే.. దీని ప్రకారం.. 3జీ, 4జీ మొబైల్ ఫోన్ల తయారీ ఆపాలంటూ వైరల్ అవుతున్న వైరల్ న్యూస్కు దీంతో… చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
Also Read
- 50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
- రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
- 144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
- Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
కాగా, భారతి ఎయిర్టెల్ మరియు రిలయన్స్ జియో అక్టోబర్ 1 నుండి దేశంలోని కొన్ని నగరాల్లో 5జీ సేవలను అందించడం ప్రారంభించాయి. ఎయిర్టెల్.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, నాగ్పూర్ మరియు వారణాసిలలో సేవలను ప్రారంభించింది. అదే సమయంలో, జియో ఢిల్లీ, ముంబై, కోల్కతా మరియు వారణాసిలలో సేవలను ప్రారంభించింది. దేశంలోని నగరాల్లో 5జీ సేవ ప్రారంభించబడింది. 5జీ వెబ్ ప్రారంభమైన వెంటనే వారి సమాచారం సెకన్లలో అయిపోతుందని వినియోగదారులు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. అయితే 5జీ వెబ్ యొక్క వేగం 500 నుండి 600 ఎంబీపీఎస్ వరకు ఉన్నట్లు పరీక్షలో వెల్లడైంది. జియో తన కస్టమర్లకు లిమిట్లెస్ 5జీ వెబ్ను అందిస్తోంది. అదే సమయంలో, ఎయిర్టెల్ తన కస్టమర్ల మునుపటి ప్లాన్లో 5జీ వెబ్ సేవను అందిస్తోంది. అయినప్పటికీ, ప్రతి ప్లాట్ఫారమ్లు తమ 5జీ ప్లాన్లను వెల్లడించలేదు.
कुछ मीडिया रिपोर्ट्स में दावा किया जा रहा है कि भारत सरकार ने स्मार्टफोन कंपनियों को 3G और 4G स्मार्टफोन की मैन्युफैक्चरिंग बंद करने का निर्देश दिया है#PIBFactCheck:
▶️ यह खबर #फ़र्ज़ी है
▶️ भारत सरकार ने ऐसा कोई निर्देश नहीं दिया है pic.twitter.com/EE2k3xss3E
— PIB Fact Check (@PIBFactCheck) October 13, 2022
తాజావార్తలు
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
-
Varalakshmi Vratam Naivedyam Recipes : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. 5 నైవేద్యాలు ఇలా చేస్తే టైమ్ సేవ్.!
-
Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!