ఏపీలో పీఆర్సీపీ ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు ప్రభుత్వం పీఆర్సీపై చర్చలు జరిగిపింది. ఇప్పటికే అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికలో ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన అంశాలు లేవని ఉద్యోగ సంఘాలు గళమెత్తాయి. అయితే నిన్న కూడా సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. అయితే నేడు సీఎం జగన్ మరోసారి ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీపై సీఎం సానుకూల ప్రకటన చేస్తారని భావిస్తున్నామన్నారు. […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణకు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దమ్మున్నోడు అనుకున్నా.. కానీ ఇంత పిరికివాడు అని అనుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని జైల్లో పెట్టాడంటే ఎంత భయపడ్డాడో అర్థం అవుతోందని, కృష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడు.. కానీ కంసుడిని ఏం చేశారు.. […]
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన ఆ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారం సమయంలో పరిమితి మేరకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టుకునే ఖర్చును సవరణలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో పార్లమెంట్ సెగ్మెంట్లకు.. అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలకు ఎంత మేర ఖర్చు చేయొచ్చనే అంశంపై సవరణ నోటిఫికేషన్ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్లమెంట్ నియోజవర్గానికి రూ. 95 లక్షలు, […]
ఈ నెల 2వ తేదీన కరీంనగర్లో బీజేపీ చీప్ బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను భగ్నం చేసి పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బండి అరెస్ట్ను ఖండిస్తూ జాతీయ స్థాయి నేతలు తెలంగాణకు వచ్చారు. అయితే నిన్న బండి సంజయ్కు హైకోర్టులో ఊరట లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ బీజేపీ నేతలతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడారు. సంజయ్ అరెస్ట్ తర్వాత జాతీయ […]
ఓ రిటైర్డ్ ఉద్యోగి చెన్నైలో ఉంటున్న కొడుకు దగ్గరకు వెళ్లి వచ్చే సరికి దొంగలు ఇల్లు కొల్లగొట్టిన ఘటన శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తకోనేరు వీధికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి చెన్నైలో ఉన్న తన కొడుకు ఇంటికి తన భార్యతో కలిసి డిసెంబర్ 31న వెళ్లాడు. అయితే చెన్నై నుంచి తిరిగి రావడానికి ఇంటిలో వున్నకారు తీసుకొనిరా అని డ్రైవర్ ను పురామాయించాడు. దీంతో కారుకోసం ఇంటిదగ్గరకు […]
రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా రక్కరి మరోసారి రెక్కలు చాస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో 1,913 కొత్త కరోనా కేసులు రాగా, ఇద్దరు కరోనాతో మృతి చెందారు. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 232 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి […]
ఏపీపీఆర్సీపీపై సీఎం జగన్తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అధికారులు కమిటీ ఇచ్చిన ఫిట్మెంట్ను వ్యతిరేకించినట్లు ఆయన వెల్లడించారు. గత పది పీఆర్సీల్లో ఐఆర్ కంటే ఫిట్మెంట్ తగ్గలేదని, హెచ్ ఆర్ఏ పై అసంబద్ధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారన్నారు. విశాఖ, విజయవాడ, నెల్లూరు టౌన్ లో తప్ప ఎక్కడా 16 శాతం హెచ్ఆర్ఏ వర్తించదని, పెన్షనర్లకు సంబంధించి 70 ఏళ్లకు అదనపు […]
కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. గత నెల మొదటి వారంలో దేశవ్యాప్తంగా 9 వేల లోపు నమోదైన కరోనా కేసులు, తాజాగా ఒక్కరోజులోనే 90వేలకు పైగా నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న నాంపల్లి నుమాయిష్ ఈ ఏడాది పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నందున ఈ నిర్ణయం […]
రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది కరోనా మహమ్మారి. కరోనా వైరస్ కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. డెల్టా వేరియంట్ రూపంలో సెకండ్ వేవ్ సృష్టించిన కరోనా రక్కసి ఒమిక్రాన్ వేరియంట్తో థర్డ్ వేవ్కు బాటలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గత నెల మొదటి వారం వరకు దేశవ్యాప్తంగా సుమారు 9 వేల లోపు కరోనా కేసులు నమోదుకాగ, తాజాగా ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 90వేల పై చిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని నేతల మధ్య సఖ్యత కుదరడం లేదనే వార్తలు వస్తూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి విముఖతతో ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే తాజాగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. దీంతో ఒక్కసారి టీకాంగ్రెస్ సీనియర్ నేతలు ఉలిక్కి పడ్డారు. ఈ పరిణామాల నడుమ జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాన్ని ప్రత్యక్షప్రసారంగా వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్ను క్లిక్ చేయండి.