Mukunda Jewellers : ప్రఖ్యాత జ్యువెలరీ బ్రాండ్ ముకుంద జ్యువెలర్స్ తమ నూతన షోరూమ్ను చందనగర్లో ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇది కేవలం మరో షోరూమ్ ప్రారంభం మాత్రమే కాదు.. జ్యువెలరీ రంగంలో ఒక కొత్త మైలురాయి.. !
ఈ ప్రతిష్టాత్మకమైన షోరూమ్ ద్వారా ముకుంద జ్యువెలర్స్ చందానగర్ ప్రాంతంలో తమ వ్యాపారాన్ని విస్తరించడమే కాకుండా, తొలిసారిగా తమ ఫ్యాక్టరీ ఔట్లెట్ను కూడా పరిచయం చేయనుంది. వినియోగదారులకు నేరుగా ఫ్యాక్టరీ ధరల వద్ద అత్యుత్తమ నాణ్యత గల బంగారు, వెండి, వజ్రాభరణాలు అందించాలన్నదే ఈ ఔట్లెట్ ఉద్దేశం.
ఈ వేడుక 2025, ఏప్రిల్ 19 (శనివారం), ఉదయం 11:30 గంటలకు MAGDREAMS (కామర్షియల్), సర్వే నం. 315/2, 4వ అంతస్తు, చందనగర్ విలేజ్, శేరిలింగంపల్లి మండలం, కేఎల్ఎమ్ మాల్ ఎదురుగా, తెలంగాణ – 500019లో జరగనుంది.
ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గారు హాజరుకానున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ బొగ్గరాపు దయానంద గారు, చందనగర్ కార్పొరేటర్ శ్రీమతి మంజుల గారు, మరియు రఘునాథ్ రెడ్డి గారు సన్మాన అతిథులుగా ఈ వేడుకకు హాజరవుతారు.
ఈ కార్యక్రమం ద్వారా ముకుంద జ్యువెలర్స్ మరొక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. నాణ్యత, విశ్వసనీయత మరియు వినియోగదారులకున్న మక్కువను నిలబెట్టుకుంటూ, ఈ షోరూమ్ విశేష ఆదరణ పొందడం ఖాయం. ఈ వేడుకకు ప్రతి ఒక్కరూ హాజరై, ముకుంద జ్యువెలర్స్ కొత్త విజయానికి భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాం..!
2025 TVS Apache RR 310: టీవీఎస్ నుంచి సూపర్ ప్రీమియం స్పోర్ట్స్ బైక్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే