Munugode Bypoll: ముగిసిన నామినేషన్ల స్వీకరణ గడువు.. క్యూలైన్లో భారీగా అభ్యర్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి… అన్ని ప్రధాన పార్టీలు కేంద్రీకరించి ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి.. మరోవైపు.. చిన్నపార్టీలు కూడా బరిలోకి దిగాయి.. ఇక, స్వతంత్రులు కూడా భారీ సంఖ్యలో పోటీకి దిగేలా కనిపిస్తోంది.. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది.. అయితే, ఇంకా చాలా మంది అభ్యర్థులు.. నామినేషన్ పత్రాలతో క్యూ లైన్లో వేచిఉన్నారు.. క్యూలైన్లో ఉన్న అభ్యర్థుల నామినేషన్ల వరకు స్వీకరిస్తున్నారు అధికారులు.. మొత్తంగా ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్లు.. సెంచరీ దాటేస్తాయనే చర్చ కూడా సాగుతోంది..
Read Also: Fraud: సినిమాల్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి..!
Also Read
- TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
- OTR: టీఆర్ఎస్ పేరు చుట్టూ కొత్త వివాదాలు..తెలంగాణ రక్షణసేన పేరుకు ఈసీ బ్రేక్స్
- OTR: ఉమ్మడి నల్గొండ పరిధిలోకి అడుగుపెట్టని బీఆర్ఎస్ అగ్రనేతలు...అసలు కారణాలేంటి ?
- CM Revanth Reddy : మిడ్జిల్ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం.. నాడు మీరు నాటిన మొక్కే.. నేడు సీఎంగా..
మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ గడువు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.. అయితే, 3 గంటలలోపు క్యూలైన్ లో ఉన్న వారికి నామినేషన్లు వేసేందుకు అవకాశం ఇచ్చారు.. ఇప్పటికే 70 నామినేషన్లు దాఖలు అయినట్టు అధికారులు చెబుతున్నారు.. క్యూలైన్లో మరో 20 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో సిద్ధంగా ఉన్నారు.. మొత్తంగా 90 నుంచి 100 మధ్య నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కాగా, చివరి రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు.. చివరి నిమిషంలో గద్దర్ పోటీ నుంచి తప్పుకోవడంతో.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు.. ఇక, రేపు నామినేషన్ల పరిశీలన ఉండగా… ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా… నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కించి.. ఫలితాలు ప్రకటించనున్నారు.. ప్రధానంగా మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ జరగనుంది.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండబోతుందని స్పష్టం అవుతోంది. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు. ఇప్పటికే చిన్న లీడర్ల నుంచి బడా లీడర్ల వరకు అంతా మునుగోడుపైనే ఫోకస్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
-
TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Kannappa: యూట్యూబ్లో విష్ణు మంచు ‘కన్నప్ప’
-
OTR: టీఆర్ఎస్ పేరు చుట్టూ కొత్త వివాదాలు..తెలంగాణ రక్షణసేన పేరుకు ఈసీ బ్రేక్స్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..