డెడ్బాడీ డోర్ డెలివరీ కేసుపై కూటమి సర్కార్ స్పెషల్గా దృష్టి పెట్టిందా? ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీకి మూడినట్టేనా? ఈ కేసులో ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టేందుకు కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోందా? ఇందులో ఎమ్మెల్సీ తప్పును నిరూపించగలిగితే… వైసీపీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ని కూడా కదిలించవచ్చని అనుకుంటోందా? ఆ కేసు విషయంలో జరిగిన తాజా డెవలప్మెంట్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని షేక్ చేసిన అంశాల్లో డెడ్బాడీ డోర్ డెలివరీ […]
Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి డూప్లికేట్ గాంధీ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లను లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శల వర్షం కురిపించారు. “భారతదేశ రాజ్యాంగానికి అతీతులా? చట్టాలు వీరికి ఎందుకు వర్తించకూడదు?” అని సంబరపడ్డారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను దోచుకునేందుకు యంగ్ ఇండియా సంస్థ పేరుతో 50 వేల కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న కుట్రలో ఈ కుటుంబం మునిగిపోయిందని […]
ఎమ్మెల్యే దానం నాగేందర్ అలిగారా? లేక భయపడ్డారా? అత్యంత కీలకమైన పార్టీ మీటింగ్కు ఎందుకు డుమ్మా కొట్టారు? దాని గురించి కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆయనకు భయమెందుకు? ఒకవేళ అలిగితే రీజనేంటి? అధికారంలో ఉన్నాసరే… అంత యాక్టివ్గాలేని కాంగ్రెస్ శ్రేణుల్ని రీ ఛార్జ్ చేసే పని మొదలుపెట్టారట తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో కలిసి వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారామె. ఈ సందర్భంలోనే… పలు లోటుపాట్లు బయటపడుతున్నట్టు […]
ఎమ్మెల్సీ నాగబాబుకు ఏపీ కేబినెట్ బెర్త్ దక్కుతుందా? లేదా? ఉన్న ఒక్క ఖాళీని భర్తీ చేసి ఆయనకు మంత్రి పదవి ఇస్తారా? లేక అలాగే వదిలేస్తారా? నాగబాబును మంత్రిని చేస్తానని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పాక కూడా ఇంకా మీన మేషాలు ఎందుకు? లెక్కలు ఎక్కడో తేడా కొడుతున్నాయా? అసలు ఎమ్మెల్సీకి సైరన్ కార్ యోగం ఉందా? లేదా? ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన్ని మొదట రాజ్యసభకు పంపాలనుకున్నా… […]
Hyderabad Rains : హైదరాబాద్ నగర వాసులకు వాతావరణ శాఖ ఆందోళనకరమైన హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం నగరంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు అధికారులు ప్రకటించిన కొద్ది గంటల్లోనే కుండపోత వానలు మొదలయ్యాయి. పశ్చిమ, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఈ వర్షం కుంభవృష్టిలా కనిపిస్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, మరో 3 గంటల పాటు ఈ కుండపోత వర్షం కొనసాగే అవకాశం […]
Toshiba : తోషిబా కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ టీటీడీఐ (ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చాయి. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. వీటితో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్గేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి […]
R.S.Brothers : దక్షిణ భారతదేశంలోని కుటుంబాలలోని అన్ని తరాలవారి అభిరుచులనూ ప్రతిబింబించే విశ్వసనీయ బ్రాండ్ ఆర్.ఎస్. బ్రదర్స్ , 18.04.2025న విజయవాడలో రెండవ షోరూమ్కు శుభారంభం చేసి, తమ రిటైల్ ప్రయాణంలో కీలకమైన మరో ఘట్టాన్ని నమోదు చేసుకుంది! శ్రీ పి.వెంకటేశ్వరులు, శ్రీ ఎస్.రాజమౌళి, శ్రీ టి.ప్రసాదరావు మరియు కీ॥శే॥ పి.సత్యనారాయణ గార్లు దూరదృష్టితో స్థాపించిన ఆర్.ఎస్. బ్రదర్స్` సంప్రదాయం, శైలి, మరియు సరసమైన ధరల సమ్మేళనంతో కుటుంబంలోని అన్ని తరాల వారికి అద్భుతమైన షాపింగ్ అనుభూతిని […]
MMTS Train Case : ఎంఎంటీఎస్ ట్రైన్లో జరిగిన అత్యాచారయత్న ఘటనలో మరో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు అందించిన వాదనలను బాధిత యువతి ఖండించింది. తాను పోలీసులను ఎటువంటి తప్పుదారి పట్టించలేదని స్పష్టం చేస్తూ, కేసును పునఃసమీక్షించాలని ఆమె కోరింది. సికింద్రాబాద్ నుండి మేడ్చల్కు ప్రయాణిస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని బాధితురాలు తెలిపింది. ట్రైన్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఆమె […]
NTT Data-Neisa : డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందిన ఎన్టీటీ డేటా, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫాం సంస్థ నెయిసా నెట్ వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దాదాపు రూ. 10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు త్రైపాక్షిక ఒప్పందం (ఎమ్ఓయూ) కుదుర్చుకున్నాయి. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి ఎ. […]
Mukunda Jewellers : ప్రఖ్యాత జ్యువెలరీ బ్రాండ్ ముకుంద జ్యువెలర్స్ తమ నూతన షోరూమ్ను చందనగర్లో ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇది కేవలం మరో షోరూమ్ ప్రారంభం మాత్రమే కాదు.. జ్యువెలరీ రంగంలో ఒక కొత్త మైలురాయి.. ! ఈ ప్రతిష్టాత్మకమైన షోరూమ్ ద్వారా ముకుంద జ్యువెలర్స్ చందానగర్ ప్రాంతంలో తమ వ్యాపారాన్ని విస్తరించడమే కాకుండా, తొలిసారిగా తమ ఫ్యాక్టరీ ఔట్లెట్ను కూడా పరిచయం చేయనుంది. వినియోగదారులకు నేరుగా ఫ్యాక్టరీ ధరల వద్ద అత్యుత్తమ నాణ్యత గల […]