Bhatti Vikramarka : సర్పంచులు గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి
- మధిరలో నూతన సర్పంచులకు డిప్యూటీ సీఎం సన్మానం
- గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న భట్టి
- 2047 విజన్తో తెలంగాణ నిర్మాణం
- సంక్షేమం, పెట్టుబడులపై ప్రభుత్వ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఇటీవల ఎన్నికైన సర్పంచులను డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, విద్య, వైద్య సేవల మెరుగుదలపై సర్పంచులు ప్రధానంగా దృష్టి సారించాలన్నారు.
రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. గ్లోబల్ సమ్మిట్లో 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రదర్శించినట్లు చెప్పారు. 2047 కల్లా రాష్ట్రంలో ఒక లక్ష 30 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు.
Also Read
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
- Hyderabad: స్విట్జర్లాండ్కు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతులు.. రూ.50 కోట్ల మోసం ఆరోపణలతో కొత్త ట్విస్ట్.!
- Drugs Busted: అత్తాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. MDMAతో పాటు భారీగా ఇంజెక్షన్లు స్వాధీనం.!
Komaram Bheem: కోమరంభీం జిల్లాలో 15 మంది మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు!
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 5 లక్షల 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు కుదిరినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. మధిర నియోజకవర్గంలో మొత్తం 131 గ్రామపంచాయతీలకు గాను 90 గ్రామపంచాయతీలలో కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులు గెలవడం చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించారు.
ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మహిళలకు 20 వేల కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, రైతులకు 9 వేల కోట్ల రూపాయలతో రైతు భరోసా అందజేస్తున్నామని చెప్పారు. 2047 నాటికి తెలంగాణను ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు.
Dhurandhar: ధురంధర్ సినిమా.. నిజజీవితంలో రహమాన్ డకైత్ను చౌదరి అస్లాం ఎలా ఎన్కౌంటర్ చేశారు.?
తాజావార్తలు
-
IND vs ENG: అతడు ఎందుకు దండగ.. ఎప్పుడో జట్టు నుంచి తప్పించాల్సింది!
-
2026 Tata Harrier: టాటా హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. 13 JBL స్పీకర్లు, లెవెల్-2 ADASతో అదిరిపోయే ఫీచర్లు
-
Lenin : అఖిల్కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
-
AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పవన్ కల్యాణ్ సహా ఐదుగురు మంత్రుల డుమ్మా..!
-
BCCI: “చేసిన ప్రయోగాలు చాలు.. నువ్వు వెళ్ళిపోరా బాబు”.. గౌతమ్ గంభీర్పై వేటుకు బీసీసీఐ సిద్ధం..?
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!