Indus Waters Treaty: భారత్ ‘‘రావి’’ దెబ్బ.. పాకిస్తాన్లో నీటి సంక్షోభం ఖాయం..
- రావి కుళాయిని కట్టేస్తున్న భారత్..
- పాకిస్తాన్లో ఈ వేసవిలో తీవ్ర నీటి సంక్షోభం..
- రావి నదిపై పూర్తవుతున్న షాపూర్ కండి ప్రాజెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indus Waters Treaty: ఈ వేసవిలో దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోబోతోంది. ‘‘రావి’’ నీటి కుళాయిని భారత్ మూసివేసింది. ఇన్నాళ్లు ‘‘ఇండస్ వాటర్ ట్రిటీ’’ని అడ్డుపెట్టుకుని భారత వాటా నీటిని కూడా ఎంజాయ్ చేసిన పాకిస్తాన్కు అసలు దెబ్బ తగలబోతోంది. సిందు జలాల ఒప్పందం నిలిపేయడంతో ఇప్పటికే పాక్ సతమతమవుతున్న సమయంలో, మార్చి 31 నాటికి షాపూర్ కండి ప్రాజెక్టును పూర్తి చేయాలని భారత్ అనుకుంటోంది. దీనికి రావి నది నుంచి అదనపు నీటి ప్రవామాన్ని నిరోధించింది. భారత్ వైపు రావి నదిపై ఇన్నాళ్లు సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో పాకిస్తాన్ భారత్ వాటా నీటిని కూడా వాడుకుంది. ఈ ఏప్రిల్ నుంచి మాత్రం పాకిస్తాన్ నీటి సంక్షోభంతో విలవిల్లాడాల్సిందే. జమ్మూ కాశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి జావెద్ అహ్మద్ రాణా సోమవారం ప్రకటించారు.
పాక్ను ఎలా దెబ్బతీస్తుంది.
Also Read
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
ప్రస్తుతం రావి మిగులు జలాలు మాధోపూర్ ద్వారా ప్రవహిస్తున్నాయి. అయితే, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మధ్య దశాబ్ధాలుగా ఉన్న రాజకీయ నిర్లక్ష్యం, గొడవల కారణంగా ఏళ్లుగా నిలిచిపోయిన షాపూర్ కండి బ్యారేజీ నీటి వృధాను అరికడుతుంది. ప్రస్తుతం పాక్ వైపు వెళ్తున్న సింధు నీటిని నిలిపేసి భారత్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని కేంద్ర జల వనరుల మంత్రి సీఆర్ పాటిల్ వారం క్రితం చెప్పారు.
సింధు నది వ్యవస్థలో మూడు తూర్పు నదుల్లో ఒకటైన రావి నీటిపై భారత్కు సంపూర్ణ హక్కులు ఉన్నాయి. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధు జలాల ఒప్పందం జరిగింది. దీని ద్వారా తూర్పు నదులైన సట్లేజ్, బియాస్, రావిపై హక్కులు ఉన్నాయి. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్పై పాక్కు హక్కులు కల్పించబడ్డాయి. అయితే, తూర్పు నదులపై సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో ఇన్నాళ్లు పాక్ మన వాటా నీటిని కూడా దర్జాగా వాడుకుంది. ఇప్పుడు ఈ పరిస్థితి మోడీ ప్రభుత్వం మార్చేసింది.
పాక్ వ్యవసాయం 80 శాతం సింధు జలాలపై ఆధారపడి ఉంది. భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపేసిన తర్వాత పాక్లో వ్యవసాయం దెబ్బతింటుంది. లాహోర్, ముల్తాన్ వంటి నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుంది.
షాపూర్ కండి బ్యారేజ్:
దీనికి 1979లో ప్రణాళిక వేస్తే, 1982లో ఇందిగా గాంధీ ఫౌండేషన్ స్టోన్ వేశారు. 46 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. మోడీ ప్రభుత్వం 2018లో రెండు రాష్ట్రాల వివాదాన్ని పరిష్కరించి ప్రాజెక్ట్ పనుల్ని వేగవంతం చేసింది. మార్చి 31, 2026 నాటికి ఇది పూర్తవుతుంది. దీని ద్వారా 32,000 హెక్టార్లకు సాగునీరు అందుతుంది. ఇదే కాకుండా చీనాబ్పై హైడ్రో పవర్ ప్రాజెక్టుల్ని, జీలం నదిపై వులార్ బ్యారేజ్ పనుల్ని భారత్ వేగంగా చేస్తోంది. దీని వల్ల పాక్కు నీటి కష్టాలు మరింత ఎక్కువ అవుతాయి.
తాజావార్తలు
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!