Devarakonda Srikanth
Author- NTV Telugu-
Beached Giant Whale in Kanyakumari: ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ తిమింగళం.. చూసేందుకు ఎగబడిన జనం
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తీరంలో భారీ తిమింగలం ఒడ్డుకు కొట్టుకురావడం స్థానికంగా సంచలనం రేపింది. మత్స్యకారుల వల్లో చిక్కుకున్న ఈ తిమింగలం సుమారు 10 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు కలిగి ఉన్నట్టు అధికారులు తెలిపారు. వలలో చిక్కుకున్న వెంటనే మత్స్యకారులు దానిని విడిపించేందుకు ప్రయత్నించినా, గాయాలు తీవ్రంగా ఉండటం, ఊపిరి ఆడకపోవడం వల్ల అది ప్రాణాలు కోల్పోయింది. తిమింగలం మృతదేహం ఒడ్డుకు కొట్టుకురావడంతో చుట్టుపక్కల గ్రామాల నివాసులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. […] -
Health Risks of Oversleeping: రోజులో ఎక్కువ సేపు నిద్రపోతున్నారా.. అయితే జాగ్రత్త!
రోజులో ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం మితంగా తినడం ఎంత అవసరమో, ఆలోచనలు సహజమైనప్పటికీ అధిక ఆలోచనలు మానసిక ఒత్తిడికి దారితీసినట్లే, నిద్ర విషయంలో కూడా పరిమితిని అధిగమించడం శారీరక పనితీరుపై ప్రతికూల ప్రభావాలు చూపుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. నిద్రలేమి ఎలా హానికరమో, అలాగే అతి నిద్ర కూడా అంతే ప్రమాదకరమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా పెద్దలు రోజుకు 7–8 గంటలు నిద్రపోతే సరిపోతుంది. అయితే ప్రతిరోజూ 9 గంటలకంటే ఎక్కువ […] -
Snakes In House Wall: గోడలో దాక్కున్న పాములు.. భయపడిపోయిన స్థానికులు
సాధారణంగా పాములను చూస్తే ఎవరైనా ఆమడ దూరం వెళుతుంటారు. కొందరు మాత్రం ధైర్యం చేసి వాటి పట్టుకుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరన్పూర్ జిల్లాలో స్థానికులను భయభ్రాంతులకు గురిచేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సహరన్పూర్లోని ముజఫరాబాద్ మండలంలోని బధేరి ఘోగు గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఒక ఘటన స్థానికులను తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేసింది. అక్కడి ఓ ఇంటి గోడలు మరియు నేల నుంచి వరుసగా వింత శబ్దాలు వినిపించడంతో కంగారు […] -
Talking Robot: మాట్లాడే రోబో తయారు చేసిన 17 ఏళ్ల బాలుడు..ఆశ్చర్చపోయిన గురువులు
భవిష్యత్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ ఇంజినీరింగ్ ఆధీనంలోకి వెళ్లబోతుంది. మనిషి చేసే, చేయలేని పనులను కూడా రోబో చేస్తోంది. అయితే ఓ బాలుడు తనకు తెలిసిన వస్తువులతో మాట్లాడే రోబోను తయారు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్షహర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆదిత్య స్కూల్ అయిపోయనప్పటికి అక్కడే ఉండేవాడు. వైర్లు, సర్క్యూట్లు, పాత టీవీలు, మొబైల్స్ ఏది దొరికినా సేకరించేవాడు. చిన్నప్పటి నుంచే తన […] -
Amazon to Invest in India: భారత్ లో 35 బిలియన్ డాలర్ల పెట్టబడి పెట్టనున్నఅమెజాన్
అమెజాన్ భారత్లో 35 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో దేశంలోని ఇ-కామర్స్, లాజిస్టిక్స్, డేటా సెంటర్లు, డిజిటల్ సేవలు వంటి రంగాల అభివృద్ధికి మరింత దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత మార్కెట్లో ఉన్న విస్తృత అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కంపెనీ తెలిపింది. కొత్త పెట్టుబడితో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, చిన్న, మధ్య తరహా వ్యాపారాల డిజిటల్ వికాసానికి కూడా ఇది తోడ్పడనుంది. అమెజాన్ భారత […] -
Health Risks: పండ్లు, పాలు స్టీల్ పాత్రలో నిల్వ చేయడంతో ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసా..
