Jeevan Reddy: ప్రజాప్రతినిధులను ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టింది.. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. జిల్లాస్థాయిలో మంత్రి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, పెండింగ్ బిల్లుల వివరాలు సేకరించి అక్టోబరు 31లోగా బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులకు బాధ్యతలు తప్ప నిధులు లేవు.. బాధ్యతల నిర్వహణకు నిధుల కేటాయింపులు జాప్యం.. నిధుల కేటాయింపుపై శ్రద్ధ చూపకపోవడం.. నిధులు కేటాయించకపోవడంతో ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతం అన్నారు..
సారంగాపూర్ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పిటిసిలు, జిల్లా పరిషత్ అధ్యక్షులకు సైతం నిధుల కేటాయింపు లేకపోవడంతో బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేని దుస్థితి నెలకుందని వారు వాపోతున్నారన్నారు. అప్పుల ఊబిలో సర్పంచులు కూరుకుపోయారన్న ఆయన.. గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠధామాలు నిర్మించిన సర్పంచులకు వీళ్ళ తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు ఊబిలో కూరుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. రైతు వేదికలు నిర్మించాలంటూ ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్లకు బిల్లులు చెల్లించడంలో బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఏడాదికి కనీసం లక్ష రూపాయల ఆదాయం కూడా లేని గ్రామ పంచాయతీలకు సైతం ట్రాక్టర్లు కొనుగోలు చేయించడంతో వాయిదాలు కట్టలేని పరిస్థితి నెలకొంది అన్నారు. 2018లో కేటాయించిన కుల సంఘాల భవనాలు నిర్మించిన వారికి సైతం బిల్లులు రావడం లేదని విమర్శించారు.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
ఇక, మిషన్ భగీరథ నీరు గ్రామాల్లో ఎవరూ తాగడం లేదని.. ఇంటింటికి డబ్బానీరు కొనుగోలు చేసుకుని తాగుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ తో కాంట్రాక్టర్కు తప్ప ఎవరికి ప్రయోజనం లేదని విమర్శించారు. మిషన్ భగీరథ తో ప్రభుత్వం అప్పుల ఊబిలోకి కోరుకుపోయిందన్నారు. మిషన్ భగీరథ నీరు కేవలం 20 కిలోమీటర్ల మేరకే క్లోరినేషన్ ప్రభావం ఉంటుందని, భగీరథ నీరు క్లోరినేషన్ చేసుకునే సదుపాయం గ్రామాల్లో లేకపోవడంతో క్లోరినేషన్ చేసిన నీరు గ్రామాలకు అందడం లేదన్నారు.. టీఆర్ఎస్ నాయకులు ప్రచార ఆర్భాటాలు మాని , గ్రామాల్లో భగీరథ నీటిని పరిశీలించాలని హితవు పలికారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ అనడం హాస్యాస్పదమని అన్నారు జీవన్రెడ్డి.. రాష్ట్రంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్దేనన్న ఆయన.. మంత్రి కేటీఆర్ రాష్ట్ర మొత్తానికి మంత్రి అనే విషయాన్ని మర్చిపోవద్దని హితవుపలికారు.
తాజావార్తలు
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!