‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో వసూళ్ళ వర్షాన్ని కురిపిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం 1100కోట్ల మార్క్ను అధిగమించి రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ చిత్రం అన్ని భాషల్లో బ్రేక్ ఈవెన్ను పూర్తి చేసుకుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్లలో ఖాన్, కపూర్లను సైతం వెనక్కి నెట్టి రాఖీ బాయ్ టాప్ ప్లేస్లో నిలిచాడు. […]
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణకు వ్యతిరేకమైన టీడీపీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ గురించి చెప్పడానికి తెలంగాణ వస్తున్నావా రాహుల్ అంటూ… మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ స్పందిస్తూ.. తెలంగాణకు ద్రోహం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్లు ఏ పార్టీ […]
రోజురోజుకు డ్రగ్స్ వాడకం ఎక్కువవుతోంది. ఒత్తిడి లోనైన యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. అయితే డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వారికి కొత్త కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు హైదరాబాద్ కమిషనర్.. సీవీ ఆనంద్ వెల్లడించారు. డ్రగ్స్ వినియోగదారులకి ఉత్సవాల కౌన్సిలింగ్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బయటికి వచ్చి మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటున్న నేపథ్యంలో కొత్త నిర్ణయం తీసుకున్నామన్నారు. వినియోగదారులపై నిరంతరం నిఘా పెట్టబోతున్నట్లు సీటీ పోలీస్ బాస్ పేర్కొన్నారు. వారానికి ఒకసారి వినియోగదారుల రక్త, […]
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేడు వరుస ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో రు. 2.15 కోట్ల విలువ చేసే సిటీ స్కాన్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు.. అనంతరం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత సిటీ స్కాన్ ప్రారంభించారు. దీంతో పాటు సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో సర్జికల్ ఎక్విప్మెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటి […]
బహుదూర్పుర లో డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. 225 గ్రాముల బ్రౌన్ షుగర్, 28 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. నలుగురుని అరెస్ట్ చేశామని, ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు షాహ్జదా సయ్యద్ గతంలో ముంబై డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడని, ఈ కేసులో వైజాగ్ నుంచి గంజాయి హైదరాబాద్ […]
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల పాలిట నిమిషం నిబంధన శాపంగా మారింది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం రోజే.. పలువురు విద్యార్థులకు తీవ్ర నిరాశ ఎదురైంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రావడం ఆలస్యమైందని పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించలేదు అధికారులు. దీంతో తమను అనుమతించాలని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంత బ్రతిమిలాడిన పరీక్షా కేంద్రంలోకి అనుమతించక పోవడంతో.. విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. వేములవాడలో ఇద్దరిని, నిజామాబాద్లో 10 మంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చారని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. దీంతో పలు […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయి ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ అగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ తీర్మానం ద్వారా తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. కళ్ళకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారా? 30 వేల మంది కర్నూలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నారని ఆయన మండిపడ్డారు. పిచ్చోడిలా బీజేపీ నేతలు తిరుగుతున్నారని, చేతగాక వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నారన్నారు. బహిరంగ సభలో […]
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న రైతుల సంఘర్షణ సభలో ఆయన రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే… రాహుల్ సభకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే… పార్టీపైన ఆసంతృప్తితోనే రాజ్గోపాల్రెడ్డి సభకు హజరుకావద్దని నిర్ణయించున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాహుల్ సభ సన్నాహాక సమావేశాల్లో కూడా ఎక్కడా ఆయన కనిపించలేదు. అంతేకాకుండా రాహుల్ […]
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో ప్రొఫెసర్ కోదండరాం కృష్ణ జలాల పరిరక్షణ యాత్రలో భాగంగా వాసవి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు కృష్ణ బోర్డ్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశ్మలో శ్రీశైలం, నాగార్జునసాగర్ లో ఉన్న 15 ఔట్ లెట్స్ కావాలని అడుగుతున్నారన్నారు. ఆర్డీఎస్ 15.9టీఎంసీల రావాలి కానీ సగం కూడా రావడం లేదు. ఈ అంశంపై ఇప్పటికీ కూడా మనకు న్యాయం చెయ్యలేక పోయింది. తప్పని […]
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నేడు, రేపు తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే.. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటనపై విమర్శరాస్త్రాలు సంధించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దీంతో.. తనదైన స్టైల్లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ట్విట్ కౌంటర్ ఇచ్చారు. ‘శ్రీమతి కవిత గారూ…. రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు.. మీరు ఎక్కడ ఉన్నారు? మీ తండ్రి మోడీ […]