Off The Record : ఎమ్మెల్యే దానం నాగేందర్ అలిగారా..? లేక భయపడ్డారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే దానం నాగేందర్ అలిగారా? లేక భయపడ్డారా? అత్యంత కీలకమైన పార్టీ మీటింగ్కు ఎందుకు డుమ్మా కొట్టారు? దాని గురించి కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆయనకు భయమెందుకు? ఒకవేళ అలిగితే రీజనేంటి? అధికారంలో ఉన్నాసరే… అంత యాక్టివ్గాలేని కాంగ్రెస్ శ్రేణుల్ని రీ ఛార్జ్ చేసే పని మొదలుపెట్టారట తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో కలిసి వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారామె. ఈ సందర్భంలోనే… పలు లోటుపాట్లు బయటపడుతున్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన సమీక్ష సమావేశాన్ని గురువారంనాడు నిర్వహించారు మీనాక్షి. కానీ… ఈ మీటింగ్కు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ డుమ్మా కొట్టారు. అసలు నిర్వహిస్తున్నదే లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశం. అలాంటిదానికి ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థే రాకపోవడంపై గాంధీభవన్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోందట. దానం అలకతో రాలేదా? వ్యూహాత్మకంగానా అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదికే పనిలో బిజీగా ఉన్నాయి కాంగ్రెస్ శ్రేణులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించారు దానం. తర్వాత… ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండానే… కాంగ్రెస్ బీ ఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి వేటుపడితే…. ముందు వరుసలో దానం నాగేందరే ఉంటారన్న చర్చ జరుగుతోంది. ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా వేరే పార్టీలోకి జంప్ కొట్టడం ఒక ఎత్తయితే… అదే పార్టీ బీ ఫామ్ మీద పోటీ చేయడమంటే… లిటరల్గా ఇరుక్కున్నట్టేనన్న విశ్లేషణలున్నాయి. ఆ కోణంలోనే ఆయనకు ఇబ్బంది తప్పదన్న వాదన బలపడుతోంది. అయితే అదే సమయంలో…దానం ఇలాంటి వాటికి పెద్దగా భయపడే రకం కాదని, సమావేశానికి రాకపోవడం వెనక వేరే కారణాలు కూడా ఉండి ఉండవచ్చంటున్నారు కొందరు.
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో పార్టీ సమస్యలు, నేతల మధ్య సమన్వయం లాంటి అంశాలపై మీటింగ్లో చర్చ జరిగింది. కానీ….అక్కడ దానం నాగేందర్ లేకపోవడంతో అటెన్షన్ ఆయన పైకి వెళ్ళిందట. ఇప్పటికే అనర్హత వేటు అంశం కోర్ట్లో ఉన్నందున, వివిధ వర్గాలు దాని గురించి మాట్లాడుకుంటున్నందున ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉన్నారన్నది కొందరు నాయకుల అభిప్రాయం. అయితే… కొంతకాలంగా ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారని, మెయిన్ రీజన్ అదే అయిఉండవచ్చన్నది మరి కొందరి మాట. గ్రేటర్ హైదరాబాద్లో అధికారులు తన మాట వినడం లేదని మీడియాతో బాహాటంగానే అన్నారు నాగేందర్. అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారాయన. దీంతో అదే ప్రధాన కారణం అయిఉండవచ్చంటున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు నాగేందర్. కానీ పార్టీ నిర్వహించే సమావేశాలకు రాకపోవడం హాట్ టాపిక్ అయింది. పోనీ అందుబాటులో లేరంటే అది నేరే సంగతి. కానీ… సిటీలోనే ఉండి సమావేశానికి రాకపోవడంతో అనర్హత భయం పట్టుకుందా..? లేదా అసంతృప్తితో రాలేదా అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదుకుతున్నాయట కాంగ్రెస్ వర్గాలు. బీఆర్ఎస్లో ఉన్నన్నాళ్ళు కామ్గానే ఉన్నారు ఎమ్మెల్యే. కానీ… కాంగ్రెస్లోకి ఎంటరయ్యాక ఆ పార్టీ స్టైల్ వర్క్ మొదలుపెట్టినట్టున్నారని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.
Also Read
తాజావార్తలు
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!