ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున, పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నానని, అందుకే రేపటి విచారణకు హాజరుకాలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని, తనకు మరింత సమయం కావాలని ఆయన సిట్ అధికారులను కోరారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ తన సమాధానంలో పేర్కొన్నారు. అయితే విచారణను తన నివాసమైన ఎర్రవల్లి ఫామ్హౌస్లోనే […]
ఆ జిల్లాలో బీజేపీ.. కాంగ్రెస్తో సై అంటే సై అంటోందా? గట్టిగా మాట్లాడుకుంటే…. అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా? హస్తం నేతలు సైతం… మా అభివృద్ధి మంత్రం ముందు మీరెంత? ఉఫ్మని ఊదేస్తామని అంటున్నారా? ఏ జిల్లాలో ఉందా వాతావరణం? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అన్ని పార్టీలు వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం సంగతి ఒక ఎత్తయితే… నారాయణపేట జిల్లాలో మాత్రం […]
మాఘ మాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలోని మొదటి పక్షంలో వచ్చే ప్రదోష వ్రతం 2026, జనవరి 30వ తేదీ శుక్రవారం నాడు వస్తోంది. శుక్రవారం నాడు వచ్చే ఈ ప్రదోషాన్ని ‘భృగు వార ప్రదోషం’ లేదా ‘శుక్ర ప్రదోషం’ అని పిలుస్తారు. శివుని అనుగ్రహంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకునే వారికి ఈ రోజు ఒక గొప్ప అవకాశంగా ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటున్నారు. Health Secrets: నార్మల్ సాల్ట్ మానేసి Pink Salt వాడుతున్నారా.? […]
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్ని బీజేపీ అత్యంత కీలకంగా భావిస్తోందా? రేపు అసెంబ్లీ ఎన్నికలకు ట్రయల్ రన్ అనుకుంటోందా? అందుకే ఢిల్లీ స్థాయిలో వ్యూహాలు సిద్ధమవుతున్నాయా? గల్లీ ప్రచారం కోసం ఢిల్లీ నుంచి అగ్రనేతలంతా రెక్కలు కట్టుకుని రాబోతున్నారా? అసలు కాషాయ దళం ప్లాన్ ఎలా ఉంది? పెద్ద నేతలు ఎవరెవరు రాబోతున్నారు? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలన్న టార్గెట్తో కమలం పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దని జాగ్రత్తలు తీసుకుంటోంది నాయకత్వం. పట్టణ […]
తెలంగాణలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం లోక్సభ వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ, దీనిని అత్యంత ప్రమాదకరమైన ‘కేటగిరి-1’ డ్యామ్గా ప్రకటించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నిర్వహించిన 2025 వర్షాకాలం అనంతర తనిఖీల్లో ఈ ప్రాజెక్టులో అత్యంత తీవ్రమైన లోపాలు ఉన్నట్లు తేలిందని, వీటిని తక్షణమే సరిదిద్దకపోతే బ్యారేజ్ విఫలమయ్యే ప్రమాదం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా గుర్తించిన మూడు అత్యంత సమస్యాత్మక ప్రాజెక్టులలో మేడిగడ్డ ఒకటిగా ఉంది. […]
Nizamabad Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ నామినేషన్ పత్రాలతో పాటు తప్పనిసరిగా మున్సిపాలిటీకి ఎలాంటి బకాయిలు లేవని తెలిపే ‘నో డ్యూ సర్టిఫికెట్’ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మున్సిపాలిటీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను, కుళాయి పన్ను బకాయిలు ఇప్పుడు వసూలవుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అభ్యర్థులు సుమారు 25 లక్షల రూపాయల మేర పాత […]
Himalayan Pink Salt Benefits : మనం రోజూ వాడే నార్మల్ సాల్ట్ను సాధారణంగా సముద్రపు నీటి నుండి లేదా ఉప్పు గనుల నుండి సేకరిస్తారు. దీనిని అధిక స్థాయిలో శుద్ధి (Refine) చేస్తారు. ఈ ప్రక్రియలో ఉప్పులోని ఇతర ఖనిజాలు తొలగించబడి, కేవలం సోడియం క్లోరైడ్ మాత్రమే మిగులుతుంది. ఇది గడ్డకట్టకుండా ఉండేందుకు ‘యాంటీ కేకింగ్’ ఏజెంట్లను కలుపుతారు. అయితే, నార్మల్ సాల్ట్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఇందులో అయోడిన్ కృత్రిమంగా కలుపుతారు. ఇది థైరాయిడ్ […]
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు, మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు అందజేశారు. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, కేసీఆర్ వయస్సు, ఆరోగ్య రీత్యా ఆయనకు పోలీస్ స్టేషన్కు రావాలనే నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు రావచ్చు లేదా హైదరాబాద్ పరిధిలో తనకు అనుకూలమైన మరో ప్రదేశాన్ని సూచించవచ్చని అధికారులు వెసులుబాటు కల్పించారు. కేసీఆర్ సూచించిన ప్రదేశానికే అధికారులు […]
యాదగిరిగుట్ట దేవాలయ ప్రచార శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం విక్రయించే బంగారు , వెండి డాలర్ల లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా ఈ డాలర్లు మాయమైనట్లు తాజాగా నిర్వహించిన అంతర్గత ఆడిట్లో అధికారులు గుర్తించారు. ఆలయ రికార్డుల ప్రకారం ఉండాల్సిన స్టాక్కు, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న డాలర్లకు అస్సలు పొంతన లేకపోవడంతో ఈ మోసం బయటపడింది. అదృశ్యమైన ఈ డాలర్ల మొత్తం విలువ సుమారు 10 లక్షల రూపాయలకు పైనే […]
సూర్యజయంతి రోజైన రథసప్తమి నాడు తిరుమల శ్రీవారు ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఈ శోభాయాత్ర, రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు నిరంతరాయంగా కొనసాగింది. చిన్న శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై మాడ వీధుల్లో మలయప్ప స్వామి విహరిస్తుంటే భక్తులు గోవింద నామస్మరణతో పరవశించిపోయారు. సుమారు 3.45 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండి ఈ వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించారు. కేవలం […]