Important Deadlines: పాన్-ఆధార్ ,ITR పూర్తి చేశారా.. ఈ నెల 31 వరకే లాస్ట్ డేట్
- ITR దాఖలు, పాన్-ఆధార్ లింక్, రేషన్ కార్డు e-KYC
- వెంటనే పూర్తి చేసుకోవాలన్న నిపుణులు
- ఈ నెల 31తో ముగుస్తున్న గడవు
- వచ్చే ఏడాదిలో భారీగా ఫైన్ చెల్లించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుండటంతో ఆర్థిక మరియు ప్రభుత్వ సంబంధిత చర్యలకు సంబంధించిన కీలక గడువులు దగ్గరపడుతున్నాయి. ముఖ్యంగా ITR దాఖలు, పాన్-ఆధార్ లింకింగ్, రేషన్ కార్డు e-KYC వంటి పనులు ఇంకా పూర్తి చేయనట్లయితే వెంటనే పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ గడువులు ముగిసిన తర్వాత అవకాశాలు ఉండకపోవచ్చని, ఉన్నా భారీ జరిమానాలు విధించబడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. పాన్-ఆధార్ లింకింగ్ చేయకపోతే కొన్ని సందర్భాల్లో బ్యాంక్ ఖాతాలు హోల్డ్లో పడే అవకాశమూ ఉంది. కాబట్టి ఈ పనులను సమయానికి పూర్తి చేయటం అత్యంత అవసరం.
మీరు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ను గడువులోపు దాఖలు చేయకపోయినా, డిసెంబర్ 31 వరకు బెలేటెడ్ రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడవ విడత ముందస్తు పన్ను చెల్లించే చివరి తేదీ డిసెంబర్ 15. ఈ తేదీని మిస్ అయితే సెక్షన్ 234C ప్రకారం వడ్డీ మరియు జరిమానా వర్తిస్తాయి. వార్షిక ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉంటే రూ.1,000 జరిమానా, రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే రూ.5,000 జరిమానా చెల్లించాలి. డిసెంబర్ 31 తర్వాత బెలేటెడ్ రిటర్న్ దాఖలు చేసే అవకాశం కూడా ఉండదు.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
పాన్–ఆధార్ లింకింగ్ కోసం చివరి తేదీ డిసెంబర్ 31, 2025. ఈ తేదీలోపు లింక్ చేయకపోతే పాన్ చెల్లుబాటు కాకపోవడంతో మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఇతర కీలక బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయి. ఈ ప్రక్రియను ఆదాయపు పన్ను వెబ్ పోర్టల్ ద్వారా సులభంగా ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు.
రేషన్ కార్డు e-KYC ప్రక్రియ ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్ సహా అనేక రాష్ట్రాల్లో జరుగుతోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ధాన్యాలు పొందుతున్న లబ్ధిదారులు తప్పనిసరిగా డిసెంబర్ 31లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి.
సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి కూడా డిసెంబర్ 31 అత్యంత కీలకమైన తేదీ. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పట్టణ మరియు గ్రామీణ) కింద గరిష్టంగా రూ.2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందడానికి దరఖాస్తు చేసుకునే గడువు డిసెంబర్ 31 వరకు పొడిగించారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!