సాధారణంగా చాలా ఇళ్లలో స్టీల్ పాత్రలనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎక్కువకాలం మన్నడం, శుభ్రంగా ఉండడం వల్ల మహిళలు వీటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వంట చేయడానికి, నీరు నిల్వ చేయడానికి స్టీల్ పాత్రలు మంచివైనప్పటికీ, కొన్ని రకాల ఆహార పదార్థాలు ప్రత్యేకంగా పండ్లు, పాల ఉత్పత్తులు వాటిలో నిల్వ చేయడం ఆరోగ్యానికి హానికరమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టీల్ పాత్రల్లో ఆహారాన్ని ఎక్కువసేపు ఉంచినప్పుడు రసాయన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మ, నారింజ, ద్రాక్ష, […] -
Important Deadlines: పాన్-ఆధార్ ,ITR పూర్తి చేశారా.. ఈ నెల 31 వరకే లాస్ట్ డేట్
2025 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుండటంతో ఆర్థిక మరియు ప్రభుత్వ సంబంధిత చర్యలకు సంబంధించిన కీలక గడువులు దగ్గరపడుతున్నాయి. ముఖ్యంగా ITR దాఖలు, పాన్-ఆధార్ లింకింగ్, రేషన్ కార్డు e-KYC వంటి పనులు ఇంకా పూర్తి చేయనట్లయితే వెంటనే పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ గడువులు ముగిసిన తర్వాత అవకాశాలు ఉండకపోవచ్చని, ఉన్నా భారీ జరిమానాలు విధించబడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. పాన్-ఆధార్ లింకింగ్ చేయకపోతే కొన్ని సందర్భాల్లో బ్యాంక్ ఖాతాలు హోల్డ్లో […] -
Eating Biscuits with Tea: రోజూ ఛాయ్ తో బిస్కెట్ తింటున్నారా.. బీకేర్ ఫుల్
మన దేశంలో చాలామందికి టీతో కలిసి బిస్కెట్లు తినడం రోజువారీ అలవాటుగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో పాటు బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అయితే ఈ అలవాటు శరీరానికి హానికరని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మార్కెట్లో లభించే బిస్కెట్లలో ఎక్కువగా శుద్ధి చేసిన పిండి, చక్కెర, ఉప్పు, ప్రిజర్వేటివ్లు ఉంటాయని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. ఇవి టీతో కలిసి తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి తర్వాత వేగంగా పడిపోతాయంటున్నారు. దీర్ఘకాలంలో […] -
Indigo Auto: ఇండిగో విమానాల రద్ధుతో.. ఇండిగో ఆటో నడిపిన నెటిజన్
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఏర్పడిన గందరగోళాన్ని నెటిజన్లు తమదైన శైలిలో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఓ నెటిజన్ ఇండిగో విమానం థీమ్లో రూపొందించిన ఆటో వెర్షన్ను AI సహాయంతో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. వీడియోలో కనిపించే ఆటో నీలం, తెలుపు రంగులతో అచ్చం ఇండిగో స్టైల్లో రూపుదిద్దుకుంది. బయటకు విమానం రెక్కల్లా కనిపించే డిజైన్లు, పక్కగా ఇంజిన్లా స్టైల్ చేసిన […] -
Winter Vegetables to Avoid:చలికాలంలో ఈ కూరగాయలు తింటున్నారా? అయితే జాగ్రత్త!
చలి తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో ఆహారపు అలవాట్లు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చలికాలం ప్రారంభమైన వెంటనే జలుబు, దగ్గు, అలర్జీ వంటి సమస్యలు పెరుగుతుండడంతో రోజువారీ ఆహారంలో ఉపయోగించే కూరగాయల విషయంలో కూడా శ్రద్ధ వహించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సీజన్లో కొన్ని కూరగాయలు శరీరాన్ని అధికంగా చల్లబరచి ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రమయ్యేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. వైద్యుల ప్రకారం, వంకాయ, బీరకాయ, సొరకాయ, దోసకాయ వంటి కూరగాయలు […]
తాజావార్తలు
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!