Tahawwur Rana: ముంబై ఉగ్ర దాడి నిందితుడు తహవ్వూర్ రాణాకు షాక్.. కెనడా కీలక నిర్ణయం!
- 26న భారత్కు రానున్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ
- ముంబై ఉగ్ర దాడి నిందితుడు తహవ్వూర్ రాణాకు షాకిచ్చే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై ఉగ్ర దాడి నిందితుడు తహవ్వూర్ రాణాకు కెనడా షాక్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అతడి పౌరసత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది కూడా చదవండి: AI Summit: ఢిల్లీ ఏఐ సమ్మిట్లో న్యూసెన్స్ సృష్టించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఫిబ్రవరి 26న భారత్ పర్యటనకు వస్తున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి బలపడనున్నాయి. గత ప్రధాని జస్టిన్ ట్రూడో కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మార్క్ కార్నీ ప్రధాని అయ్యాక తిరిగి సంబంధాలు బలపడ్డాయి. ఇక మార్క్ కార్నీ భారత్ పర్యటనకు రాకముందే 26/11 ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి తహవ్వూర్ హుస్సేన్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేయడానికి కెనడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: The Paradise: నాని కోసం రూల్స్ బ్రేక్ చేశాను.. శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ ట్వీట్!
తహవ్వూర్ రాణా (65) పాకిస్థాన్లో జన్మించిన వ్యాపారవేత్త. ప్రస్తుతం భారతదేశంలో నిర్బంధంలో ఉన్నాడు. పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా నిర్వహించిన ముంబై ఉగ్రవాద దాడులతో సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. 2008లో జరిగిన ఉగ్ర దాడిలో 160 మందికి పైగా మృతి చెందారు.
కెనడియన్ ప్రచురణ గ్లోబల్ న్యూస్ నివేదించిన ప్రకారం… ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా (IRCC) తహవ్వూర్ రాణాకు 2001లో పొందిన కెనడియన్ పౌరసత్వాన్ని రద్దు చేయాలనుకుంటున్నట్లు తెలియజేసింది. 1997లో తహవ్వూర్ రాణా కెనడాకు వలస వెళ్లాడు. అయితే ఉగ్ర ఆరోపణలపై కాకుండా తప్పుడు సమాచారం ఆధారంగా పౌరసత్వం మంజూరు చేయబడిందని IRCC తన నోటీసులో పేర్కొంది. 2000 సంవత్సరంలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు కెనడాలో తన నివాసం గురించి తప్పుడు సమాచారం అందించాడని ఆ శాఖ ఆరోపించింది. దరఖాస్తు చేసుకోవడానికి ముందు నాలుగు సంవత్సరాలు ఒట్టావా, టొరంటోలో నివసించానని.. ఆ కాలంలో ఆరు రోజులు మాత్రమే దేశం నుంచి దూరంగా ఉన్నానని పేర్కొన్నాడు. అయితే రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) దర్యాప్తులో ఆ సమయంలో ఎక్కువ సమయం చికాగోలో గడిపాడని.. అక్కడ అనేక ఆస్తులను కలిగి ఉన్నాడని.. ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ, కిరాణా దుకాణం వంటి వ్యాపారాలను నిర్వహించాడని గ్లోబల్ న్యూస్ నివేదిక తెలిపింది. మొత్తానికి తప్పుడు సమాచారం కారణంగా పౌరసత్వం కలిగి ఉండడంతో రద్దు చేస్తున్నట్లు సమాచారం.
ఏప్రిల్ 10న అమెరికా నుంచి రాణాను రప్పించిన తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారికంగా అరెస్టు చేసింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నుంచి ప్రత్యేక విమానంలో అతన్ని న్యూఢిల్లీకి తీసుకొచ్చారు.
తాజావార్తలు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..