విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి నేరుగా.. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు.. తన వైజాగ్ పర్యటనపై ఘాటుగా స్పందించిన పవన్ కల్యాణ్.. మీడియాతో ఏం మాట్లాడుతున్నారో లైవ్లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైజాగ్లో అరెస్ట్లు.. అరెస్ట్ అయినవారిని విడిపించేవరకు ఇక్కడే ఉంటానంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించారు.. ముద్దాయిలుగా ఉన్నవారిని, నేరచరిత్ర కలిగిన వారిని బయటికొస్తేనే పిటిషన్ తీసుకుంటానంటూ చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు.. మీరు రాజకీయం చేస్తున్నారా.. ఫ్యాక్షన్ ముఠాలు నడుపుతున్నారా..? అంటూ ప్రశ్నించారు.. ఇక, విజయవాడలో ఒక సభ […]
ఉత్తరాంధ్ర గర్జన నేపథ్యంలో మంత్రులపై జరిగిన దాడి ఘటనలో అరెస్ట్అయినవారిని స్టేషన్ బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చామని చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. 13 మంది మినహా మిగతా అందిరికీ స్టేషన్ బెయిల్ వచ్చిందన్నారు.. ఇక, తన విశాఖ పర్యటనలో ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేనాని.. ఇలాంటి ఆంక్షలు మళ్లీ విధించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించేలా పోరాటం చేసేందుకు ఆయన సిద్ధం అవుతున్నారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.. ఇది ప్రభుత్వంపై పోరాటమే తప్ప.. పోలీసులపై […]
విశాఖ ఎయిర్పోర్ట్ ఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రచ్చగా మారుతోంది.. ఈ ఘటనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను టార్గెట్ చేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విశాఖపట్నం విమానాశ్రయంలో మంత్రులపై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం రాజన్నదొర… పవన్పై విరుచుకుపడడ్డారు.. నేను వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ అభిమానిని.. కానీ, విశాఖ ఘటనతో అయన మీద ఉన్న అభిమానాన్ని పోగొట్టుకున్నాడని వ్యాఖ్యానించారు. పవన్ తన కార్యకర్తలని క్రమశిక్షణలో పెట్టుకోలేపోతున్నారన్న ఆయన.. జన సైనికులలో క్రమశిక్షణ లేక పోవడం […]
బడా బడా బాబుల సంగతి ఏంటో గానీ.. సాధారణ వ్యక్తులు లోన్ అడిగితే మాత్రం.. బ్యాంకులు.. ఆ పేపర్.. ఈ పేపర్ పేర్లతో తమ చుట్టూ తిప్పుకున్న సందర్భాలు అనేకం.. అయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్కి వచ్చిన ఫోన్ కాల్ తీవ్ర కలకలం రేపుతోంది.. తనకు లోన్ మంజూరు చేయకపోతే బ్యాంక్ శాఖను పేల్చేస్తా.. బ్యాంక్ ఛైర్మన్నే కిడ్నాప్ చేసి చంపేస్తానంటూ ఫోన్ చేసి మరీ హెచ్చరించాడు.. తాను రూ. పది లక్షల […]
విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. విశాఖ గర్జన, పవన్ కల్యాన్ విశాఖ టూర్ సందర్భంగా.. విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర మంత్రుల కాన్వాయ్లపై దాడులు జరిగాయని ఆరోపిస్తోంది వైసీపీ.. దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రి విడదల రజని.. విశాఖ నుంచి గుంటూరు చేరుకున్న మంత్రి.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.. విశాఖలో మంత్రులందరి కార్లపై దాడులు చేయటం దారుణమైన […]
విశాఖ ఎయిర్పోర్ట్ ఘటనపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.. అసలు, మంత్రుల కాన్వాయ్పై దాడికి జనసేన అధినేత పవన్ కల్యాణే కారణం అంటున్నారు.. ఈ ఘటనపై స్పందించిన మంత్రి ఆదిమూలపు సురేష్.. మంత్రులు రోజా, జోగి రమేష్ , టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిని ఖండించారు.. ప్రజాస్వామ్యంలో దాడులు మంచివి కావని హితవుపలికిన ఆయన.. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సౌమ్యుడు… ఆయన పై దాడి హేయమైన చర్య అన్నారు. పవన్ […]
ఓ వైపు విశాఖ గర్జన.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన.. దీంతో, విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై జనసేన శ్రేణులు దాడి చేసినట్టు వైసీపీ ఆరోపిస్తోంది.. అయితే, దీనిపై స్పందించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్.. విశాఖ ఎయిర్పోర్ట్లో మంత్రుల మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.. […]
విశాఖ ఎయిర్పోర్ట్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అమర్నాథ్.. విశాఖ గర్జనకు మద్దతుగా వచ్చిన మంత్రులు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై దాడి చేశారని మండిపడ్డారు. గర్జన సభకు ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు లభించింది.. కానీ, జేఏసీ విశాఖ గర్జనకు పిలుపిచ్చిన రోజునే.. పవన్ ఎందుకు విశాఖ పర్యటన పెట్టుకోవాల్సి వచ్చింది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారు జన సైనికులా..? జన సైకోలా..? అంటూ తీవ్రంగా స్పందించారు.. జనసైకోలుగానే జనసేన కార్యకర్తలు ప్రవర్తించారన్న ఆయన.. […]