Jeevan Reddy: ప్రజాప్రతినిధులను ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టింది.. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. జిల్లాస్థాయిలో మంత్రి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, పెండింగ్ బిల్లుల వివరాలు సేకరించి అక్టోబరు 31లోగా బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులకు బాధ్యతలు తప్ప నిధులు లేవు.. బాధ్యతల నిర్వహణకు నిధుల కేటాయింపులు జాప్యం.. నిధుల కేటాయింపుపై శ్రద్ధ చూపకపోవడం.. నిధులు కేటాయించకపోవడంతో ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతం అన్నారు..
సారంగాపూర్ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పిటిసిలు, జిల్లా పరిషత్ అధ్యక్షులకు సైతం నిధుల కేటాయింపు లేకపోవడంతో బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేని దుస్థితి నెలకుందని వారు వాపోతున్నారన్నారు. అప్పుల ఊబిలో సర్పంచులు కూరుకుపోయారన్న ఆయన.. గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠధామాలు నిర్మించిన సర్పంచులకు వీళ్ళ తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు ఊబిలో కూరుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. రైతు వేదికలు నిర్మించాలంటూ ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్లకు బిల్లులు చెల్లించడంలో బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఏడాదికి కనీసం లక్ష రూపాయల ఆదాయం కూడా లేని గ్రామ పంచాయతీలకు సైతం ట్రాక్టర్లు కొనుగోలు చేయించడంతో వాయిదాలు కట్టలేని పరిస్థితి నెలకొంది అన్నారు. 2018లో కేటాయించిన కుల సంఘాల భవనాలు నిర్మించిన వారికి సైతం బిల్లులు రావడం లేదని విమర్శించారు.
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
ఇక, మిషన్ భగీరథ నీరు గ్రామాల్లో ఎవరూ తాగడం లేదని.. ఇంటింటికి డబ్బానీరు కొనుగోలు చేసుకుని తాగుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ తో కాంట్రాక్టర్కు తప్ప ఎవరికి ప్రయోజనం లేదని విమర్శించారు. మిషన్ భగీరథ తో ప్రభుత్వం అప్పుల ఊబిలోకి కోరుకుపోయిందన్నారు. మిషన్ భగీరథ నీరు కేవలం 20 కిలోమీటర్ల మేరకే క్లోరినేషన్ ప్రభావం ఉంటుందని, భగీరథ నీరు క్లోరినేషన్ చేసుకునే సదుపాయం గ్రామాల్లో లేకపోవడంతో క్లోరినేషన్ చేసిన నీరు గ్రామాలకు అందడం లేదన్నారు.. టీఆర్ఎస్ నాయకులు ప్రచార ఆర్భాటాలు మాని , గ్రామాల్లో భగీరథ నీటిని పరిశీలించాలని హితవు పలికారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ అనడం హాస్యాస్పదమని అన్నారు జీవన్రెడ్డి.. రాష్ట్రంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్దేనన్న ఆయన.. మంత్రి కేటీఆర్ రాష్ట్ర మొత్తానికి మంత్రి అనే విషయాన్ని మర్చిపోవద్దని హితవుపలికారు.
తాజావార్తలు
-
Team India Series: భారీ సిరీస్కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
-
Dhanush Political Entry: విజయ్కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!