Telangana: జనవరిలో మంత్రివర్గ విస్తరణ..?
- జనవరిలో క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం..?
- మంత్రుల తొలగింపుల్లేవు.. చేరికలే ఉంటాయన్న పీసీసీ చీఫ్
- శాఖల మార్పులపై కాంగ్రెస్ అధిష్టానమే తుది నిర్ణయం
- రెండు మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయన్న దానిపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రిమండలి విస్తరణపై చాలా రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలో తెరపడే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం, జనవరిలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రిమండలిలో మరో ఇద్దరు మంత్రులను తీసుకోవడానికి వీలుంది, అంటే రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, ప్రస్తుతం కేబినెట్లో ఉన్న ఇద్దరు లేదా ముగ్గురిని తొలగిస్తారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే, ఈ విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
మంత్రివర్గ విస్తరణపై వస్తున్న ఊహాగానాలను మహేష్ గౌడ్ తోసిపుచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలను తప్పిస్తారనే ప్రచారం జరిగింది. దీనిపై మహేష్ గౌడ్ స్పందిస్తూ, ఆ ఇద్దరు మంత్రులు కేబినెట్లో కొనసాగుతారని స్పష్టత ఇచ్చారు. కేబినెట్లో తీసివేతలు ఉండవని, కేవలం చేరికలే ఉంటాయని ఆయన అన్న మాటలు కొందరికి ఊరట కలిగించాయి. కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించిన తర్వాతే ఆయన ఈ ప్రకటన చేశారా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిగాయా అనే చర్చ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.
కొంతమంది మంత్రులపై వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ, వారిని తొలగించే అవకాశం లేదని, అయితే శాఖల మార్పు మాత్రం ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ ఇండికేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శాఖల మార్పులు చేసే విషయంలో కాంగ్రెస్ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుంది, అయితే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి కూడా కొంత స్వేచ్ఛను ఇచ్చినట్లు సమాచారం.
మంత్రివర్గ విస్తరణలో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఈ పదవుల కేటాయింపులో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటారా లేదంటే కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కని జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జనవరిలో జరగబోయే ఈ విస్తరణతో కేబినెట్ పూర్తిస్థాయిలో కొలువుదీరే అవకాశం ఉంది.
Prithvi Shaw Unsold: పాపం పృథ్వీ షా.. ఈసారి కూడా ఎవరూ దేకలే!
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!