Bandi Sanjay : డూప్లికేట్ గాంధీ కుటుంబానికి చట్టాలు వర్తించవా..?
- డూప్లికేట్ గాంధీ కుటుంబం అంటూ బండి సంజయ్ ఫైర్
- వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగంపై సంజయ్ విమర్శలు
- AIMIM-కాంగ్రెస్ బంధంపై బీజేపీ ఘాటైన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి డూప్లికేట్ గాంధీ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లను లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శల వర్షం కురిపించారు. “భారతదేశ రాజ్యాంగానికి అతీతులా? చట్టాలు వీరికి ఎందుకు వర్తించకూడదు?” అని సంబరపడ్డారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను దోచుకునేందుకు యంగ్ ఇండియా సంస్థ పేరుతో 50 వేల కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న కుట్రలో ఈ కుటుంబం మునిగిపోయిందని ఆరోపించారు. ఇదంతా యూపీఏ హయాంలోనే బయటపడిందని, నిందితులు అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకున్నారని చెప్పారు. “ఇందులో మోదీ, బీజేపీ పాత్ర ఎక్కడ ఉంది?” అని ఆయన ప్రశ్నించారు.
నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్లో మీకు వాటా ఉందని నమ్మితే, ధర్నా చేయాల్సింది టెన్ జనపథ్ (సోనియా ఇంటి ముందు) అని కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పు చేస్తే ఎవరు అయినా జైలుకెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణలో వక్ఫ్ ఆస్తులపై జరుగుతున్న రాజకీయాల పట్ల బండి సంజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒవైసీ కుటుంబం వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకొని లబ్ధి పొందుతుండగా, పేద ముస్లింలకు ఏ ప్రయోజనం లేదని విమర్శించారు. ఆలయాలు, గురుద్వారా, క్రైస్తవ మత్సకారుల భూములపై కూడా వక్ఫ్ పేరు చెప్పి దొంగపడి పెట్టారని ఆరోపించారు.
Also Read
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మజ్లిస్ చేస్తున్న ఆందోళనకు రేవంత్ ఆర్థికంగా సహకరిస్తున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు. ఈ పరిణామాలను అడ్డుకోకపోతే తలెత్తే సమస్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒవైసీ నిర్వహించబోయే సభ కాంగ్రెస్ స్పాన్సర్డ్ ప్రోగ్రామేనని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఎంఐఎంకు దూరంగా ఉండాలని చెబుతుండగా, వాస్తవంలో కాంగ్రెస్-ఎంఐఎం మధ్య గాఢమైన సహకారం ఉందని అన్నారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటేసి కాంగ్రెస్ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ అంతరాత్మను నమ్ముకొని ఓటేయాలని సూచించారు. ఓటింగ్కు దూరంగా ఉంటే, హైదరాబాద్ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా?.. ఫైబర్ అధికంగా ఉండే ఈ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోండి
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?