Telangana: జనవరిలో మంత్రివర్గ విస్తరణ..?
- జనవరిలో క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం..?
- మంత్రుల తొలగింపుల్లేవు.. చేరికలే ఉంటాయన్న పీసీసీ చీఫ్
- శాఖల మార్పులపై కాంగ్రెస్ అధిష్టానమే తుది నిర్ణయం
- రెండు మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయన్న దానిపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రిమండలి విస్తరణపై చాలా రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలో తెరపడే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం, జనవరిలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రిమండలిలో మరో ఇద్దరు మంత్రులను తీసుకోవడానికి వీలుంది, అంటే రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, ప్రస్తుతం కేబినెట్లో ఉన్న ఇద్దరు లేదా ముగ్గురిని తొలగిస్తారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే, ఈ విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
మంత్రివర్గ విస్తరణపై వస్తున్న ఊహాగానాలను మహేష్ గౌడ్ తోసిపుచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలను తప్పిస్తారనే ప్రచారం జరిగింది. దీనిపై మహేష్ గౌడ్ స్పందిస్తూ, ఆ ఇద్దరు మంత్రులు కేబినెట్లో కొనసాగుతారని స్పష్టత ఇచ్చారు. కేబినెట్లో తీసివేతలు ఉండవని, కేవలం చేరికలే ఉంటాయని ఆయన అన్న మాటలు కొందరికి ఊరట కలిగించాయి. కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించిన తర్వాతే ఆయన ఈ ప్రకటన చేశారా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిగాయా అనే చర్చ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.
కొంతమంది మంత్రులపై వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ, వారిని తొలగించే అవకాశం లేదని, అయితే శాఖల మార్పు మాత్రం ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ ఇండికేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శాఖల మార్పులు చేసే విషయంలో కాంగ్రెస్ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుంది, అయితే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి కూడా కొంత స్వేచ్ఛను ఇచ్చినట్లు సమాచారం.
మంత్రివర్గ విస్తరణలో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఈ పదవుల కేటాయింపులో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటారా లేదంటే కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కని జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జనవరిలో జరగబోయే ఈ విస్తరణతో కేబినెట్ పూర్తిస్థాయిలో కొలువుదీరే అవకాశం ఉంది.
Prithvi Shaw Unsold: పాపం పృథ్వీ షా.. ఈసారి కూడా ఎవరూ దేకలే!
తాజావార్తలు
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!