Fraud: సినిమాల్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోసం చేసేవాడు ఎప్పుడూ కొత్త దారులు వెతుకుతూనే ఉంటాడు.. రకరకాల పేర్లతో కోట్లు కొల్లగొట్టి.. బిచానా ఎత్తేసేవారు ఇప్పుడు ఎంతో మంది తయారయ్యారు.. ఇప్పుడు తాజాగా మరో కొత్త మోసం వెలుగుచూసింది.. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో ఏకంగా రూ. 6 కోట్ల మేరం మోసం చేశారు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వారి బంధువులే టార్గెట్గా ఈ మోసానికి పాల్పడ్డారు.. ఇక, మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు కూడా వాడుకున్నారని పోలీసులు చెబుతున్నమాట.. మోసపోయిన బాధితులు న్యాయం చేయాలంటూ సీసీఎస్ ముందు ఆందోళనకు దిగడంతో.. ఈ ఘటన బయటపడింది.. హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్లు మోసాలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.
Read Also: Munugode : ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ భారీ క్యాంపెయిన్.. ఏకంగా 38మంది
Also Read
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
ఫిల్మ్ ఇండస్ట్రీ, డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్, బొర్వెల్స్… ఇలా పలు రంగాలలో పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారట… సినిమాల్లో పెట్టుబడులు అంటూ.. బడా సినిమాల పేర్లను కూడా వాడేశారు కేటుగాళ్లు.. ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టోరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది.. ఇలా చాలా సినిమాలలో పెట్టుబడులు పెడతామని నమ్మించారిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వాటిలో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు ఇస్తామని నమ్మించిన చీటర్స్… దాదాపు 30 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వారి బంధువుల నుండి 6 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారట.. ఇక, ఎంతకాలమైనా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో.. అనుమానం వచ్చిన బాధితులు.. డబ్బు కోసం అడగడంతో బెదిరింపులకు పాల్పడి.. దాడి చేశారట.. మంత్రులు, ఎమ్మెల్యే ల పేర్లు చెప్పి.. వారి అనుచరులతో బెదిరింపులకు దిగారు.
మోసాలకు పాల్పడ్డ కొంగర అంజమ్మ చౌదరి, ఆమె కూతురు హేమ, కొడుకు కొంగర సుమంత్, నాగం ఉమా శంకర్లపై చట్టపరమైన చర్యలు తీసుకొని.. న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధితులు.. ఇక, బాధితుల ఆందోళనతో కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు.. ఈ కేసులో ప్రధాన సూత్రదారులైన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్లను అదువులోకి తీసుకొని విచారిస్తున్నారు.. ఈ కేసులో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు.. అంటే బాధితుల సంఖ్య పెరిగితే.. రూ.6 కోట్ల మోసం.. మరి ఎన్ని కోట్లకు చేరుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!