Telangana: జనవరిలో మంత్రివర్గ విస్తరణ..?
- జనవరిలో క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం..?
- మంత్రుల తొలగింపుల్లేవు.. చేరికలే ఉంటాయన్న పీసీసీ చీఫ్
- శాఖల మార్పులపై కాంగ్రెస్ అధిష్టానమే తుది నిర్ణయం
- రెండు మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయన్న దానిపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రిమండలి విస్తరణపై చాలా రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలో తెరపడే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం, జనవరిలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రిమండలిలో మరో ఇద్దరు మంత్రులను తీసుకోవడానికి వీలుంది, అంటే రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, ప్రస్తుతం కేబినెట్లో ఉన్న ఇద్దరు లేదా ముగ్గురిని తొలగిస్తారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే, ఈ విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
మంత్రివర్గ విస్తరణపై వస్తున్న ఊహాగానాలను మహేష్ గౌడ్ తోసిపుచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలను తప్పిస్తారనే ప్రచారం జరిగింది. దీనిపై మహేష్ గౌడ్ స్పందిస్తూ, ఆ ఇద్దరు మంత్రులు కేబినెట్లో కొనసాగుతారని స్పష్టత ఇచ్చారు. కేబినెట్లో తీసివేతలు ఉండవని, కేవలం చేరికలే ఉంటాయని ఆయన అన్న మాటలు కొందరికి ఊరట కలిగించాయి. కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించిన తర్వాతే ఆయన ఈ ప్రకటన చేశారా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిగాయా అనే చర్చ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.
కొంతమంది మంత్రులపై వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ, వారిని తొలగించే అవకాశం లేదని, అయితే శాఖల మార్పు మాత్రం ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ ఇండికేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శాఖల మార్పులు చేసే విషయంలో కాంగ్రెస్ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుంది, అయితే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి కూడా కొంత స్వేచ్ఛను ఇచ్చినట్లు సమాచారం.
మంత్రివర్గ విస్తరణలో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఈ పదవుల కేటాయింపులో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటారా లేదంటే కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కని జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జనవరిలో జరగబోయే ఈ విస్తరణతో కేబినెట్ పూర్తిస్థాయిలో కొలువుదీరే అవకాశం ఉంది.
Prithvi Shaw Unsold: పాపం పృథ్వీ షా.. ఈసారి కూడా ఎవరూ దేకలే!
తాజావార్తలు
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!