Fraud: సినిమాల్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి..!
మోసం చేసేవాడు ఎప్పుడూ కొత్త దారులు వెతుకుతూనే ఉంటాడు.. రకరకాల పేర్లతో కోట్లు కొల్లగొట్టి.. బిచానా ఎత్తేసేవారు ఇప్పుడు ఎంతో మంది తయారయ్యారు.. ఇప్పుడు తాజాగా మరో కొత్త మోసం వెలుగుచూసింది.. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో ఏకంగా రూ. 6 కోట్ల మేరం మోసం చేశారు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వారి బంధువులే టార్గెట్గా ఈ మోసానికి పాల్పడ్డారు.. ఇక, మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు కూడా వాడుకున్నారని పోలీసులు చెబుతున్నమాట.. మోసపోయిన బాధితులు న్యాయం చేయాలంటూ సీసీఎస్ ముందు ఆందోళనకు దిగడంతో.. ఈ ఘటన బయటపడింది.. హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్లు మోసాలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.
Read Also: Munugode : ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ భారీ క్యాంపెయిన్.. ఏకంగా 38మంది
Also Read
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
- Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
ఫిల్మ్ ఇండస్ట్రీ, డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్, బొర్వెల్స్… ఇలా పలు రంగాలలో పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారట… సినిమాల్లో పెట్టుబడులు అంటూ.. బడా సినిమాల పేర్లను కూడా వాడేశారు కేటుగాళ్లు.. ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టోరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది.. ఇలా చాలా సినిమాలలో పెట్టుబడులు పెడతామని నమ్మించారిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వాటిలో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు ఇస్తామని నమ్మించిన చీటర్స్… దాదాపు 30 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వారి బంధువుల నుండి 6 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారట.. ఇక, ఎంతకాలమైనా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో.. అనుమానం వచ్చిన బాధితులు.. డబ్బు కోసం అడగడంతో బెదిరింపులకు పాల్పడి.. దాడి చేశారట.. మంత్రులు, ఎమ్మెల్యే ల పేర్లు చెప్పి.. వారి అనుచరులతో బెదిరింపులకు దిగారు.
మోసాలకు పాల్పడ్డ కొంగర అంజమ్మ చౌదరి, ఆమె కూతురు హేమ, కొడుకు కొంగర సుమంత్, నాగం ఉమా శంకర్లపై చట్టపరమైన చర్యలు తీసుకొని.. న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధితులు.. ఇక, బాధితుల ఆందోళనతో కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు.. ఈ కేసులో ప్రధాన సూత్రదారులైన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్లను అదువులోకి తీసుకొని విచారిస్తున్నారు.. ఈ కేసులో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు.. అంటే బాధితుల సంఖ్య పెరిగితే.. రూ.6 కోట్ల మోసం.. మరి ఎన్ని కోట్లకు చేరుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!