IND Playing 11 vs ZIM: జింబాబ్వేతో డూ ఆర్ డై మ్యాచ్.. భారత్ ప్లేయింగ్ XIపై ఆసక్తికర అప్డేట్స్, ఆ ఇద్దరు ఇన్!
- జింబాబ్వేతో భారత్ కీలక పోరు
- భారత జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు
- మూడో స్థానంలో సంజూ శాంసన్
India Playing XI Updates vs Zimbabwe: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేతో కీలక పోరుకు ముందు భారత జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అతడి స్థానంలో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్కు తిరిగి జట్టులో స్థానం దక్కే అవకాశాలు దాదాపు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. జింబాబ్వేపై సంజూ మూడో స్థానంలో ఆడే అవకాశాలు ఉన్నాయి. మెగా టోర్నీలో తిలక్ వరుసగా విఫలమవడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో తిలక్ వర్మ తన అత్యుత్తమ ప్రదర్శనను చేయలేదు. నెదర్లాండ్స్పై 27 బంతుల్లో 31 పరుగులే అతడి అత్యధిక స్కోరు. అమెరికాపై 25, నమీబియాపై 25, పాకిస్తాన్పై 25 రన్స్ చేశాడు. మంచి ప్రారంభాలను బిగ్ ఇన్నింగ్స్గా మార్చడంలో విఫలమయ్యాడు. ఇక దక్షిణాఫ్రికాపై 1 రన్ చేసి పూర్తిగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్లలో 21.40 సగటుతో 107 పరుగులు చేశాడు. తిలక్ స్ట్రైక్ రేట్ కూడా తక్కువగా ఉంది. దాంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది.
Also Read
- Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
- Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
- World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
- IPL 2026: ఓటమి లేకుండా దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బ్యాట్స్మెన్ దూరం..
ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంపై కూడా సందేహలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సుందర్ స్థానంలో ఆడుతాడని తెలుస్తోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ టీమ్ మేనేజ్మెంట్కు ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతడికి మద్దతుగా నిలుస్తున్నాడు. జింబాబ్వేపై మరో అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. సంజూ శాంసన్, అక్షర్ పటేల్ జింబాబ్వేపై ఆడడం దాదాపుగా లాంఛనమే.
Also Read: Suryakumar Yadav Stats: నాకౌట్ మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న సూర్యకుమార్.. ఈ గణాంకాలు చూస్తే షాకే!
జింబాబ్వేతో మ్యాచ్ చెన్నై వేదికగా జరగనున్న నేపథ్యంలో భారత జట్టు కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ పోరు టీమిండియాకు డూ ఆర్ డైగా మారింది. సెమీఫైనల్ ఆశలు నిలబెట్టుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం గెలిస్తే సరిపోదు.. 150 పరుగుల తేడాతో గెలవాలి. అందుకే టీమ్ మేనేజ్మెంట్ సరైన కాంబినేషన్ కోసం చూస్తోంది. మరి కెప్టెన్ సూర్య ఎవరికి అవకాశం ఇస్తాడో. ఎవరు తుది జట్టులో ఉంటారో తెలియాలంటే టాస్ వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?